ఎన్టీఆర్ బ‌యోపిక్‌: అన్న‌గారి మాట‌లే వినిపిస్తాయా?

ఎన్టీఆర్ బ‌యోపిక్ షూటింగ్ శ‌ర‌వేగంగా సాగుతోంది. ఈనెలాఖ‌రుకి `క‌థానాయ‌కుడు` భాగానికి సంబంధించిన షూటింగ్ పూర్త‌వుతుంది. డిసెంబ‌రు 20 నాటికి `మ‌హా నాయ‌కుడు` కూడా అయిపోతుంది. త్వ‌ర‌లో బాల‌య్య డ‌బ్బింగ్ కూడా మొద‌లెట్టేస్తారు. అయితే… ఈసారి బాల‌య్య‌కు డ‌బ్బింగ్ శ్ర‌మ కాస్త త‌గ్గింద‌నే చెప్పాలి. అదెలాగంటే…. ఈ సినిమాలో ఎన్టీఆర్ సినిమాల‌కు సంబంధించిన మ‌రపురాని స‌న్నివేశాల్ని చూపిస్తారు. ఉదాహ‌ర‌ణ‌కు బొబ్బిలిపులిలోని కోర్టు సీను, దాన‌వీర శూర‌క‌ర్ణ‌లోని `ఏమంటివి ఏమంటివి` లాంటి సన్నివేశాలన్న‌మాట‌.

అయితే.. ఈ స‌న్నివేశాల‌కు ఎన్టీఆర్ పాత గొంతునే వినిపిస్తార‌ని స‌మాచారం. అప్ప‌టి ఎన్టీఆర్ డైలాగులు.. ఇప్ప‌టికీ అభిమానుల‌కు గుర్తే. వాటిని నంద‌మూరి ఫ్యాన్స్ మాత్ర‌మే కాదు, తెలుగు ప్రేక్ష‌కులూ ప‌దే ప‌దే వ‌ల్లివేసుకుంటారు. అలాంటి సంభాష‌ణ‌ల్ని బాల‌య్య గొంతులో కంటే.. అన్న‌గారి గొంతులోనే వినిపిస్తే బాగుంటుంద‌న్న‌ది క్రిష్ ఆలోచ‌న‌. అందుకే… అప్ప‌టి ఎన్టీఆర్ డైలాగుల‌నే ఇక్క‌డా వాడుకోవాల‌ని భావిస్తున్నారు. అంటే… ఎన్టీఆర్ గొంతే… ఇక్క‌డా వినిపిస్తుంద‌న్న‌మాట‌. ఆ విధంగా బాల‌య్య‌కు డ‌బ్బింగ్ శ్ర‌మ త‌గ్గించిన‌ట్టైంది. అయితే… మామూలు సంభాష‌ణ‌లు ప‌లికేట‌ప్పుడు బాల‌య్య గొంతే వినిపిస్తుంది. సినిమా డైలాగుల‌కు ఒక‌లా, మిగిలిన సంద‌ర్భాల‌లో మ‌రోలా గొంతులు మారితే.. ప్రేక్ష‌కులు ఎంత వ‌ర‌కూ స్వీక‌రించ‌గ‌ల‌రో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సీఐ అంజూ యాదవ్‌నూ సాగనంపారు !

తిరుపతిలో అత్యంత వివాదాస్పదమైన మహిళా సీఐ అంజూ యాదవ్ ను కూడా ఈసీ సాగనంపింది. పోలింగ్ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ విధుల్లో ఉండకూదని ఆర్థరాత్రే బదిలీ చేస్తూ ఈసీ ఉత్తర్వులు...

అల్లు అర్జున్ టూర్ : నంద్యాల ఎస్పీ, డీఎస్పీ, సీఐలపై ఈసీ చార్జ్‌షీట్

అల్లు అర్జున్ నంద్యాల పర్యటన పోలీసులపై కూడా కేసులు నమోదయ్యేలా చేసింది. అల్లు అర్జున్ నంద్యాల పర్యటనకు పోలీసులు అనుమతి తీసుకోలేదు. మామూలుగా అయితే పెద్దగా మ్యాటర్ కాదు....

వారణాశిలో మోడీ నామినేషన్‌కు చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడును వారణాశిలో తన నామినేషన్ కు రావాల్సిందిగా ప్రధాని మోడీ ఆహ్వానించారు. మంగళవారం ప్రధాని మోద ీనామినేషన్ వేయనున్నారు. వారణాశిలో ఎన్నికలు చివరి విడతలో జరగున్నాయి. పదమూడో తేదీన...

మిత్రుడు దంతులూరి కృష్ణ కూడా జగన్‌కు వ్యతిరేకమే !

జగన్మోహన్ రెడ్డికి అధికారం అందిన తర్వాత ఆ అధికారం నెత్తికెక్కడంతో దూరం చేసుకున్న వారిలో తల్లి, చెల్లి మాత్రమే కాదు స్నేహితులు కూడా ఉన్నారు. చిన్న తనం నుంచి అంటే 35...

HOT NEWS

css.php
[X] Close
[X] Close