జగన్ ఇక కోర్టుకు వారానికి రెండు, మూడు రోజులు హాజరవ్వాలా..?

వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సడెన్ షాక్ తగిలింది. అక్రమాస్తుల కేసుల్లో ఆయన ఇక వారానికి రెండు, మూడు రోజుల పాటు విచారణకు హాజరవ్వాల్సిన పరిస్థితి ఏర్పుతోంది. దానికి కారణం.. అక్రమాస్తుల కేసుల్లో కొన్నింటిపై ఉన్న స్టేలకు పొడిగింపు రాకపోవడమే. అక్రమాస్తుల కేసుల్లో గతంలో ఇచ్చిన స్టే ఉత్తర్వులను హైకోర్టు పొడిగిస్తేనే వీటి విచారణను నిలిపివేస్తామని సీబీఐ ప్రత్యేక కోర్టు శుక్రవారం స్పష్టం చేసింది. అలాగే ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌, ఓఎంసీ కేసుల్లోనూ కోర్టు విచారణ వేగం కానుంది. జగన్‌ కేసుల్లో పలువురు నిందితులు సీబీఐ కోర్టు విచారణను నిలిపివేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించగా.. విచారణను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.

అయితే క్రిమినల్‌ కేసులో కింది కోర్టుల్లో విచారణ ప్రక్రియను నిలిపివేస్తూ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల గడువు ఆరు నెలలు దాటితే.. ఆయా కేసుల్లో తాజాగా స్టే పొడిగిస్తూ ఉత్తర్వులు లేకపోతే ఆ కేసుల విచారణ ప్రక్రియను కొనసాగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అంతే కాదు.. పొడిగించాలంటే.. దానికి స్పష్టమైన కారణాన్ని హైకోర్టు చెప్పాల్సి ఉంటుంది. జగన్‌, ఎమ్మార్‌, ఓఎంసీ కేసులకు సంబంధించి ఆ 6 నెలల గడువు ముగిసిపోయింది. ఈ నేపథ్యంలో మళ్లీ నిందితులు తాజాగా హైకోర్టు నుంచి స్టే పొడిగింపు ఉత్తర్వులు తెచ్చుకుంటేనే విచారణ నిలిపివేస్తామని.. లేదంటే విచారణను కొనసాగిస్తామని సీబీఐ కోర్టు తేల్చిచెప్పింది. తదుపరి విచారణలోగా స్టేను పొడిగిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీచేయకపోతే.. సీబీఐ కోర్టులో విచారణ సాగడయం ఖాయమే.

ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబుపై అనేక కేసులు పెండింగ్‌లో ఉన్నాయని.. స్టేలు తెచ్చుకున్నారని వైసీపీ నేతలు పదే పదే ఆరోపణలు చేస్తూ ఉంటారు. అలాంటి స్టేలు ఉన్న కేసులు ఏమైనా ఉంటే… చూపించాలని టీడీపీ నేతలు సవాళ్లు చేస్తూనే ఉంటారు. కానీ వైసీపీ నేతలు చంద్రబాబుపై విమర్శలు “స్టే”లను ఆయుధంగా చేసుకుంటారు. ఇప్పుడా స్టేలు తన అక్రమాస్తుల కేసుల్లో తొలగిపోవడం జగన్ కు చ అదే జగన్ కు చిక్కులు తెచ్చి పెట్టింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బండ్ల గణేష్ పై క్రిమినల్ కేసు..!!

సినీ నిర్మాత బండ్ల గణేష్ పై క్రిమినల్ కేసు నమోదైంది. హీరా గ్రూపు సీఈఓ నౌహీరా షేక్ ఫిర్యాదు ఆధారంగా ఉన్నాతాధికారుల ఆదేశాల మేరకు ఫిలింనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. బండ్ల...

ఏపీ ఉద్యోగుల చైతన్యం – 4 లక్షలకుపైగా పోస్టల్ బ్యాలెట్స్ !

ఏపీలో పోస్టల్ బ్యాలెట్స్ ఎప్పుడూ లేనంత ఎక్కువగా ఉంటున్నాయి. ఈ సారి ఉద్యోగుల్లో మరింత ఎక్కువగా చైతన్యం కనిపిస్తోంది. ఎన్నికల విధులు... ఎన్నికల సంబంధిత విధుల్లో ఉండేవారు పోస్టల్ బ్యాలెట్స్ వినియోగించుకోవచ్చు....

గవర్నర్ పై లైంగిక ఆరోపణలు..!!

వెస్ట్ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ పై రాజ్ భవన్ లో పని చేసే మహిళా ఉద్యోగి సంచలన ఆరోపణలు చేసింది. ఉద్యోగం పేరిట ఆనంద్ బోస్ తనను లైంగికంగా వేధించారంటూ...

రిజర్వేషన్లపై కేసీఆర్ సైలెన్స్… కవిత కోసమేనా..?

దేశవ్యాప్తంగా రిజర్వేషన్లు, రాజ్యాంగంపై రగడ కొనసాగుతోంది. బీజేపీకి వేసే ప్రతి ఓటు రిజర్వేషన్ల రద్దుకు వేసినట్లేనని, రాజ్యాంగం రద్దుకు మద్దతు ఇవ్వడమేనని కాంగ్రెస్ వాదిస్తుండగా.. తాము రాజ్యాంగానికి వ్యతిరేకం కాదని, రిజర్వేషన్లను ఎట్టి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close