భార్యాసమేతంగా ఆమరణదీక్షకు ముద్రగడ నిర్ణయం

హైదరాబాద్: కాపులను బీసీల్లో చేర్చటం, కాపు కమిషన్‌కు వేయికోట్లు కేటాయించటంపై ఉద్యమానికి దిగిన ముద్రగడ పద్మనాభం ఆమరణదీక్షకు దిగుతానని ఇవాళ ప్రకటించారు. భార్యతో కలిసి నాలుగైదు రోజుల్లో దీక్షకు కూర్చుంటానని చెప్పారు. కిర్లంపూడిలో తన స్వగృహంలో ఆయన ఇవాళ మధ్యాహ్నం మీడియాతో మాట్లాడారు. ఆయన చెప్పిన అంశాలు ఇలా ఉన్నాయి.

  • అరెస్ట్ చేసినా జైలులో కూడా నిరాహారదీక్ష చేస్తా.
  • కాపులకు న్యాయం జరిగేవరకు విశ్రమించను.
  • నిన్న ఉద్యమం తప్పుదోవ పడుతోందని గ్రహించి ఆందోళనను విరమించాను.
  • నిన్న జరిగిన అల్లర్ల వెనక టీడీపీ నాయకుల హస్తం ఉంది.
  • అల్లరిమూకలకు నాయకత్వం వహించింది టీడీపీవారే.
  • నేను అమ్ముడైపోయినట్లు ప్రచారం చేస్తున్నారు.
  • నాడు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా కూడా ఉద్యమం చేశాను. ఆనాడు నన్ను మీరు ఎన్నికోట్లకు కొన్నారో చంద్రబాబు చెప్పాలి.
  • నిన్న కాపుగర్జన సభను అడ్డుకోటానికి అన్ని ప్రయత్నాలూ చేశారు.
  • స్కూల్ బస్సులు, ఆర్టీసీ బస్సులు ఇవ్వనీయకుండా చేశారు.
  • వంట చేసుకోవటానికి జాగా కూడా ఇవ్వనీయలేదు.
  • నిధులు లేవంటున్నారు, ప్రతిచోటకూ సీఎమ్ ప్రత్యేక విమానంలోనే తిరుగుతున్నారు.
  • అమరావతి శంకుస్థాపనకు 400 కోట్లు ఖర్చుపెట్టారు, పట్టిసీమకు 1500 కోట్లు ఖర్చుపెట్టారు.
  • కాపులు ఎవరూ ఆవేశానికి లోనుకావద్దు, ఇళ్ళు వదిలి ఎక్కడికీ రావద్దు. మీప్రాంతాలనుంచే సంఘీభావం ప్రకటించాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంగళగిరిలో ఆకట్టుకుంటున్న నారా బ్రహ్మణి ప్రచార శైలి

నారా లోకేష్ సతీమణి మంగళగిరి నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. నారా లోకేష్ మంగళగిరిలో అందుబాటులో ఉండని సమయంలో ఆమె ప్రచారం చేస్తున్నారు. రెండు, మూడు వారాలుగా విస్తృతంగా మంగళగరిలో అన్ని వర్గాల...

కూటమి ప్రభుత్వంలో వంగవీటి రాధాకృష్ణకు కీలక పదవి !

వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ కోసం నిస్వార్థంగా ప్రచారం చేస్తున్నారు. దెందలూరు సభలో వంగవీటి రాధాకృష్ణను చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన ఏమీ ఆశించకుండా పార్టీ కోసం పని చేస్తున్నారని ఏ...

అభివృద్ధితో సంక్షేమం – టీడీపీ, జనసేన మేనిఫెస్టో కీలక హామీలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా వివరించారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన సూపర్...

ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండనుంది..ఆ సర్వేలో ఏం తేలిందంటే..?

ఏపీలో సర్వే ఏదైనా కూటమిదే అధికారమని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రైజ్ ( ఇండియన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close