బీజేపీకి రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే గుడ్ బై..?

ఆంధ్రప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీకి ఉన్న నలుగురు ఎమ్మెల్యేల్లో ఒకరైన అకుల సత్యనారాయణ పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు. ఆయన రాజీనామా లేఖను బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాకు ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో ప్రత్యక్షం అయిన ఆయన… రాజీనామా విషయంలో గుంభనంగా వ్యవహరిస్తున్నప్పటికీ.. బీజేపీ వర్గాలు మాత్రం.. ఆకుల సత్యనారాయణ రాజీనామా చేశారని చెబుతున్నారు. ఆకుల సత్యనారాయణ కొద్ది రోజులుగా జనసేన పార్టీలో చేరుతారన్న ప్రచారం జరుగుతోంది. ఆయన భార్య ఇప్పటికే జనసేన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. బీజేపీ నుంచి పోటీ చేస్తే డిపాజిట్లు కూడా వచ్చే పరిస్థితి లేకపోవడంతో.. ఆయన జనసేన నుంచి పోటీ చేయాలనుకుంటున్నట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు.

భారతీయ జనతా పార్టీ గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంది. టీడీపీ పదమూడు అసెంబ్లీ సీట్లు కేటాయిస్తే.. అందులో నాలుగు చోట్ల మాత్రం విజయం సాధించారు. రాజమండ్రి అర్బన్, తాడేపల్లిగూడెం,కైకలూరు, విశాఖ ఉత్తర స్థానాల నుంచి ఎమ్మెల్యేలుగా బీజేపీ నేతలు గెలిచారు. వీరిలో ఇప్పుడు.. ముగ్గురు పక్క చూపులు చూస్తున్నారు. తాడేపల్లి గూడెం ఎమ్మెల్యే మాణిక్యాల రావు మాత్రమే బీజేపీలో గట్టిగా ఉంటారని చెబుతున్నారు. ఆకల సత్యనారాయణ గుడ్ బై చెప్పేశారు. ఇక కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన పోటీ చేయబోవడం లేదని ప్రకటించారు. అలాగే విష్ణుకుమార్ రాజు కూడా టీడీపీ వైపు చూస్తున్నారని చెబుతున్నారు.

భారతీయ జనతా పార్టీకి వచ్చే ఎన్నికల్లో అభ్యర్థులు కూడా దొరకడం కష్టంగా మారింది. ఆ పార్టీకి చెందిన అగ్రనేతలుగా చెలామణి అవుతున్న వారెవరూ.. పోటీకి సిద్ధపడటం లేదు. అదే సమయంలో.. పార్టీలో గ్రూపు తగాదాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఒక నేతంటే.. మరో నేతకు సరి పడని పరిస్థితి ఉంది. నర్సాపురం ఎంపీ గోకరాజు గంగరాజు, విశాఖ ఎంపీ హరిబాబు కూడా.. ఇటీవలి కాలంలో.. పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా కనిపించడం లేదు. తాము ఈ సారి పోటీ చేయబోవడం లేదని.. వారు తమ సన్నిహితులకు చెబుతున్నారు. ఎన్నికలు దగ్గర పడే కొద్దీ ఏపీ బీజేపీకి.. మరిన్ని ఇబ్బందికర పరిణామాలు ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆర్జీవీకి కూడా ప్రజాధనంతో బిల్లు సెటిల్ చేసిన జగన్ !

రామ్ గోపాల్ వర్మ ఏపీ ప్రజాధనాన్ని దండుకున్నారు. బయటకు తెలిసిన వివరాల ప్రకారం రెండు చెక్కుల ద్వారా రూ. కోటి 14 లక్షలు ఆయన ఖాతాలో చేరాయి. ఆయనకు చెందిన ఆర్జీవీ...

కూతుర్ని ప్రాపర్టీతో పోల్చిన ముద్రగడ !

ముద్రగడ పద్మనాభం అంటే మంచీ చెడూ రాజకీయ నేత అనుకుంటారు. కానీ ఆయన కుమార్తెను ప్రాపర్టీగా చూస్తారు. అలా అని ఎవరో చెప్పడం కాదు. ఆయనే చెప్పుకున్నారు. ఉదయం తన తండ్రి రాజకీయ...

వైసీపీ మేనిఫెస్టోలో ట్విస్ట్ – ఈ మోసాన్ని ఎవరూ ఊహించలేరు !

వైసీపీ మేనిఫెస్టోలో అతిపెద్ద మోసం .. రాజకీయవర్గాల్లో సంచలనం రేపుతోంది. చాలా పథకాలకు రెట్టింపు ఇస్తామని ప్రచారం చేస్తున్నారు. కానీ ఒక్క రూపాయి కూడా పెంచలేదు. అసలు ట్విస్ట్ ఇప్పుడు లబ్దిదారుల్లోనూ సంచలనంగా...

కేసీఆర్ రూ. కోటి ఇచ్చినా … మొగులయ్య కూలీగా ఎందుకు మారారు?

కిన్నెర కళాకారులు, పద్మశ్రీ దర్శనం మొగులయ్య రోజు కూలీగా మారారంటూ ఓ చిన్న వీడియో, ఫోటోలతో కొంత మంది చేసిన పోస్టులతో రాజకీయం రాజుకుంది. తనకు రావాల్సిన పెన్షన్ రావడం లేదని.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close