నాన్ బెయిలబుల్ వారెంట్లపై చంద్రబాబు సందేహాలు ఇవే..!

చంద్రబాబుకు నాన్ బెయిలబుల్ వారెంట్లు వచ్చాయని.. మూడు రోజులుగా హోరెత్తిపోతోంది. చంద్రబాబు కూడా.. వరుసగా రెండు రోజుల పాటు వీటిపై స్పందించారు. అయితే రాజకీయ కోణంలోనే.. ఈ నోటీసులకు… కేంద్రానికి ముడి పెట్టారు. విమర్శలు చేశారు. అయితే.. ఈ వ్యవహారంపై.. శనివారం.. ఏజీతోనూ..ఇతర న్యాయనిపుణలతోనూ సమావేశమయ్యారు. ఇందులో వారెంట్లపై సమాధానం లేని ప్రశ్నలు ఎన్నో బయటకు వచ్చాయి. అందులో ప్రధానమైది.. 2010 నాటి కేసు.. డిస్పోజల్ అని… కోర్టు వెబ్‌సైట్‌లో రాసి ఉండటం. అలా ఉన్నా.. వారెంట్లు ఎలా వస్తాయన్నది ప్రధాన సందేహం. అంతే కాదు… అసలు అధికారికంగా ఇంత వరకు.. వారెంట్లు ఏ ఒక్కరికీ అందలేదు. కేవలం మీడియాలో ప్రసారం అవుతున్న కాపీలపైనే ప్రస్తుతం ప్రచారం జరుగుతోంది.

ఈ కేసు ఇప్పుడే తెరపైకి రావడానికి కారణమేమిటి..? 2010లో ధర్నాలో పాల్గొన్న రోజున 62మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి.. ఇప్పుడు పదహారు మందికే పరిమితం కావడం వెనుక ఉన్న లోగుట్టేమిటి..? నాడు తెలుగుదేశంలో ఉండి పార్టీ మారిన కీలక నేతల వివరాలు వారెంట్ల జాబితాలో లేకపోవడానికి కారణం ఏమిటి..? . అధికారికంగా నోటీసులు ఎందుకు పంపించలేదు..? ఇవన్నీ చంద్రబాబుతో పాటు … న్యాయనిపుణులకు వచ్చిన సందేహాలు. వారెంట్లపై రీకాల్ పిటీషన్ వేయడమా లేక, కోర్టుకు నేరుగా హాజరుకావడమా అనే అంశంపైనా చర్చలు జరుపుతున్నారు. సోమవారం అసెంబ్లీ సమావేశాలకు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరవుతారు. ఆ రోజు అందరితో కలిసి చర్చించి నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబు నిర్ణయించారు.

23వ తేదీన రాత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో ఒక ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం అమెరికా పర్యటనకు బయలుదేరాల్సి ఉంది. ప్రకృతి వ్యవసాయం పై ఐక్యరాజ్యసమితిలో చంద్రబాబు ప్రసంగించాల్సి ఉంది. ఈ ప్రయాణానికి ప్రతిబందకాలు కల్పించేందుకే ధర్మాబాద్ కోర్టు నాన్ బెయిల్ బుల్ వారెంట్ ను తెరపైకి తీసుకువచ్చారని తెలుగుదేశం వర్గాలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. అయితే ప్రభుత్వ ఉన్న త స్థాయి వర్గాలు ఈ వాదనను కొట్టిపారేస్తున్నాయి. ముఖ్యమంత్రి హోదాలో విదేశీ పర్యటనకు వెళ్తున్నందున… నిబంధనలేమీ అడ్డు కాదని చెబుతున్నారు. అయితే ఈ కేసు విషయంలో చంద్రబాబు అనుమానాలకు మాత్రం క్లారిటీ ఎప్పుడు వస్తుందో మరి..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close