ఇంటర్ బోర్డు వైఫల్యంపై రాజకీయం..! పిల్లలకు అన్యాయం చేయడమే..!

ఇంటర్ ఫలితాల విషయంలో … విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నారు. ఈ విషయంలో బయటకు వస్తున్న ఒక్కొక్క అంశం.. కలకలం రేపుతోంది. ఒక్కో విద్యార్థిది ఒక్కో వేదన. వారి రెండేళ్ల కష్టాన్ని … చిన్న నిర్లక్ష్యంతో ఇంటర్ బోర్డు విలువలేనిదిగా చేసేసింది. దీనిపై… జరగాల్సింది వేరు. ముందుగా విద్యార్థులకు న్యాయం చేయాలి. కానీ.. ఏం జరుగుతోంది..? మెల్లగా ఆ వ్యవహారాన్ని రాజకీయం చేస్తున్నారు. ఇంటర్ ఫలితాల అంశాన్ని విపక్షాలు రాజకీయంగా వాడుకోవాలనే ప్రయత్నాలు చేస్తున్నాయని విద్యా శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించేశారు. ఈ వ్యవహారంపై.. సంబంధిత శాఖ మంత్రిగా ఆయన తీసుకున్న చర్యలేమీ లేవు. కానీ… దీన్ని రాజకీయం చేయడానికి మాత్రం మొదటి అడుగు వేశారు.

ఆయన విమర్శలకు కౌంటర్‌గా… విద్యామంత్రిని బర్తరఫ్ చేయాలనే డిమాండ్‌తో .. విపక్షాలు రాజకీయానికి బయలుదేరాయి. ఇంటర్ ఫలితాల అంశం ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది..విద్యార్థులు,తల్లిదండ్రుల ఆందోళనలతో వాతావరణం వేడెక్కింది. విద్యార్థులను ఎలా సముదాయించారో అర్థం కాని పరిస్థితి. ఈ తరుణంలో రాజకీయమే బెటరని అనుకున్నట్లుగా ఉంది. ఈ మేరకు మంత్రి.. విపక్షాలపై విమర్శలు ప్రారంభించారు. వారు మంత్రిపై ఆరోపణలు ప్రారంభించారు. ఈ రోజు నుంచి ఇక విద్యార్థుల కన్నా…, రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలకే ఎక్కువ సమయం వెళ్లిపోయే అవకాశం కనిపిస్తోంది. దీన్ని రాజకీయ అంశంగా మార్చేసి.. ఇంటర్ బోర్డులో జరిగిన అవకతవకలు, అన్యాయమైపోయిన విద్యార్థుల్ని అలా గాలికి వదిలేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

గతంలో.. ఎసెంట్ లీకేజీ విషయాన్ని మీడియా బయటపెట్టినప్పుడు కూడా అదే జరిగింది. ఎంసెట్ పరీక్షను తప్పని పరిస్థితుల్లో రద్దు చేసి.. మళ్లీ నిర్వహించారు.. కానీ లీకేజీ నిందితుల్ని మాత్రం ఇప్పటి వరకూ గుర్తించలేదు. ఆ కేసు ఏమయిందో కూడా.. ఎవరికీ తెలియదు. ఇప్పుడు ఇంటర్ ఫలితాల వ్యవహారం కూడా అలా మారిపోయినా ఆశ్చర్యం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

“చెంగిచెర్ల” మీదుగా బీజేపీ ఎలక్షన్ ప్లాన్లు !

మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ఘర్షణ జరిగింది. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని కోరారు....
video

ఈదేశం విడిచి వెళ్లిపోండి.. లేదా చ‌చ్చిపోండి!

https://www.youtube.com/watch?v=nb-XDZQSZhE చాలా కాలంగా నారా రోహిత్ నుంచి సినిమాలేం రాలేదు. సుదీర్ఘ విరామం త‌ర‌వాత ఆయ‌న‌.. 'ప్ర‌తినిధి 2' తో ప‌ల‌క‌రించ‌బోతున్నారు. ఓర‌కంగా క‌రెక్ట్ కమ్ బ్యాక్ ఇది. ఎందుకంటే నారా రోహిత్ చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close