వాళ్లంతా కేసీఆర్ వెంట నడుస్తారట..! మరి చంద్రబాబు కోసం ప్రచారానికి వస్తున్నారేంటి..?

తాము పదహారు సీట్లు సాధిస్తే.. నూట అరవై సీట్లు సాధించే ఇతర పార్టీలు .. తమ వెనుక వస్తాయని.. దేశంలో అగ్గి పుట్టిస్తామని టీఆర్ఎస్ అధినేత కేసీయార్ ప్రకటించారు. కేటీఆర్ కూడా దాదాపుగా అదే చెబుతున్నారు. ఆ 160 సీట్లు సాధించే పార్టీలు ఏమున్నాయా.. అందరూ.. వెదుక్కూంటుంటే.. దానికి కూడా కేటీఆర్ సమాధానం ఇచ్చారు. అందులో మొదటిది జగన్మోహన్ రెడ్డి, తర్వాత మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, నవీన్ పట్నాయక్.. లాంటి ఇతర పార్టీల జాబితా చెప్పారు. మరి వారిలో ఒక్కరయినా… కేసీఆర్‌కు ఇప్పటి వరకూ మద్దతు ప్రకటించారా.. అంటే.. కనీసం.. ఆ ప్రయత్నం కూడా చేయలేదు. పోనీ.. కేసీఆర్ వారికేమైనా మద్దతు ఇచ్చారా అంటే.. అదీ లే్దు.

మమతా బెనర్జీ.. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో కలిసి.. ఏపీలో టీడీపీకి ప్రచారం చేయడానికి వస్తున్నారు. కానీ.. ఆమె టీఆర్ఎస్‌కు మద్దతు ఇవ్వడం లేదు. గతంలో.. మమతా బెనర్జీని కట్టడి చేయడానికి సీబీఐని ప్రయోగించినప్పుడు.. దేశంలోని విపక్షాలన్నీ అండగా నిలబడినా.. కేసీఆర్ మాత్రం నోరు తెరవలేదు. మరి మమతా బెనర్జీ …కేసీఆర్ వెంట ఎలా నడుస్తుంది..?. కనీసం మరోసారి భేటీకి అవకాశం ఇస్తుందా..? అలాగే ఫెడరల్ ఫ్రంట్ చర్చలంటూ.. కేసీఆర్… లక్నోకి పోవాలని రెడీ అయితే… మాయావతి, అఖిలేష్ ఇద్దరూ .. సమయం లేదని చెప్పేశారు. వారిని కలవకుండానే తిరిగి వచ్చారు. కానీ…మాయావతి పవన్ కల్యాణ్ కోసం.. ఏపీకి వస్తున్నారు. అఖిలేష్ యాదవ్ చంద్రబాబు కోసం వస్తున్నారు. వారంతా.. టీడీపీ కోసం… జిల్లాల్లో కూడా ప్రచారం చేయబోతున్నారు.

ఇక కేజ్రీవాల్ అయితే.. కేసీఆర్ తో ఇంత వరకూ ఒక్క సారి కూడా మాట్లాడలేదు. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో… కూటమి ప్రయత్నాలు చేస్తున్నా.. కేంద్రం నుంచి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న… కేజ్రీవాల్‌కు కేసీఆర్ కనీసం మాట సాయం చేయలేదు. ఇక కేటీఆర్.. తన 160 సీట్ల ఖాతాలోవేసుకున్న దేవేగౌడ ఇప్పటికి… కాంగ్రెస్ భాగస్వామి.ఆయన టీడీపీ కోసం ప్రచారం చేయడానికి ఏపీకి వస్తున్నారు. స్టాలిన్ కూడా.. చంద్రబాబు అడిగితే ప్రచారం చేస్తారు. ఇలా చెప్పుకుంటూ.. పోతే.. కేటీఆర్.. చెప్పిన ఆ నూట అరవై సీట్లు మొత్తం.. చంద్రబాబు వెనుక ఉన్నట్లుగా కనిపిస్తోంది. మరి కేటీఆర్, కేసీఆర్.. తమ వెనుక ఉన్నాయని ఎందుకని చెప్పుకుంటున్నారో… !

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పాల్ గారి పార్టీ టిక్కెట్ కోసం రూ. 50 లక్షలు ఇచ్చాడట !

సమాజంలో కొన్ని వింతలు జరగుతూ ఉంటాయి. నమ్మాలా వద్దో తేల్చుకోలేము. కేఏ పాల్ ఎల్బీ నగర్ టిక్కెట్ ఇస్తానంటే రూ. 50 లక్షలు పాల్ కు ఇచ్చేశాడట. చివరికి పాల్ టిక్కెట్ ఇవ్వలేదని...

“ఈ ఆఫీస్” భద్రం – స్పందించిన ఈసీ

ఏపీ ప్రభుత్వం జీవోలను అన్నీ దాచిన ఈ ఆఫీస్ ను అప్ గ్రేడేషన్ పేరతో సమూలంగా మాల్చాలనుకున్న ఏపీ ప్రభుత్వానికి ఈసీ చెక్ పెట్టింది. ఈ ఆఫీస్ అప్ గ్రేడేషన్ పేరుతో...

విజయ్ సేతుపతి నుంచి ఓ వెరైటీ సినిమా

హీరోగానే కాకుండా ప్రతి నాయకుడిగానూ కనిపించి ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకున్న విలక్షణ నటుడు విజయ్‌ సేతుపతి. హీరోయిజం లెక్కలు వేసుకోకుండా పాత్రలకు ప్రాధాన్యత ఇస్తూ ఆయన ప్రయాణం సాగుతోంది. ఇదే ఆయన్ని...

చంద్రముఖి కన్నా ఘోరం… ఆర్ఎస్పీ పై సోషల్ మీడియా ఫైర్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి తీహార్ జైల్లోనున్న ఎమ్మెల్సీ కవితను కలిసిన బీఆర్ఎస్ నేత ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close