ఒక్క ఇల్లూ ఇవ్వలేదనేది జగన్ వాదన..! మరి సాక్షి 19 లక్షల ఇళ్లిచ్చారని చెబుతోందేంటి..?

రాజకీయాల్లో పాజిటివ్‌గా నెగెటివ్‌ కోణంలో ఆవిష్కరించి… ఆ ప్రకారం.. ప్రజల మనసుల్ని గెలుచుకోవడం…అనే ఓ కాన్సెప్ట్ ఉంది. ఇలాంటి మనం చాలా సినిమాల్లో చూసి ఉంటారు. అవును.. అతడు చెడ్డ పనే చేశాడని.. మంచి పనులు ఏకరవు పెట్టడం. ఈ కాన్సెప్ట్ ఇప్పుడు సాక్షిలో చురుగ్గా అమలవుతున్నట్లుగా ఉంది. ప్రభుత్వంపై నిందలేయాలన్న ఆతృతతో.. ప్రభుత్వం పనితీరును చాలా గొప్పగా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. సాక్షి చెప్పిన వాటిలో అసలైన మ్యాటర్ చూస్తే.. ప్రభుత్వం ఇంత బాగా పని చేస్తోందా… అని అనిపించక మానదు. సినిమా మొత్తం హింస గురించి … చివరిలో..అలా చేయకూడదని చెప్పినట్లు… ఆర్టికల్ మొత్తం చంద్రబాబు గొప్పతనం.. పని తనం గురించి.. చివరిలో ప్రజలెవరూ ఇలా అనుకోవడం లేదు.. అని రాస్తే.. ప్రజల్లో మనసుల్లో పడే ముద్ర వేరే ఉంటుంది.

“ఇంటికో అవినీతి కథ” అంటూ సాక్షి పత్రికలో… ఎన్టీఆర్ గృహనిర్మాణాల గురించి ఓ పెద్ద కథనం రాసుకొచ్చింది. నిజానికి ఈ కథనానికి ప్రేరణ. ప్రభుత్వం భారీ ఎత్తున కట్టించిన ఇళ్లు.. వాటి దృశ్యాలతో టీవీల్లో చేసుకుంటున్న పబ్లిసిటీ కావొచ్చు. అదంతా ఉత్తదే.. దాని వెనుక చాలా అవినీతి ఉందని.. ప్రజల కష్టాలు ఉన్నాయని చెప్పుకుంటే.. వర్కవుట్ అవుతుందని అనుకున్నారేమో కానీ.. ఎలాంటి ఇళ్ల బొమ్మలు లేకుండా..లబ్దిదారుల పేరుతో కొన్ని ఫోటోలు వేసి… తమకు బిల్లులు రాలేదన్న అభిప్రాయాలు రాసుకొచ్చారు. టీడీపీ నేతల ప్రొద్భలంతో వేల మంది ఇళ్లు నిర్మించుకోవడం ప్రారంభించారని కూడా చెప్పుకొచ్చారు. అందులో ప్రత్యేకంగా పట్టిక వేసి.. ధరఖాస్తు చేసుకున్న వారిలో చాలా మందికి ఇళ్లు ఇవ్వలేదని చెప్పుకొచ్చారు. ఆ పట్టిక ప్రకారం చూసినా.. వచ్చిన ధరఖాస్తుల్లో అర్హులవి మాత్రమే అంగీకరిస్తారు కాబట్టి.. ఫిల్టరింగ్‌లో కొన్ని పోతాయి. అది సహజమే.

అన్నింటికన్నా.. ఈ ఆర్టికల్‌లో అసలు విషయం ఏమిటంటే.. ప్రభుత్వం ఈ నాలుగున్నరేళ్ల కాలంలో దాదాపుగా 19 లక్షల ఇళ్లను నిర్మించించింది. ఇప్పటికే పదకొండున్నర లక్షల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి లబ్దిదారులకు అందించింది. మరో ఏడు లక్షల ఇరవై వేల ఇళ్లు… వివిధ దశాల్లో నిర్మాణంలో ఉన్నాయి. ఇంత బాగా ప్రభుత్వం కూడా.. తన పనితీరు గురించి చెప్పుకోదు. కానీ సాక్షి చెప్పేసింది. అసలు కొసమెరుపేమిటంటే… జగన్మోహన్ రెడ్డి… కాళ్లు నొప్పి పుట్టేలా పాదయాత్ర చేస్తూ.. ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా కట్టించలేదంటూ… ఆరోపిస్తూ ఉంటారు. మరో వైపు సాక్షి మాత్రం.. ఇలా లక్షల్లో ఇళ్లు కట్టించి ఇచ్చారని చెబుతూ.. అక్కడక్కడ బిల్లులు అందలేదని.. టీడీపీ నేతల అవినీతి అని ముద్ర వేసేందుకు తాపత్రయ పడుతోంది. నిజానికి ఇది టీడీపీకి పాజిటివ్ ప్రచారమే. ఆరోపణలు ఎప్పుడూ చేస్తూనే ఉంటారు.. కానీ ఇళ్లు కట్టించారన్న నిజం మాత్రం.. ఈ కథనంతో.. జగన్ కూడా ఒప్పుకున్నట్లయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అందర్నీ గొడ్డలితో నరికేసి సింగిల్ ప్లేయర్ అవ్వండి – భారతికి షర్మిల సలహా

వైఎస్ జగన్, ఆయన సతీమణిపై వైఎస్ షర్మిలారెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బధవారం మీడియాతో మాట్లాడిన షర్మిల వైసీపీ వాళ్లే అధికారంలో ఉండాలి... వాళ్లకు వ్యతిరేకంగా ఉన్న వారందర్నీ...

విజ‌య్ సినిమాల‌కు టైటిళ్లు కావ‌లెను!

రేపు.. అంటే మే 9న విజ‌య్ దేవ‌ర‌కొండ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా విజయ్ కొత్త సినిమాల సంగ‌తులు రేపే రివీల్ కాబోతున్నాయి. మైత్రీ మూవీస్ లో విజ‌య్ ఓ సినిమా చేస్తున్నాడు....

మొదటిసారి కాంగ్రెస్ ట్రాప్ లో మోడీ..!?

ఇన్నాళ్ళు పదునైన విమర్శలతో కాంగ్రెస్ ను ఇరకాటంలోకి నెట్టేసిన ప్రధాని మోడీ మొదటిసారి కాంగ్రెస్ ట్రాప్ లో పడినట్లుగా కనిపిస్తోంది. ప్రతి ఎన్నికల ప్రచార సభలో రిజర్వేషన్ల అంశాన్ని ప్రస్తావిస్తుండటంతో మోడీ కాంగ్రెస్...

‘మిరాయ్’ నుంచి మ‌రో స‌ర్‌ప్రైజ్‌

'హ‌నుమాన్‌' త‌ర‌వాత తేజా స‌జ్జా నుంచి వ‌స్తున్న సినిమా 'మిరాయ్‌'. కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని ద‌ర్శ‌క‌త్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇటీవ‌లే టీజ‌ర్ విడుద‌ల చేశారు. టీజ‌ర్‌లోని షాట్స్,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close