కేరళకు రూ. 25 కోట్లు..! కేంద్రాన్ని మించిన ఔదార్యం చూపిన కేసీఅర్..!!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్… ప్రకృతి ప్రకోపంతో విలవిల్లాడుతున్న కేరళ రాష్ట్రానికి అండగా నిలిచారు. తెలంగాణ తరపున రూ. 25కోట్ల రూపాయల సాయాన్ని ప్రకటించారు. అలాగే రెండున్నర కోట్ల విలువైన నీటి శుద్ధి యంత్రాలను కూడా పంపుతున్నారు. అదే సమయంలో… కేరళ కోసం.. ఎవరైనా సీఎంల రిలీఫ్ ఫండ్ కు నిధులి ఇస్తే… వెంటనే ఆ రాష్ట్రానికి పంపేలా ఏర్పాట్లు చేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రూ. 5కోట్లు ప్రకటించారు. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు.. రూ. 5 కోట్లకు అటూ ఇటూగా.. సాయాన్ని ప్రకటించాయి. కేంద్ర ప్రభుత్వం రూ. 100 కోట్లను ఇస్తున్నట్లు ప్రకటించింది. వాజ్‌పేయి అంత్యక్రియలు ముగిసిన తర్వాత ప్రధాని మోడీ… కేరళకు వెళ్లారు. అక్కడి పరిస్థితిని పర్యవేక్షిస్తారు.

కేసీఆర్ ప్రకటించిన రూ. 25 కోట్ల సాయం.. ఓ రకంగా కేంద్ర ప్రభుత్వాన్ని సిగ్గుపడేలా చేస్తోంది. సమాఖ్య వ్యవస్థలో…. రాష్ట్రాలకు అండగా ఉండాల్సిన కేంద్రం … కొన్ని రాష్ట్రాల పట్ల అత్యంత తీవ్రమైన వివక్ష చూపుతోందన్న విమర్శలు చాలా కాలంగా ఉన్నాయి. రాష్ట్రాల నుంచి పన్నుల రూపంలో వచ్చే నిధులను… 57 శాతం తన వద్ద ఉంచుకునే కేంద్రం…. రాష్ట్రాలు ప్రకృతి విపత్తులు ఎదుర్కొన్న సమయంలో ఆదుకునేందుకు ప్రత్యేకంగా ఓ నిధిని నిర్వహిస్తూంటుంటంది. అలాంటి ఏర్పాటు ఉన్నప్పటికీ… మోడీ కేరళకు.. కేవలం రూ. 100 కోట్లు మాత్రమే ప్రకటించారు. సాటి రాష్ట్రాలు … ప్రకటించిన మొత్తంతో పోలిస్తే..ఇది తక్కువే.

గతంలో హుదూద్ తుపాను… విశాఖను చిన్నాభిన్నం చేసినప్పుడు… ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఏరియల్ సర్వే చేశారు. భారీగా నష్టం వచ్చిందని… సుందర నగరం ధ్వంసం అయిందని నిర్ణయించి… రూ. 1000 కోట్ల తక్షణ సాయంగా ప్రకటించారు. ఆ తర్వాత నష్టం వివరాలతో… రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పూర్తి నివేదిక పంపింది. కానీ… ప్రధాని ప్రకటించిన రూ. వెయ్యి కోట్లు కూడా ఇంత వరకూ విశాఖకు రాలేదు. అంత మొత్తం నష్టం జరగలేదని చెప్పి.. రూ. 450 కోట్లకు అటూఇటుగానే విడుదల చేశారు. దీనిపై తీవ్ర విమర్శలు వచ్చినా… తమ మార్క్ లెక్కలు తాము వేసుకున్నారు. ఇప్పుడు కేరళ విషయంలోనూ.. మోడీ అదే చేస్తారని.. దాదాపుగా అందరూ నమ్ముతున్నారు. ఎందుకంటే.. ట్రాక్ రికార్డు అలా ఉంది మరి..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ మానసిక స్థితిపై డౌట్ గా ఉంది : షర్మిల

జగన్ మానసిక పరిస్థితిపై తేడాగా ఉందని బ్యాలెన్స్ తప్పిందేమోనని డౌట్ గా ఉందని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. కడపలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ కు ఓ...

ఖమ్మంలో నామా వైపు టీడీపీ సానుభూతిపరులు !

పరిస్థితి క్లిష్టంగానే ఉన్నా ఖమ్మంలో నామా నాగేశ్వరరావు ధైర్యంగా పోరాడుతున్నారు. బీజేపీ తరపున సరైన అభ్యర్థి లేకపోవడం ఎవరికీ తెలియని వినోద్ రావు అనే వ్యక్తిని బీజేపీ నిలబెట్టింది. బీజేపీకి ఉన్న...

రోహిత్ శ‌ర్మ ఫీల్డ్ లో ఉండ‌డం కూడా ఇష్టం లేదా పాండ్యా…?!

ఈ ఐపీఎల్ లో ముంబై ఆట ముగిసింది. ప్లే ఆఫ్ రేసు నుంచి ఈ జ‌ట్టు దూర‌మైంది. ఐదుసార్లు ఐపీఎల్ విజేత‌గా నిలిచిన ముంబై ఈసారి క‌నీసం ప్లే ఆఫ్‌కు కూడా అర్హ‌త...

డైరెక్టర్స్ డే ఈవెంట్.. కొత్త డేట్‌!

మే 4.. దాస‌రి నారాయ‌ణ‌రావు జ‌న్మ‌దినం. దాస‌రిపై గౌర‌వంతో ఆయ‌న పుట్టిన రోజుని డైరెక్ట‌ర్స్ డేగా జ‌రుపుకొంటోంది చిత్ర‌సీమ‌. నిజానికి ఈ రోజు ఎల్ బీ స్టేడియంలో భారీ ఈవెంట్ జ‌ర‌గాల్సింది. ఎన్నిక‌ల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close