కాపు రిజ‌ర్వేష‌న్ల‌పై బాబుకి చిత్త‌శుద్ధి లేద‌న్న జీవీఎల్‌..!

ఇక కుల రాజ‌కీయాల‌కు భాజ‌పా తెర తీసింది. ఈబీసీల‌కు ప‌ది శాతం రిజ‌ర్వేష‌న్ల‌ను అమ‌లు చేస్తూ పార్ల‌మెంటులో బిల్లు ఆమోదం పొంద‌డంతో… దీన్ని పెద్ద ఎత్తున ప్ర‌చారం చేసుకునేందుకు సిద్ధ‌మౌతోంది. సరిగ్గా ఎన్నిక‌లకు నాలుగు నెల‌ల ముందే అగ్ర‌వ‌ర్ణాల‌పై అభిమానం ప్ర‌ద‌ర్శించ‌డం కేవ‌లం ఓటు బ్యాంకు రాజ‌కీయం అనేది ముమ్మాటికీ నిజం. ఒక‌వేళ నిజంగానే వారిపై మొదట్నుంచీ చిత్త‌శుద్ధి ఉంటే… గ‌డ‌చిన నాలుగేళ్ల‌లో ఎప్పుడైనా ఈ అగ్ర‌వ‌ర్ణాల పేద‌లు మోడీ స‌ర్కారుకు ఎందుకు గుర్తుకురాన‌ట్టు..? ఈ విష‌యాన్ని వ‌దిలేసి… కాపుల రిజ‌ర్వేష‌న్ల విష‌యంలో ఏపీ స‌ర్కారు చిత్త‌శుద్ధిని ప్ర‌శ్నించారు భాజ‌పా ఎంపీ జీవీఎల్ న‌ర్సింహారావు.

ఢిల్లీలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ… కాపుల‌కు రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించ‌డంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుకి ఏమాత్రం చిత్త‌శుద్ధి లేద‌ని విమ‌ర్శించారు. నిజంగానే కాపుల‌కు రిజ‌ర్వేష‌న్లు ఇవ్వాల‌నుకుంటే… హ‌ర్యానా, మ‌హారాష్ట్రల మాదిరిగా చ‌ట్టం చేయాల్సి ఉంద‌న్నారు. ఆయా రాష్ట్రాలు రిజ‌ర్వేష‌న్లు ఇచ్చి చ‌ట్టం చేశాయ‌న్నారు. కానీ, చంద్ర‌బాబు నాయుడు అలాంటి ప్ర‌య‌త్న‌మేదీ చెయ్య‌కుండానే నాట‌కాలు ఆడుతున్నార‌ని ఆరోపించారు. ఇప్పుడు కేంద్ర ప్ర‌భుత్వం తెచ్చిన బిల్లు వ‌ల్ల బ్రాహ్మ‌ణ‌, క‌మ్మ‌, రెడ్డి వ‌ర్గాల‌తోపాటు కాపుల‌కు కూడా మేలు జ‌రుగుతుంద‌న్నారు. ఈ బిల్లుపై కూడా పార్ల‌మెంటులో టీడీపీ అడ్డుకునే ప్ర‌య‌త్నం చేసింద‌నీ, అగ్ర‌కులాల పేద‌ల‌కు మేలు చేయ‌డం ఆ పార్టీకి ఇష్టం లేద‌ని విమ‌ర్శించారు.

జీవీఎల్ తెలుసుకోవాల్సింది ఏంటంటే…. భాజ‌పా మాదిరిగా ఓటు బ్యాంక్ రాజ‌కీయం చేయాల‌నుకుంటే, కాపుల రిజ‌ర్వేష‌న్ల‌పై ఎన్నిక‌ల‌కు కొన్ని నెల‌ల ముందుగా, అంటే ఇప్పుడు అసెంబ్లీలో తీర్మానం చేసేవారు! కానీ, అలా చెయ్య‌లేదు. మంజునాథ‌న్ కమిటీ వేసి, దాని నివేదిక వ‌చ్చిన త‌రువాత అసెంబ్లీలో చ‌ర్చ‌పెట్టి, ఆ త‌రువాత తీర్మానం ఆమోదించి కేంద్రానికి పంపించారు. కానీ, దానిపై కేంద్రం ఇంత‌వ‌ర‌కూ స్పందించ‌లేదు. కేంద్ర‌మే ఇంకా ఆమోదం తెల‌ప‌లేదు. ఆంధ్రా ఒక్క‌టే కాదు.. తెలంగాణ నుంచి, మ‌హారాష్ట్ర నుంచి కూడా ఇలాంటి రిజ‌ర్వేష‌న్లకు సంబంధించిన కొన్ని రాష్ట్రాలు చేసిన తీర్మానాలు కేంద్రం ద‌గ్గ‌ర పెండింగ్ ఉన్నాయి. వాటిని ప‌ట్టించుకోకుండా… అన్నింటినీ ప‌క్క‌న తోసేసి… రాష్ట్రాల‌కు క్రెడిట్ ద‌క్క‌కూడ‌ద‌న్న ఉద్దేశంతో ఈబీసీ బిల్లు తీసుకొచ్చారు. ఏపీ స‌ర్కారు కాపు కార్పొరేష‌న్ ఏర్పాటు చేసింది. మంత్రి వ‌ర్గంలోప్రాధాన్య‌త క‌ల్పించింది. రిజ‌ర్వేష‌న్ల‌పై స‌మ‌గ్ర అధ్య‌య‌నం చేయించింది. ఇవ‌న్నీ జీవీఎల్ ఆంధ్రాకి వ‌ల‌స రాక‌ముందు జ‌రిగిన ప‌రిణామాలు కాబ‌ట్టి, ఆయ‌న‌కి తెలిసే అవ‌కాశాలు లేవు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ముద్రగడ పద్మనాభ రెడ్డిగా ఫిక్స్ అయిపో..!?

పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను ఓడించకపోతే పేరు మార్చుకుంటానని ముద్రగడ పద్మనాభం సంచలన వ్యాఖ్యలు చేశారు. పద్మనాభం అని కాకుండా పద్మనాభ రెడ్డి అని మార్చుకుంటానని సవాల్ చేశారు. ముద్రగడ ధీమా ఏంటో...

నన్ను పట్టించుకోరా… ఓ తండ్రి అనూహ్య నిర్ణయం

కని పెంచిన కొడుకులు పట్టించుకోలేదని నిరాశ చెందిన ఓ తండ్రి అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. రెక్కల కష్టంతో పెంచిన కొడుకులు తనను పట్టించుకోవడం లేదనే ఆగ్రహంతో యావదాస్తిని కొండగట్టు ఆంజనేయ స్వామికి సమర్పించేందుకు...

డైరెక్ట‌ర్స్ డే… రాజ‌మౌళి ‘డాన్స్’ షో!

ద‌ర్శ‌క దిగ్గ‌జం దాస‌రి నారాయ‌ణ‌రావు జ‌యంతిని పుర‌స్క‌రించుకొని, తెలుగు ద‌ర్శ‌కులంతా క‌లిసి 'డైరెక్ట‌ర్స్ డే'ని సెల‌బ్రేట్ చేసుకోబోతున్నారు. మే 4న ఈ కార్య‌క్ర‌మం హైద‌రాబాద్‌లో జ‌రగ‌బోతోంది. అందుకోసం ద‌ర్శ‌కులంతా క‌లిసి క‌స‌ర‌త్తులు చేస్తున్నారు....

ఏప్రిల్‌ బాక్సాఫీస్ రివ్యూ: అంతా చ‌ప్పచ‌ప్ప‌గా!

2024లో అప్పుడే 4 నెల‌లు గ‌డిచిపోయాయి. జ‌న‌వ‌రి సంక్రాంతి సినిమాల ద‌య వ‌ల్ల `ఓకే` అనిపించుకొంది. ఫిబ్ర‌వ‌రిలో అన్నీ ఫ్లాపులే. మార్చి కాస్త ఉప‌శ‌మ‌నం క‌లిగించింది. ఓం భీమ్ భుష్‌, ప్రేమ‌లు, టిల్లూ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close