మోడీ వచ్చింది వైసీపీ కోసమే..! జగన్ గురించి ఒక్క మాట మాట్లాడలేదేంటి..?

బీజేపీతో తమ పార్టీకి రహస్య ఒప్పందం ఉందని చెబుతూ .. ఓ వైసీపీ నేత జాతీయ మీడియా చేసిన స్టింగ్ ఆపరేషన్‌లో దొరికిపోతారు. బీజేపీ అగ్రనేత పీయూష్ గోయల్.. వైసీపీ తమ మిత్రపక్షమేనని నేరుగా మీడియాకు కూడా చెబుతారు. అంటే రెండు పార్టీలు చెప్పేది ఒక్కటే. అటు వైసీపీ నేతలు చెప్పినా.. ఇటు… బీజేపీ నేతలు చెప్పినా.. రెండింటి అర్థం ఒకటే. వైసీపీ, బీజేపీ మిత్రపక్షాలు. కానీ ఏపీలో బీజేపీతో పెట్టుకుంటే.. కలసి మునిగిపోతామని వైసీపీకి తెలుసు. అందుకే.. ఏమైనా ఉంటే.. ఎన్నికల తర్వాత చూసుకుందామని.. ఇప్పటికైతే.. తెర వెనుక సంబంధాలే కొనసాగిస్తోంది. కానీ అప్పుడప్పుడు బయట పడుతున్నారు.

ఏపీలో భారతీయ జనతా పార్టీకి ఒక్క స్థానంలో కూడా డిపాజిట్లు వచ్చే పరిస్థితి లేదు. ఈ విషయాన్ని బీజేపీ నేతలు కూడా అంగీకరిస్తున్నారు. ఒక్క చోట డిపాజిట్ తెచ్చుకున్నా.. ఐదు లక్షలు ఇస్తానని ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు సవాల్ చేస్తే … ముందుకు రావడానికి ఒక్క బీజేపీ నేత కూడా మందుకు రాలేదు. ఏపీలో బీజేపీ నేతల లక్ష్యం.. వైసీపీని గెలిపించడమేనని టీడీపీ నేతలు అంటున్నారు. ఆ విషయం బహిరంగంగా చెబితే వైసీపీ నష్టపోతుంది కాబట్టి సైలెంట్‌గా ఉంటున్నారు. తమకు ఉండే ఓటు బ్యాంక్‌ను వైసీపీకి తరలించడానికే.. ఆ పార్టీపై ఎలాంటి విమర్శలు చేయడం లేదని అంటున్నారు.

గత ఎన్నికలకు ముందు ప్రజాధనాన్ని దోచుకున్న జగన్‌ను జైలుకు పంపిస్తామని చెప్పి.. ఇప్పుడు… ఆయనపై సీబీఐ విచారణను తొక్కి పెట్టిన వైనాన్ని.. ఈడీ లేఖ ద్వారా బయట పెట్టిందని.. గుర్తుచేస్తున్నారు. ప్రధానమంత్రి మోదీ కూడా.. కర్నూలు పర్యటనకు వచ్చి.. టీడీపీ, చంద్రబాబుపై విమర్శలు చేశారు కానీ.. జగన్‌ను అనలేదు. బెయిల్‌పై తిరుగుతున్న నేతల్ని వెంట బెట్టుకుని తనను ఓడించేందుకు.. చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని.. మోదీ విమర్శించారు. అయితే… ఈ బెయిల్‌పై తిరుగుతున్న నేతలు జగన్ , విజయసాయిరెడ్డి కాదు. మోదీ ఉద్దేశంలో సోనియా, రాహుల్… టీడీపీపై, చంద్రబాబుపై అవినీతి ఆరోపణలు చేసి.. జగన్‌ కు మేలు చేయాలన్న ఉద్దేశంతోనే.. మోదీ ఏపీ పర్యటనకు వస్తున్నారని.. టీడీపీ వర్గాలు గట్టిగానే వాదిస్తున్నాయి. ఈ విషయాన్ని బలపర్చడానికి అనేక ఉదాహరణలు చెబుతున్నారు. పైపైన చూసినా అది నిజమే అనిపించకమానదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘వీర‌మ‌ల్లు’ టీజ‌ర్‌: లెక్క‌లు స‌రిచేసే రాబిన్ హుడ్‌

https://www.youtube.com/watch?v=4TriF7BfHyI ప‌వ‌న్ క‌ల్యాణ్ - క్రిష్ కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకొంటున్న చిత్రం 'హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు'. ప‌వ‌న్ రాజ‌కీయాలు, ఇత‌ర సినిమాల బిజీ వ‌ల్ల‌... 'వీర‌మ‌ల్లు'కి కావ‌ల్సిన‌న్ని డేట్లు కేటాయించ‌లేక‌పోయాడు. దాంతో ఈ సినిమా పూర్త‌వుతుందా,...

వృద్ధాప్య పెన్షన్ – జగన్‌ను ముంచిన సలహాదారుడెవరు ?

2014లో తాను సీఎం అయ్యే నాటికి రూ. 200 ఉన్న వృద్ధాప్య పెన్షన్ ను అధికారంలోకి రాగానే రూ. వెయ్యి చేశారు. మళ్లీ ఎన్నికలకు ఆరు నెలల ముందు రూ....

ఒక్క కేసీఆర్ మాటలే వినిపించాయా – అదీ నెల తర్వాత !

కేసీఆర్‌ ప్రచారంపై ఈసీ రెండు రోజులు బ్యాన్ చేయడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. అన్ని పార్టీల నేతల్లోనూ కేసీఆర్ మాటల్ని ఈసీ ఇంత సీరియస్ గా తీసుకుందా అన్న డౌట్ కు...

రాజ్ దీప్ ఇంటర్యూలు : పవన్ జోష్, చంద్రబాబు విజన్ – జగన్ అహంకారం !

అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ లో ఇండియాటుడే చానల్ హెడ్ రాజ్ దీప్ సర్దేశాయ్ ముగ్గురు ప్రధాన నేతల్ని... ఇంటర్యూ చేశారు. ఏపీకే వచ్చారు. ముగ్గురు ప్రధాన నేతల ఇంటర్యూలను...

HOT NEWS

css.php
[X] Close
[X] Close