చంద్రబాబు గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం రాజకీయ కుట్రా?

తునిలో నిన్న జరిగిన విద్వంసానికి ‘మీరు కారకులు అంటే కాదు…మీరే కారకులని’ అధికార, ప్రతిపక్ష పార్టీలు- తెదేపా, వైకాపాలు ఆరోపణలు చేసుకొంటున్నాయి. ఇటువంటి సమయంలో ఈవిధంగా ఆరోపణలు చేసుకోవడం సహజమే కానీ తెరాస అధికార పత్రికగా పేరున్న ‘నమస్తే తెలంగాణా’ కూడా చంద్రబాబు నాయుడుని విమర్శిస్తూ “ఏపిలో బాబు నీరో” అనే శీర్షికన ఈరోజు సంచికలో ఒక కధనం ప్రచురించడం విశేషం.

ఏపిలో కాపులు రిజర్వేషన్లు కోరుతూ ఉద్యమానికి సిద్దం అవుతున్నారని తెలిసినప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రోమ్ నగరం తగులబడుతుంటే ఫిడేల్ వాయించుకొంటూ కూర్చొన్న నీరో చక్రవర్తిలాగ హైదరాబాద్ వచ్చి గ్రేటర్ ఎన్నికల ప్రచారం చేసుకొంటూ కాలక్షేపం చేసారని ఆ కధనంలో విమర్శించింది. సొంత రాష్ట్రం భగ్గున మండిపోతుంటే పట్టించుకోకుండా పక్క రాష్ట్రంలో రాజకీయాలు, కుట్రలు చేస్తూ కాలక్షేపం చేసారని విమర్శించింది.ఆయనతో బాటు ఆయన మంత్రులు కూడా కాపులను రెచ్చగొట్టే విధంగా మాట్లాడి, రాష్ట్రాన్ని గాలికొదిలేసి హైదరాబాద్ వచ్చి గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో మునిగిపోయారని విమర్శించింది. కాపు గర్జన సభని నిర్వహిస్తామని పది రోజులుగా కాపు నేతలు చెపుతునప్పటికీ ఏపి ముఖ్యమంత్రి, మంత్రులు పట్టించుకోకుండా హైదరాబాద్ వచ్చి గ్రేటర్ ఎన్నికలలో మునిపోవడం చేతనే నిన్న తునిలో అటువంటి సంఘటనలు జరిగాయని నమస్తే తెలంగాణా పత్రిక తన కధనంలో పేర్కొంది.

ఆ కధనంలో తుని సంఘటనలను నివారించడంలో తెదేపా ప్రభుత్వం వైఫల్యం గురించి చేసిన విమర్శలు సహేతుకంగానే ఉన్నప్పటికీ, చంద్రబాబు నాయుడు, ఆయన మంత్రులు గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం ఒక రాజకీయ కుట్రగా అభివర్ణించడం చాలా హాస్యాస్పదంగా ఉంది. తెలంగాణాలో తెదేపా, చంద్రబాబు నాయుడు కనబడకూడదనే తెరాస అభిప్రాయాలకు అది అద్దం పడుతున్నట్లుంది తప్ప సహేతుకంగా లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close