ముందస్తు ముందే కాదు..! ఆ నాలుగు రాష్ట్రాలతోనే..!!

తెలంగాణ ముందస్తు ఎన్నికలపై ఢిల్లీలో ఒకే రోజు రెండు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. నాలుగు రాష్ట్రాల కంటే ముందే ఎన్నికలు జరుగుతాయన్న ప్రచారానికి ఎన్నికల సంఘం దాదాపుగా పుల్‌స్టాప్ పెట్టింది. నాలుగు రాష్ట్రాలతో పాటు ఐదో రాష్ట్రంగా తెలంగాణకు ఎన్నికలు జరపాలని దాదాపుగా నిర్ణయించుకుది. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, మిజోరాంతో పాటే… తెలంగాణలో ఎన్నికలు నిర్వహించాలని భావిస్తోంది. సీఈసీ రావత్‌ ఆధ్వర్యంలో కేంద్ర ఎన్నికల సంఘం భేటీ అయింది. కొద్ది రోజుల క్రితం తెలంగాణలో పర్యటించిన ఉమేష్‌ సిన్హా కమిటీ నివేదికను పరిశీలించారు. తెలంగాణలో ఎన్నికలకు అన్ని సిద్ధంగా ఉన్నాయని ఉమేష్ సిన్హా కమిటీ నివేదిక ఇచ్చింది. ఓటర్ల జాబితాపై ప్రతిపక్షా అభ్యంతరాలను తోసిపుచ్చారు. వారం పది రోజుల్లో కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణలో పర్యటించిన తర్వాత ఎన్నికల తేదీలపై ఈసీ తుది కసరత్తు చేయనుంది. అక్టోబర్ రెండో వారంలో 5 రాష్ట్రాల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని ఈసీ వర్గాలు చెబుతున్నాయి.

మరో వైపు తెలంగాణలో ముందస్తు ఎన్నికల అంశంలో కేంద్ర ఎన్నికల సంఘం, తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. ముందస్తు వల్ల ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగదని.. ఓటర్ల జాబితాలో కూడా అవకతవకలు సరిదిద్దకుండా ఎన్నికలకు వెళితే ఓటింగ్‌పై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని సిద్ధిపేటకు చెందిన వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఎన్నికలు సరైన సమయంలో జరిగితే 2019, జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన 20 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంటుందని.. ఇప్పుడా అవకాశాన్ని వారు కోల్పోతున్నారని పిటిషనర్ వాదించారు.
హడావుడిగా ఎన్నికలు జరిగితే పారదర్శకత లోపించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది. సీఈసీ, తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. దీనిపై వారం రోజుల్లోగా ఇరు వర్గాలు సమాధానం చెప్పాలని ఆదేశాలు జారీచేసింది.

కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి కూడా.. ఓటర్ల జాబితాలో అవకతవకలపై పిటిషన్ వేశారు. న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందని… కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి అన్నారు. ఈసీ తీరు చూస్తూంటే.. కేసీఆర్ తో కుమ్మక్కయ్యారనే అనుమానం కలుగుతోందని ఆయన వ్యాఖ్యానించారు. ఓటర్ల సవరణ గడువును కుదించడం సరికాదుని నాలుగు నెలల్లో చేయాల్సిన పని 4 వారాల్లో సాధ్యం కాదని శశిధర్ రెడ్డి చెబుతున్నారు. మొత్తానికి తెలంగాణ ముందస్తుపై ఢిల్లీలో ఒకడుగు ముందుకు..మరో అడుగు వెనక్కి పడినట్లయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నిర్లక్ష్యమే ముంచింది…కాళేశ్వరంపై నిపుణుల మధ్యంతర నివేదిక

కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వానికి నేషనల్ డ్యాం సేఫ్టీ మధ్యంతర నివేదికను అందజేసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించి ఎలాంటి చర్యలు చేపట్టాలో ప్రభుత్వానికి సూచించింది.వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని...

పోస్టల్ బ్యాలెట్ ట్రెండ్ – విప్లవమే !

ఐదేళ్ల పాలనలో తాను చాలా విప్లవాలు తెచ్చానని జగన్ రెడ్డి చెబుతూ ఉంటారు. విప్లవం అంటే ఆ రేంజ్ అనుకుంటున్నారో కానీ ఆయన కానీ ఆయన రచయితలు కానీ ఆ పదాన్ని...

యార్లగడ్డ లక్ష్మీ ప్రసాదూ కూటమికే ప్రచారం చేస్తారట !

జగన్ ఓటమి ఖాయమని తేలిపోయిందని అంచనాకు వచ్చిన భజన బ్యాచ్ లో కొంత మంది తమ పాత పరిచయాలను అడ్డం పెట్టుకుని బయటకు వచ్చి కూటమికి మద్దతు ప్రకటిస్తున్నారు. యార్లగడ్డ...

గ్రేటర్ లో వర్షం పడితే ఇంతేనా..!?

గ్రేటర్ హైదరాబాద్ లో మంగళవారం కురిసిన కుండపోత వర్షం నగరాన్ని అతలాకుతలం చేసింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వరదనీరుతో రోడ్లు, వీధులన్నీ నిండిపోయాయి. దాదాపు రెండు గంటలపాటు వర్షం దంచి కొట్టడంతో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close