ఈవీఎంలతో రష్యా హ్యాకర్ల బిజినెస్ ప్రారంభమైందా..? చంద్రబాబు కొత్త అనుమానాలు..!

ఏ నియోజకవర్గంలో అయినా ఫలితాలు అనుకూలంగా రావాలంటే.. రూ.10 కోట్లు సర్దుబాటు చేయండి చాలు.. మేము ఈవీఎంలను హ్యాక్ చేసి… ఫలితాలను మార్చేస్తామంటూ… రష్యన్ హ్యాకర్లు దేశంలో తిరుగుతున్నారట. ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు వచ్చిన ఈ సమాచారాన్ని ముంబైలో మీడియా ముందు బయటపెట్టారు. రష్యన్ హ్యాకర్ల పేరుతో కొంత మంది అభ్యర్థుల్ని సంప్రదిస్తున్నారని.. రూ. ఐదు నుంచి పది కోట్ల వరకూ ఇస్తే.. ఫలితాన్ని అనుకూలంగా మారుస్తామని చెబుతున్నారని.. అంటున్నారు. దేశంలో క్షేత్ర స్థాయిలో ఈ ప్రచారం జరుగుతోందని.. ఇది నిజమో.. అబద్దమో కానీ.. పరిస్థితి మాత్రం తీవ్రంగా ఉందని ఆరోపించారు. కాంగ్రెస్ – ఎన్సీపీ కూటమికి మద్దతుగా ప్రచారం చేయడానికి మహారాష్ట్రకు వెళ్లిన చంద్రబాబు అక్కడ.. పలువురు విపక్ష పార్టీల నేతలతో సమావేశం నిర్వహించారు. ఈవీఎంలలో లోపాలు…వీవీ ప్యాట్లు యాభై శాతం లెక్కించడానికి చేయాల్సిన తదుపరి పోరాటంపై చర్చించారు.

ఈవీఎంలలో లోపాలను సరిదిద్దడంలో ఎన్నికల సంఘం విఫలమవుతోందని చంద్రబాబు మండిపడ్డారు. 50 శాతం వీవీప్యాట్‌ స్లిప్పులు లెక్కించాలని 23 పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు చంద్రబాబు గుర్తుచేశారు. ఓట్ల లెక్కింపునకు 6రోజులు పడుతుందని ఎన్నికల సంఘం చెప్పడం హాస్యాస్పదమన్నారు. ఎవరికి ఓటు వేశామనేది వీవీప్యాట్‌లో 7 సెకన్లు కనపడాలని.. అది కేవలం 3 సెకన్లు మాత్రమే కనిపిస్తోందన్నారు. వీవీప్యాట్‌ల కోసం రూ.9వేల కోట్లు ఖర్చు పెట్టి ఏం చేశారని ఈసీని చంద్రబాబు ప్రశ్నించారు. ఈవీఎంలోని ఓట్లు, వీవీప్యాట్‌ స్లిప్పులు సరితేలాలన్నారు. ఈవీఎంల్లో లోపాలు వస్తే సరిచేసేందుకు సరైన సిబ్బంది లేకపోవడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు.

దేశంలో.. నరేంద్రమోడీ మళ్లీ గెలుస్తారని ఎవరూ అనుకోవడం లేదు కానీ.. ఈవీఎంలను మ్యానిపులేట్ చేయడం వల్ల ఆయన ప్రధాని అవుతారని.. అందరూ నమ్ముతున్నారని అంటున్నారు. మూడో దశ పోలింగ్ లోనూ… ఈవీఎంలు అనేక చోట్ల మొరాయించాయి. చిత్రవిచిత్రమైన సమస్యలు ఎదురయ్యాయి. కేరళలో ఓ వీవీ ప్యాట్ మిషన్‌లో పాము బయటపడింది. కొన్ని చోట్ల కాంగ్రెస్ కు ఓటేస్తే బీజేపీకి పడింది. ఫిర్యాదులు వస్తే ఈవీఎంను మార్చారు. మొదటి దశలో ఏపీతో ప్రారంభమైన ఈవీఎంల అవస్తలు.. మూడో విడతలోనూ.. అలాగే కొనసాగాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చాయ్‌కీ.. చైతూకీ భ‌లే లింకు పెట్టేశారుగా!

స‌మంత‌తో విడిపోయాక‌.. నాగ‌చైత‌న్య మ‌రో పెళ్లి చేసుకోలేదు. కాక‌పోతే... త‌న‌కో 'తోడు' ఉంద‌న్న‌ది ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాల మాట‌. క‌థానాయిక‌ శోభిత ధూళిపాళ తో చై స‌న్నిహితంగా ఉంటున్నాడ‌ని, వీరిద్ద‌రూ డేటింగ్ చేస్తున్నార‌ని చాలార‌కాలుగా...

ఎక్స్ క్లూజీవ్‌: దిల్ రాజు బ్యాన‌ర్‌లో ధ‌నుష్‌

ధ‌నుష్ ఈమ‌ధ్య తెలుగు ద‌ర్శ‌కులు, తెలుగు నిర్మాత‌ల‌పై దృష్టి పెట్టాడు. 'సార్' అలా వ‌చ్చిందే. ఈ సినిమా బాక్సాఫీసు ద‌గ్గ‌ర మంచి ఫ‌లితాన్ని అందుకొంది. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో 'కుబేర‌' చేస్తున్నాడు....

ఇస్మార్ట్… ప‌ట్టాలెక్కింది!

రామ్ - పూరి జ‌గ‌న్నాథ్ కాంబోలో వ‌చ్చిన 'ఇస్మార్ట్ శంక‌ర్‌' ఇన్‌స్టెంట్ హిట్ అయిపోయింది. రామ్ కెరీర్‌లోనే భారీ వ‌సూళ్ల‌ని అందుకొన్న సినిమా ఇది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా 'డ‌బుల్ ఇస్మార్ట్'...

అక్ష‌య్ ప‌ని పూర్త‌య్యింది.. మ‌రి ప్ర‌భాస్ తో ఎప్పుడు?

మంచు విష్ణు అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్న చిత్రం 'క‌న్న‌ప్ప‌'. ఈ సినిమాలో చాలామంది పేరున్న స్టార్స్ క‌నిపించ‌బోతున్నారు. అందులో ప్ర‌భాస్ ఒక‌డు. ఈ చిత్రంలో ఆయ‌న నందీశ్వ‌రుడిగా అవ‌తారం ఎత్త‌బోతున్నారు. అక్ష‌య్ కుమార్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close