ఏం చేస్తే ఏమవుతుందో..? ఏమీ చేయకపోతేనే బెటరనుకుంటున్న ఏపీ యంత్రాంగం..!

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ 11వ తేదీనే ముగిసింది. కౌంటింగ్ మే 23న జరుగుతుంది. అప్పటిదాకా రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమల్లో ఉంటుంది. మామూలుగా అయితే ప్రభుత్వం నిర్దేశించిన పనులు, ప్రజలకు ఇబ్బంది రాకుండా వ్యవహారాలు చేసుకుంటూ వెళ్తారు. కానీ… ఇక్కడ సీఎస్ కీలకం. సీఎస్‌గా… కొత్త అధికారిని ఈసీ నియమించడంతో.. ఆయన ఎక్కడికక్కడ పాలన ఆగిపోవాలన్నట్లుగా… అధికారులపై పెత్తనం చేస్తూండటంతోనే అసలు సమస్య వచ్చింది. నియమావళి అమల్లో ఉండడంతో కొత్త నిర్ణయాలు చేసే అవకాశం లేదు. కానీ ఉన్న వాటిని అమలు చేయాలి. అమల్లో ఉన్న పథకాలకూ అడ్డుపుల్ల వేస్తున్నారు. రోజువారీ నిర్ణయాలు కూడా జరగడం లేదు. ఓ పక్క తాగునీటి ఎద్దడి ముంచుకొచ్చింది.. గృహ నిర్మాణం, ఉపాధి హామీ పనుల కల్పన, కూలీలకు వేతనాల చెల్లింపు, కేంద్రం నుంచి రావలసిన నిధుల కోసం ప్రయత్నాలు.. అన్నీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా అయిపోయాయి.

పురపాలక శాఖలో పన్నులు వసూలు చేసే సర్వర్లు స్తంభించినా పట్టించుకునే దిక్కు లేదు. ఇది ఖజానాలో జమ కావలసిన డబ్బు. ఇక ప్రభుత్వం చెల్లించాల్సిన బిల్లుల సంగతి చెప్పక్కర్లేదు. అవీ ఎక్కడివక్కడే ఆగిపోయాయి. చేసిన పనులకు బిల్లులు రాక.. సాగుతున్న పనులు ఆగిపోయి.. అంతా స్తబ్దత నెలకొంది. పరిపాలనలో పూర్తి ప్రతిష్టంభన ఏర్పడింది. వస్తున్నాం.. వెళ్తున్నాం అన్నట్లుగా పాలనా యంత్రాంగం తీరు ఉంది. పైనుంచి చెప్పేవారు లేకపోవడం, తమకు తాము నిర్ణయాలు తీసుకుంటే ఏమవుతుందోనని అధికారుల్లో ఆందోళన కనిపిస్తోంది.

ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నా.. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల కాలంలో కొన్ని అంశాలపై సమీక్ష జరిపారు. దీనిపై వైసీపీ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. ముఖ్యమంత్రి పరిస్థితే ఇలా ఉండడంతో.. మంత్రులు సమీక్షలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు. వివాదాలకు తావివ్వడం ఎందుకన్న ఉద్దేశంతో అధికారులతో సమావేశాలు పెట్టడం లేదు. ఏదైనా ఈ నెలరోజుల పాటు వాయిదా వేసేస్తే పోలా.. అన్న నిర్ణయానికి వచ్చేశారు. ప్రభుత్వ శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులే ఇలా ఉండడంతో.. కింద ఆయా శాఖల్లోనూ ఏ పనులూ జరగడం లేదు. ప్రజల నుంచి వచ్చే దరఖాస్తుల పరిశీలన పూర్తిస్థాయిలో ఆగిపోయింది. ఓ నెల రోజుల పాటు ఏమీ చేయకపోతేనే… బయటపడతామన్నట్లుగా ఏపీ యంత్రాంగం ఉంది. ఓ రకంగా ఏపీలో పాలన పడకేసింది. అధికారులు కూడా.. తమకు చేతనైనంత రీతిలో రాజకీయాలు చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close