ఫెడరల్ ఫ్రంట్‌ కోసం తెర వెనుక కేసీఆర్ ప్రయత్నాలు..!

తొలి దశలోనే తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్ ముగియడంతో… అందరి దృష్టి ఇతర రాష్ట్రాలపై పడింది. అదే సమయంలో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకుంటున్న ఇద్దరు ముఖ్యమంత్రుల వ్యవహారశైలిపైనా పడింది. ఓ వైపు మిత్రపక్షాల కోసం.. చంద్రబాబు జోరుగా ప్రచారం చేసేస్తూంటే… కేసీఆర్ మాత్రం సైలెంట్‌గా ఉన్నారు. అందరూ.. కేసీఆర్ ఎందుకు అలా ఉన్నారన్న సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే.. కేసీఆర్… సైలెంట్‌గా ఉండొచ్చు కానీ.. ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తున్నారు. ఇలా రాష్ట్రాల వెంట తిరిగి ప్రచారం చేయడం కన్నా… కొన్ని పార్టీలను.. తన కూటమిలోకి తెచ్చుకోవడం చాలా ముఖ్యమని ఆయన నమ్ముతున్నారు. దాని కోసం తెర వెనుక ప్రయత్నాలు చేస్తున్నారని.. టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.

ఏ రాజకీయ పార్టీకి అయినా.. సీట్ల సంఖ్య ముఖ్యం. సీట్లు ఉంటేనే జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పగలుగుతారు. అందుకే… కేసీఆర్ ఇప్పుడు సీట్ల సమీకరణపై దృష్టి పెట్టారు. ఎన్నికలకు ప్రత్యేకంగా సాయం చేయడం ద్వారా ఆయా పార్టీలను.. తన ఫ్రంట్‌లోకి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే తన వ్యూహాన్ని జగన్మోహన్ రెడ్డి పార్టీతోనే ప్రారంభించారు. కేసీఆర్ టార్గెట్ 100 మంది ఎంపీలు అని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతానికి కలిసి వచ్చేది జగన్ ఒక్కరే..జగన్ కు కనీసంగా 18 నుండి 20 స్థానాలు వస్తాయని కేసీఆర్ నమ్మకంగా ఉన్నారు. తన పార్టీకి పదహారు వస్తే.. ఆ సంఖ్య 35 చేరుతుంది. అందుకే చిన్నా చితక పార్టీల వైపు దృష్టి సారించారట. ఎన్నికల్లో ఆ పార్టీలకు అవసరమైన అన్ని వసతులు సమకూర్చుతామనే సందేశాన్ని పంపుతున్నారు. ఇతర రాష్ట్రాలకు కేసీఆర్ తరపున ప్రత్యేక దూతలు కూడా వెళ్తున్నారని ప్రచారం జరుగుతోంది.

తనకు నమ్మకమైన ఏజెన్సీలను రంగంలోకి దింపి కొన్ని కీలక రాష్ట్రాల్లో సర్వే చేయిస్తున్నారని అంటున్నారు. సర్వేల ఆధారంగా వీలైతే ఇప్పుడే కొన్ని ఆఫర్లు ఇస్తున్నారని తెలంగాణ భవన్‌లో ప్రచారం జరుగుతోంది. ఎన్నికల సమయంలో అందరికీ నిధుల అవసరం ఉంటుంది. ఈ సమయంలో వాటిని సమకూర్చితే ఫలితాల తర్వాత కేసీఆర్ వెంట నడిచేందుకు మొగ్గుచూపుతారన్న ఆలోచనలో ఉన్నారని చెబుతున్నారు. మొత్తానికి చంద్రబాబు బహిరంగంగా బీజేపీయేతర పక్షాల ప్రచారంలో పాల్గొంటున్నారు. కానీ.. కేసీఆర్ మాత్రం.. అంతర్గతంగా పని చేసేసుకుంటున్నారు. ఎవరిది పై చేయి అవుతుందో..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close