కోనసీమలో రిలయన్స్ దోపిడీ పై పవన్ వ్యాఖ్యలని స్వాగతించిన హర్షకుమార్

పవన్ కళ్యాణ్ అమలాపురంలో, మల్కి పురం లో ప్రజా పోరాట యాత్ర సందర్భంగా జరిగిన సమావేశాల్లో మాట్లాడుతూ కోనసీమలో రిలయన్స్ సంస్థ చేస్తున్న దోపిడీ గురించి పదమైన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టిస్తున్నాయి. అలాగే, రిలయన్స్ దోపిడిపై మాట్లాడే ధైర్యం అటు చంద్రబాబు కానీ ఇటు జగన్ కానీ చేయకపోవడంతో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని స్వాగతిస్తున్నారు చాలామంది. ఈ లిస్టులో ఇప్పుడు మాజీ ఎంపీ హర్షకుమార్ కూడా చేరారు.

మాజీ ఎంపీ హర్షకుమార్ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. రిలయన్స్ పై పవన్ కళ్యాణ్ విమర్శలను ప్రస్తావిస్తూ వచ్చిన ఒక కథనాన్ని కూడా అదే ట్వీట్ లో జతపరిచిన హర్షకుమార్ ట్వీట్ లో ఏమన్నాడంటే, ” అవును కోనసీమ సంపదని కొల్లగొడుతున్నారు. దీనిని ప్రశ్నించే దమ్మున్న నాయకుడు కి మనం మద్దతు ఇవ్వాలి. కంపెనీలలో స్థానికులకి ఎలాంటి ఉద్యోగాలు ఇవ్వడం లేదు. రిలయన్స్ టర్మినల్ పాయింట్ మన దగ్గర ఉంటే మనల్ని పక్కనపెట్టి యానాం కి భారీ నజరానాలు ఇచ్చారు. ఇక్కడ జరిగిన అన్యాయం మీద గొంతెత్తిన ఆ కంఠానికి మనం బాసటగా ఉండాలి”.

అయితే హర్ష కుమార్ వ్యాఖ్యలు చూస్తుంటే రేపో మాపో జనసేన లో చేరడం ఖాయంగా కనిపిస్తోందని మరికొందరు అంటున్నారు. ఇంతకీ హర్షకుమార్ మదిలో ఏముందో తెలియాలంటే మరి కొంత కాలం వేచి చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close