ఎనిమిదో శ్వేతపత్రం..! గ్రామీణ, పట్టణ మౌలికవసతులకు రూ.1 లక్షా 32 వేల కోట్ల ఖర్చు..!

నాలగున్నరేళ్లలో.. గ్రామీణ పట్టణ మౌలిక వసతుల కల్పనకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చామని.. ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. రూ.1 లక్షా 32 వేల కోట్ల ఖర్చు చేసినట్లు.. ఎనిమిదో శ్వేతపత్రంలో ప్రకటించారు. గ్రామాల్లో రూ. 55 వేల కోట్లు, పట్టణాల్లో రూ. 77 వేల కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. పంచాయతీల్లో రూ. 35 వేల కోట్లు ఖర్చు చేశామన్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు రూ. 26 వేల ఉపాధి హామీ నిధులను.. గ్రామీణ ప్రాంత మౌలిక సదుపాయాల కోసం వెచ్చించినట్లు.. పత్రాలు విడుదల చేశారు. రూ.5, 694 కోట్లతో 23, 553 కిలోమీటర్ల మీ సీసీ రోడ్లు నిర్మించామని.. వీటికి ఉపాధి హామీ, ఆర్థిక సంఘం నిధుల వినియోగించామన్నారు. నిధులను సమర్థంగా వినియోగించామన్నారు. ప్రస్తుతం 8 వేల కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు నిర్మాణంలో ఉన్నాయన్నారు. రెండేళ్లలో ఏపీలోని అ్ని గ్రామాల్లోని అంతర్గత రోడ్లను సీసీ రోడ్లుగా మారుస్తామని ప్రకటించారు.

విభజనకు పూర్వం రాష్ట్రంలోని కుటుంబాలలో 22.34 లక్షల కుటుంబాలకు మాత్రమే మరుగుదొడ్లు ఉండేవన్నారు. విభజన తరువాత 2014-15 నుంచి 35.64 లక్షల మరుగు దొడ్లను రూ 4,115.82 కోట్లతో నిర్మించామన్నారు. 2018 జులై 7 నాటికి రాష్ట్రాన్ని బహిరంగ మలవిసర్జన రహిత రాష్ట్రంగా, స్వచ్చాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదేనన్నారు. 2019 జనవరి 15 నాటికి రాష్ట్రంలో 9,000 గ్రామ పంచాయతీలలో చెత్త నుంచి సంపద సృష్టించే కేంద్రాలను ఏర్పాటుచేయాలన్నది లక్ష్యమన్నారు. ఇప్పటివరకు 7,813 కేంద్రాల నిర్మాణాన్ని రూ. 280.8 కోట్లతో పూర్తిచేశామన్నారు. ప్రతి గ్రామం పరిశుభ్రంగా ఉండాలనేదే తమ లక్ష్యమని చెప్పారు. రెండు వేలకు పైగా జనాభా ఉన్న గ్రామాలకు భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇది రెండేళ్లలో పూర్తవుతుందన్నారు.

గ్రామీణ మౌలిక వసతులు అన్నీ పూర్తిచేస్తాం. పల్లెల్లో పార్కులు, గోకులాలు, మినీ గోకులాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. 2,217 ఎకరాల్లో మల్బరీ తోటల పెంపకం చేపట్టామన్నారు. 42,458 చెక్ డ్యాములు, 31,046 ఊట చెరువులు, 45,288 చిన్నతరహా నీటి పారుదల చెరువుల అభివృద్ధి చేశామన్నారు. శ్వేతపత్రంలో.. ప్రకటించిన ప్రతి రూపాయి ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారో కూడా విడుదల చేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బడా బాయ్ కి కోపమొచ్చింది… ఛోటా బాయి కి సమన్లు వచ్చాయి..!!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మోడీని బడా భాయి అని పిలిచినా,సరదాగా ఆహ్వానించినా రాజకీయాల్లో తమ్ముడు.. తమ్ముడే.. పేకాట.. పేకాటే అని నిరూపిస్తున్నారు బీజేపీ నేతలు. బడా భాయి అని మోడీని ఉద్దేశించి...

లోక్ సభ ఎన్నికలు…బీఆర్ఎస్ కు సెంటిమెంట్ అస్త్రం దొరికిందోచ్

లోక్ సభ ఎన్నికలు బీఆర్ఎస్ కు జీవన్మరణ సమస్యగా మారాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాల్సిన అనివార్యత బీఆర్ఎస్ కు ఏర్పడింది. కానీ, క్షేత్రస్థాయిలో ఆ పార్టీ మెజార్టీ సీట్లు గెలుచుకునే...

తండేల్ @ రూ.40 కోట్లు

నాగచైతన్య 'తండేల్' సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. కార్తికేయ2 తర్వాత చందూ మొండేటి నుంచి వస్తున్న సినిమా ఇది. బన్నీ వాస్‌ నిర్మాత. సాయిపల్లవి కథానాయిక. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ...

బిగ్ న్యూస్ – సీఎస్ పేరుతో సైబర్ మోసాలు

తెలంగాణలో పోన్ ట్యాపింగ్ ప్రకంపనలు రేగుతోన్న వేళ సంచలన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. శాంతి కుమారి ఫోటోను డీపీగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close