“భద్రాచలం” ఆంధ్రప్రదేశ్‌దేనా..? చంద్రబాబు కొత్త అస్త్రం..!

పోలవరం ప్రాజెక్ట్ వల్ల.. భద్రాచలం మునిగిపోతుందని… ఆ ప్రాజెక్ట్ ప్రభావాన్ని అంచనా వేసే వరకు.. పోలవరాన్ని నిలిపివేయాలని సుప్రీంకోర్టులో… తెలంగాణ సర్కార్ అఫిడవిట్ దాఖలు చేసింది. దీనికి రాజమండ్రిలో టీడీపీ అధినేత చంద్రబాబు… కౌంటర్ ఇచ్చారు. అసలు భద్రాచలం ఆంధ్రప్రదేశ్‌దేనని తిరిగివ్వాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు డిమాండ్‌తో ఒక్క సారిగా… రాజకీయ కలకలం ప్రారంభమయింది. నిజానికి 1956కి ముందు అంటే.. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడక ముందు… తెలంగాణ … విలీనం జరగక ముందు.. ఆంధ్రప్రదేశ్‌లో.. భద్రాచలం భాగం. అది తూర్పుగోదావరి జిల్లాలోనే ఉండేది. భాషా ప్రయుక్త రాష్ట్రం ఏర్పాటు తర్వాత 1959 లో భద్రాచలం ప్రాంతం ఖమ్మం జిల్లాలో విలీనమైంది. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ కూడా.. 1956కి ముందు ఉన్న తెలంగాణ కావాలని.. అనేక సార్లు నినదించారు. దాని ప్రకారం చూసినా… భద్రాచలం మొత్తం.. ఏపీకే చెందుతుంది.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు… పోలవరం ప్రాజెక్ట్ విషయంలో.. కేసీఆర్ చెబుతున్న అభ్యంతరాలకు సరైన కౌంటర్ రెడీ చేసుకున్నారన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. ఆ ఏడు ముంపుమండలాలు మాత్రమే కాదు.. భద్రాచలం కూడా.. 1959కి ముందు… ఆంధ్రప్రదేశ్‌వే. తెలంగాణ ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు.. సరిహద్దుల్ని జిల్లాల వారీగా నిర్ణయించారు. కానీ ఖమ్మం జిల్లాలో భద్రాచలం సహా… ఆ ఏడు మండలాలూ… తెలంగాణ కాదు. 1959 తర్వాత ఖమ్మం జిల్లాలో విలీనం చేయడంతో.. అవి తెలంగాణలో భౌగోళికంగా ఉన్నట్లు వాడుకలోకి వచ్చాయి.

మొత్తానికి ఎన్నికల సమయంలో.. హాట్ టాపిక్ అవడానికి.. మరో అంశం… తెరపైకి వచ్చింది. అదే భద్రాద్రి రామయ్య. ఏపీకి చెందిన భూభాగాన్ని తెలంగాణలో కలిపేసుకున్నారన్న ప్రచారం… ఇప్పుడు ఓటర్లపై ప్రభావం చూపుతుంది. అన్నింటికంటే ముఖ్యం.. భద్రాద్రి రామయ్య.. ఆంధ్ర ఆస్తి అన్న సెంటిమెంట్ ప్రజల్లోకి వెళ్తే.. మరింత సెంటిమెంట్ పెరుగుతుంది. పోలవరంపై… కేసీఆర్ చేస్తున్న రాజకీయానికి… ఇదే సరైన కౌంటర్ అని టీడీపీ వర్గాలు అంచనా వేస్తున్నట్లు చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

పదేళ్ల తర్వాత ఓయూపై స్పందించిన కేసీఆర్

తెలంగాణ ఉద్యమ సమయంలో నిత్యం ఓయూను పలవరించిన కేసీఆర్.. గద్దెనెక్కాక ఒక్కసారి కూడా ఓయూను సందర్శించలేదు. విద్యార్థులు రోడ్డెక్కి ప్రొఫెసర్లను నియమించాలని,స్కాలర్ షిప్స్ పెంచాలని, వసతి గృహాల్లో నాణ్యమైన ఆహారం అందించాలని డిమాండ్...

నోరు జారిన ర‌చ‌యిత‌.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్

తోట‌ప‌ల్లి మ‌ధు... ఈ త‌రానికి పెద్ద‌గా ఈ ర‌చ‌యిత పేరు తెలియ‌క‌పోవొచ్చు కానీ, 90ల్లో వ‌చ్చిన కొన్ని సినిమాల‌కు ఆయ‌న మాట‌లు అందించారు. కొన్ని పెద్ద హిట్లు కొట్టారు. న‌టుడిగానూ త‌న‌దైన ముద్ర...

బడా భాయ్ కి కోపమొచ్చింది… ఛోటా భాయ్ కి సమన్లు వచ్చాయి..!!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మోడీని బడా భాయి అని పిలిచినా,సరదాగా ఆహ్వానించినా రాజకీయాల్లో తమ్ముడు.. తమ్ముడే.. పేకాట.. పేకాటే అని నిరూపిస్తున్నారు బీజేపీ నేతలు. బడా భాయి అని మోడీని ఉద్దేశించి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close