కర్ణాటకలో బీజేపీ ఓడిపోతే సాక్షి ఇంత బాధపడుతోందేంటి..?

ఏపీలోనో.. తెలంగాణలోనే… టీడీపీ ఒక్క వార్డు మెంబర్ స్థానంలో ఓడిపోతే.. అది సాక్షి పేపర్‌లో కచ్చితంగా బ్యానర్ అవుతుంది. అవకపోతే.. ఆశ్చర్యపోవాలి. అదే వైసీపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా… ఆ వార్తకు పెద్దగా ప్రాధాన్యం ఉండదు. అది వాళ్ల స్ట్రాటజీ. అంత వరకూ బాగానే ఉంటుది. కానీ.. బీజేపీ ఓడిపోతే… ఎందుకు .. అదో చిన్న విషయం అన్నట్లుగా దాచి పెట్టడం..?. కర్ణాటకలో జరిగిన ఉపఎన్నికల్లో బీజేపీ ఘోరపరాజయం పాలైంది. జాతీయ మీడియాలన్నీ… ప్రముఖంగా గంటల తరబడి ఫలితాలు ప్రకటించాయి. రౌండ్ల వారీ.. ఫలితాలు ఇచ్చాయి. బీజేపీకి ఆ దుస్థితి ఎందుకొచ్చిందో… కాంగ్రెస్ – జేడీఎస్ కూటమి ఎందుకు సక్సెస్ అయిందో ఎనాలసిస్ ఇచ్చారు. తెలుగు చానళ్లు కూడా.. ఉత్సాహంగా కవరేజీ ఇచ్చాయి.కానీ ఒక్క సాక్షి మీడియా మాత్రం… అదేదో మన దేశానికి సంబంధం లేదన్నట్లుగా… ఇక్కడెవరికీ ఆసక్తి లేని వార్తన్నట్లుగా కవర్ చేసింది. ఒక్క టీవీ కవరేజీలోనే కాదు.. పేపర్లోనూ అంతే.. అంటీ ముట్టనట్లుగా… రిజల్ట్ ప్రకటించి వదిలేసింది. అతి చిన్న వార్త ప్రచురించింది. మిగిలిన అన్ని పత్రికలూ బ్యానర్ కథనాలు రాశాయి. పైగా రాతల్లోనూ… నిరాశ అంటూ… తను బాధపడిపోయింది.

నిజానికి కర్ణాటక ఉపఎన్నికలు.. దేశవ్యాప్తంగా ఉత్కంఠను రేపాయి. ఎందుకంటే.. కాంగ్రెస్ – జేడీఎస్ కూటమి ఎలా వర్కవుట్ అవుతుందనేదానికి.. ఫస్ట్ టెస్ట్.. ఈ ఉపఎన్నికలే. దేశంలో ఓ కొత్త కూటమికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాంటి సమయంలో.. ఈ ఫలితాలు… ఆ ప్రయత్నాలను.. తుంచడమో.. పెంచడమో చేయడం ఖాయం. అందుకే.. అందరూ ఆసక్తి చూపించారు. బహుశా.. సాక్షి కూడా చూపించి ఉండేదేమో..? భారతీయ జనతా పార్టీ కనీసం బళ్లారిలో గెలిచినా… హడావుడి చేసి ఉండేదమో..? కానీ.. జగన్ కు దేవుడిచ్చిన అన్నయ్య ఇలాకాలో పట్టుకోల్పోవడం… సాక్షికి నచ్చినట్లు లేదు. బీజేపీ ఓడిపోవడం.. అసలు సహించినట్లు లేరు.

కొన్నాళ్ల కిందట కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ.. నేరుగా బీజేపీకే మద్దతు ప్రకటించారు. ఆ పార్టీ అభ్యర్థుల కోసం.. వైసీపీ నేతలు సీమ జిల్లాల నుంచి వెళ్లి పని చేశారు. ముఖ్యంగా.. గాలి జనార్ధన్ రెడ్డి వర్గీయుల కోసం… కొన్ని వందల మంది బళ్లారి ఏరియాకు వెళ్లారు. ఇక… యడ్యూరప్పతో.. విజయసాయిరెడ్డి.. ఓ హోటల్‌లో కూర్చుని లెక్కలు చూసుకుంటున్న ఫోటోలు హైలెట్ అయ్యాయి. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో బీజేపీకే… జగన్ మీడియా మద్దతు పలికినట్లుగా కథనాలు ప్రచురించింది. ఆ అనుబందంతో ఏమో కానీ.. ఇప్పుడు.. కర్ణాటకలో బీజేపీ ఓడిపోవడం తట్టుకోలేకపోయింది. ఎక్కువగా కవరేజీ ఇవ్వకుండా.. కవర్ చేసుకుంది. బీజేపీతో జగన్ బంధమేమిటని.. అందరూ ప్రశ్నిస్తూంటారు కానీ… జగన్ మీడియా మాత్రం.. ఇలాంటి కథనాలతో.. వైసీపీ – బీజేపీ మధ్య బంధమేమిటో.. ఇట్టే చెప్పేస్తూ ఉంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఖాతాల్లో డబ్బులేయలేదు ..డ్రామాలే !

ఓటర్ల ఖాతాల్లో పధ్నాలుగు వేల కోట్లు జమ చేస్తున్నట్లుగా వైసీపీ చేసిన డ్రామాలు తేలిపోయాయి. అంతా ఉత్తదేనని తేలిపోయింది. హైకోర్టు శుక్రవారం ఒక్క రోజు నగదు జమ చేయడానికి చాన్సిచ్చింది. బ్యాంకులు ప్రారంభం...

ఎంపీని చేస్తానని తల్లిని కూడా మోసం చేసిన జగన్ : షర్మిల

జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వంపై షర్మిల సంచలన విషయాలు బయట పెట్టారు. షర్మిల రాజకీయాన్ని కించ పరిచేందుకు ఆమెకు పదవీ కాంక్ష అని..డబ్బులు అడిగితే ఇవ్వలేదని కాంగ్రెస్ పార్టీలో చేరారని జగన్ విమర్శలు...

నగదు బదిలీపై ఏపీ సర్కార్‌కు మరోసారి “లెంగ్తీ క్వశ్చన్స్” వేసిన ఈసీ !

ఓటర్ల ఖాతాలో నగదు జమ చేయాలని తెగ ఆత్రపడుతున్న ఎన్నికల సంఘానికి ఈసీ మరోసారి షాకిచ్చింది. ఏపీ సీఎస్ జవహర్ రెడ్డికి ఈసీ మరో లేఖ రాసింది. జనవరి 2024...

వారంతా బీజేపీలో చేరగానే పునీతులయ్యారా..?కేటీఆర్ ఫైర్

ఢిల్లీ మద్యం కుంభకోణంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ అనేది ప్రభుత్వ అంతర్గత వ్యవహారమని, ప్రభుత్వాలు పాలసీలను మార్చడం సాధారణమన్న కేటీఆర్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close