రాయలసీమకు “మోడీ” ప్రత్యేకంగా నిధులిచ్చారట..!

ప్రధానమంత్రి నరేంద్రమోడీ కూడా.. రాయలసీమవాదం అందుకున్నంత పని చేశారు. రాయలసీమకు ప్రత్యేకమైన నిధులు ఇస్తున్నామని.. వాటిని ఏపీ ప్రభుత్వం ఏం చేస్తుందో తెలియడం లేదని… కార్యకర్తలతో జరిగిన యాప్ భేటీలో వ్యాఖ్యానించారు. ఏపీలో విభజన హామీల సెగ పెరిగినప్పుడు.. కొంత మంది బీజేపీ నేతలు.. రాయలసీమ విభజన వాదాన్ని తెరపైకి తెచ్చారు. ప్రత్యేకంగా ఓ డిక్లరేషన్ అంటూ విడుదల చేసి హంగామా చేశారు. ప్రజల్లో విభజన బీజం నాటి.. తమ వంతు రాజకీయం చేద్దామనుకున్నారు. ఇప్పుడు దాన్ని ప్రధానమంత్రి మోడీ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్లుగా.. ఆయన తాజా మాటలతో తేలిపోతోంది.

“ఏపీ ప్రభుత్వం మాత్రం రాయలసీమకు భరోసానివ్వడం లేదని ఆయన చెబుతున్నారు. రాయలసీమ వంటి ప్రాంతాల అభివృద్ధికి మేము కార్యక్రమాన్ని తెచ్చాం. ఆ ప్రాంతంలో లభించే ఖనిజవనరుల నుంచి వచ్చే ఆదాయంలో కొంత భాగం అక్కడే అభివృద్ధికి కేటాయిస్తున్నాం. ఆ నిధులను ఏపీ ప్రభుత్వం ఏం చేస్తుందో తెలియదు…” అంటూ ప్రధాని స్థాయిలో ఉన్న విషయం మర్చిపోయి.. ప్రాంతీయ విబేధాలను రెచ్చగొట్టేలా మాట్లాడారు. అలా అని.. రాయలసీమకు.. కేంద్రం ఏమిచ్చిందో చెప్పలేకపోయారు. విభజన హామీల ప్రకారం రావాల్సిన స్టీల్ ప్లాంట్ విషయాన్ని కూడా మోడీ చెప్పలేదు. అలాగే వెనుకబడిన జిల్లాల పేరుతో చట్టం ప్రకారం రాయలసీమలోని ఒక్కో జిల్లాకు రావాల్సిన రూ.50 కోట్లను కూడా.. ఇచ్చినట్లు ఇచ్చి వెనక్కి తీసుకున్న బాపతు ఘనకార్యం ఎదురుగా ఉండగానే… మోడీ… రాయలసీమపై మొసలి కన్నీరు కార్చారు.

భారతీయ జనతా పార్టీ రాజకీయంలో.. కులాలు, మతాలు, ప్రాంతాలే కీలకం. ఇప్పుడు దాన్ని దక్షిణాదిలోనూ అమలు చేస్తున్నారు. ఏపీ విషయంలోనూ.. అదే చేయబోతున్నారన్న అంశం ప్రధానమంత్రి మాటల ద్వారా తేలిపోతోంది. ఏపీకి ఏం చేశారో.. చెప్పలేరు కానీ.. రాజకీయ విమర్శలు చేసి… సమయం గడిపేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close