టీఆర్ఎస్‌లోకి వంటేరు ప్రతాప్ రెడ్డి..! ఎమ్మెల్యే అవడం కూడా ఖాయమే..?

గజ్వేల్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కేసీఆర్ పై పోటీ చేసిన వంటేరు ప్రతాప్ రెడ్డి… తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరబోతున్నారు. శుక్రవారం సాయంత్రం ఆయన.. కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోనున్నారు. గజ్వేల్ లో బలమైన అనుచర వర్గం ఉన్న నేత అయిన ప్రతాప్ రెడ్డి… రెండు సార్లు కేసీఆర్ పై పోటీ చేసి గట్టి పోటీ ఇచ్చారు. గత ఎన్నికల సమయంలో ఆయన కేసీఆర్ పై తీవ్రమైన పోరాటమే చేశారు. పోలీసుల వేధింపులు ఎదుర్కొన్నారు. కానీ పరిస్థితి కలిసి రాలేదు. చివరికి రాజకీయ భవిష్యత్ కోసం టీఆర్ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నారు. తెలుగుదేశం పార్టీలో చురుగ్గా పని చేసి.. తెలుగు రైతు అధ్యక్షుడిగా వ్యవహరించిన ప్రతాప్ రెడ్డి.. కొంత కాలంగా రాజకీయంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు.

టీడీపీలో ఉన్నప్పుడు.. ఉస్మానియా యూనివర్శిటీలో తన నియోజకర్గానికి చెందిన ఓ విద్యార్థి ఉద్యోగం లేదన్న కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడు. అతన్ని పరామర్శించడానికి వెళ్లినప్పుడు పోలీసులు అరెస్ట్ చేశారు. చాలా రోజుల పాటు జైల్లో ఉన్నారు. ఆ తర్వాత కేసీఆర్ పై ఓ రేంజ్లో పోరాటం చేశారు. టీడీపీ బలం సరిపోవడంలేదని.. కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాడో పేడో అన్నట్లుగా… కేసీఆర్ పై పోరాడారు. కానీ ప్రయోజనం లేకపోయింది. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కూడా… ఆయన … వీవీ ప్యాట్ మిషన్లలోని స్లిప్పులు లెక్కించారని ఈసీకి ఫిర్యాదు చేశారు. స్పందించకపోతే కోర్టుకెళ్తానని.. కూడా హెచ్చరించారు. అయితే అనూహ్యంగా ఆయన టీఆర్ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నారు.

పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేసీఆర్ జాతీయ రాజకీయాలకు వెళ్లే అవకాశం ఉంది. అదే జరిగితే.. ఆయన గజ్వేల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారు. అప్పుడు… అక్కడ ఉపఎన్నికల్లో.. టీఆర్ఎస్ తరపున ప్రతాప్ రెడ్డికి చాన్సిస్తామని.. టీఆర్ఎస్ అగ్రనేతల నుంచి హామీ లభించిందనే ప్రచారం జరుగుతోంది. అన్ని కలసి వస్తే.. ప్రతాప్ రెడ్డి.. తన రాజకీయ లక్ష్యం అయిన… ఎమ్మెల్యే పదవిని టీఆర్ఎస్ నుంచి.. ఈ టర్మ్‌ లోనే నెరవేర్చుకునే అవకాశం ఉందని.. తాజా పరిణామాలతో స్పష్టమవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close