ఇండస్ట్రీని షాక్‌కి గురి చేస్తున్న సుకుమార్‌ డెసిషన్‌!

డిఫరెంట్‌ కథాంశాలతో సినిమాలు తీస్తూ తన రూటు సెపరేటు అనిపించుకుంటున్న సుకుమార్‌ లేటెస్ట్‌గా ఎన్టీఆర్‌తో ‘నాన్నకు ప్రేమతో’ వంటి ఫీల్‌గుడ్‌ మూవీ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాకి డివైడ్‌ టాక్‌ వచ్చినప్పటికీ కలెక్షన్లపరంగా అందరూ హ్యాపీగానే వున్నారు. ‘మా నాన్న నాకు ఎంతో ప్రేమను పంచాడు. కానీ, నేను హైదరాబాద్‌ వచ్చేసిన తర్వాత సినిమాల బిజీలో పడిపోయి నేనే నాన్నను బాగా చూసుకోలేకపోయాను. మా నాన్న మీద నాకు వున్న ప్రేమవల్లే ఇలాంటి ఫీల్‌గుడ్‌ మూవీ తియ్యగలిగాను’ అంటున్నాడు సుకుమార్‌.

‘నాన్నకు ప్రేమతో..’ తర్వాత సుకుమార్‌తో సినిమా చెయ్యాలని చాలా మంది హీరోలు, నిర్మాతలు ఎదురుచూస్తున్న తరుణంలో సుకుమార్‌ ఒక షాకింగ్‌ డెసిషన్‌ తీసుకున్నాడట. దేవిశ్రీప్రసాద్‌ని హీరోగా పరిచయం చేస్తూ తన నెక్స్‌ట్‌ మూవీ చెయ్యాలని డిసైడ్‌ అయిన సుకుమార్‌ ఈ సినిమా తర్వాత మరొక్క సినిమా మాత్రమే చేసి డైరెక్టర్‌గా రిటైర్‌ అవుతానని అంటున్నాడు. సుకుమార్‌ తీసుకున్న ఈ నిర్ణయంతో హీరోలు, నిర్మాతలు షాక్‌ అవుతున్నారు. అయితే తన నిర్ణయంలో మార్పులేదని కూడా చెప్పినట్ట తెలుస్తోంది. కాబట్టి దేవిశ్రీప్రసాద్‌ సినిమా తర్వాత సుకుమార్‌తో సినిమా చేసే ఛాన్స్‌ కోసం హీరోలంతా ఎదురుచూస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంగళగిరిలో ఆకట్టుకుంటున్న నారా బ్రహ్మణి ప్రచార శైలి

నారా లోకేష్ సతీమణి మంగళగిరి నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. నారా లోకేష్ మంగళగిరిలో అందుబాటులో ఉండని సమయంలో ఆమె ప్రచారం చేస్తున్నారు. రెండు, మూడు వారాలుగా విస్తృతంగా మంగళగరిలో అన్ని వర్గాల...

కూటమి ప్రభుత్వంలో వంగవీటి రాధాకృష్ణకు కీలక పదవి !

వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ కోసం నిస్వార్థంగా ప్రచారం చేస్తున్నారు. దెందలూరు సభలో వంగవీటి రాధాకృష్ణను చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన ఏమీ ఆశించకుండా పార్టీ కోసం పని చేస్తున్నారని ఏ...

అభివృద్ధితో సంక్షేమం – టీడీపీ, జనసేన మేనిఫెస్టో కీలక హామీలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా వివరించారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన సూపర్...

ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండనుంది..ఆ సర్వేలో ఏం తేలిందంటే..?

ఏపీలో సర్వే ఏదైనా కూటమిదే అధికారమని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రైజ్ ( ఇండియన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close