ఆంధ్రాలో చక్కర్లు కొడుతున్న లగడపాటి ..!

మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఆంధ్రప్రదేశ్‌లో చక్కర్లు కొడుతున్నారు. మంగళవారం రోజు ఆయన అటు స్పీకర్ కోడెలతోనూ, ఇటు వంగవీటి రాధాతోనూ వేర్వేరుగా సమావేశం అయ్యారు. రాజకీయవర్గాల్లో ఇది హాట్ టాపిక్ అయింది. ఇటీవలి కాలంలో ఆయన టీడీపీ అధినేతతో సన్నిహితంగా వ్యవహరిస్తున్నారు. పలు మార్లు భేటీ అయ్యారు కూడా. భేటీ అయినప్పుడల్లా ఆయన టీడీపీలో చేరుతారని, ఏదో ఓ స్థానం నుంచి పార్లమెంట్‌కో అసెంబ్లీకో పోటీ చేస్తారని చెబుతున్నారు. కానీ ఆయన మాత్రం మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని ఖండిస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు నేరుగా కోడెల, వంగవీటి రాధాలను కలవడం దేనికోసమన్న చర్చ ప్రారంభమయింది.

వంగవీటి రాధా వైసీపీకి రాజీనామా చేశారు కానీ, ఆయన ఏ పార్టీలోనూ చేరలేదు. తెలుగుదేశం పార్టీ ఆహ్వానించినా ఆయన ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. టీడీపీ ఇచ్చిన ఎమ్మెల్సీ ఆఫర్ ఆయనకు నచ్చలేదంటున్నారు. కచ్చితంగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని పట్టుదలతో ఉన్నారని చెబుతున్నారు. ఈ తరుణంలోనే లగడపాటి రాజగోపాల్ ఆయనను టీడీపీ తరపున విజయవాడ నుంచి కాకుండా ఇతర చోట్ల పోటీ చేసేందుకు ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. రఘురామకృష్ణంరాజు వైసీపీలో చేరడంతో నర్సాపురం టిక్కెట్ ఒకటి పెండింగ్‌లో ఉంది. అక్కడ క్షత్రియ సామాజికవర్గంతో పాటు కాపు సామాజికవర్గానికి కూడా రాజకీయ పార్టీలు అవకాశం కల్పిస్తూ ఉంటాయి. ఈ క్రమంలో ఉభయగోదావరి జిల్లాలో ఓ చోట నుంచి పోటీ చేయాలని లగడపాటి వంగవీటికి సలహా ఇచ్చినట్లు చెబుతున్నారు.

అయితే ప్రస్తుతం నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల బాధ్యతలను కోడెల చూస్తున్నారు. ఆయన ఈ సారి నర్సరావుపేట నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఆయన నియోజకవర్గం అదే. అయితే సత్తెనపల్లిలోనూ కాపు సామాజికవర్గ ప్రభావం అధికంగానే ఉంటుంది. అక్కడ కూడా పరిస్థితి అనుకూలంగానే ఉంటుందని వివరించే ప్రయత్నం చేశారని భావిస్తున్నారు. మొత్తానికి లగడపాటి తన సర్వే రిపోర్టులతో టీడీపీ అధినేతకు అభ్యర్థుల ఎంపికలో కూడా సహకరిస్తున్నారని మాత్రం టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బిగ్ న్యూస్ – సీఎస్ పేరుతో సైబర్ మోసాలు

తెలంగాణలో పోన్ ట్యాపింగ్ ప్రకంపనలు రేగుతోన్న వేళ సంచలన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. శాంతి కుమారి ఫోటోను డీపీగా...

వైసీపీకి ‘చిరు’ బెంగ

ఏపీ ఎన్నికల్లో ఉత్కంఠను రేకెత్తిస్తున్న నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటి. ఇక్కడి నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ప్రచారం ఉదృతంగా సాగుతోంది. ఇప్పటికే...

ఈవారం బాక్సాఫీస్‌: రాంగ్‌ ‘టైమింగ్‌’ కాదుగా!?

ఏపీలో ఎన్నిక‌ల వేడి రోజు రోజుకీ పెరుగుతోంది. ఎక్క‌డ విన్నా, రాజ‌కీయాల‌కు సంబంధించిన అంశాలే. ఎవ‌రు గెలుస్తారు, ఎవ‌రు ఓడిపోతారు? అనే చ‌ర్చ తీవ్రంగా సాగుతోంది. సినిమా ముచ్చట్ల‌కు కొంత‌కాలం పుల్...

చిరుని క‌లిసిన మారుతి.. ఏం జ‌రుగుతోంది?

చిరంజీవితో ఓ సినిమా చేయాల‌ని మారుతి ఎప్ప‌టి నుంచో అనుకొంటున్నారు. ఇది వ‌ర‌కు వీరి కాంబోలో ఓ సినిమా రాబోతోంద‌న్న వార్త‌లు కూడా హ‌ల్ చ‌ల్ చేశాయి. అంతా ఓకే అనుకొన్న త‌రుణంలో.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close