వాలంటీర్ల ఉద్యోగాలకు 50 శాతం కోత..! ఇదేం లెక్క..?

” ప్రభుత్వ పథకాలు ప్రతి గడపకూ చేరేందుకు ఈ ఏడాది ఆగస్టు 15 నాటికి వీలుగా 4 లక్షల మందిని నెలకు రూ.5000 జీతంతో వాలంటీర్లుగా నియమిస్తాం. గ్రామ సచివాలయాల్లో అక్టోబరు రెండో తేదీ నాటికి 10 మంది చొప్పున అన్ని వర్గాలతో కూడిన మరో 1,60,000 మంది గ్రామ కార్యదర్శులను నియమిస్తాం..”

ముఖ్యమంత్రిగా.. జగన్మోహన్ రెడ్డి .. ప్రమాణం చేసిన సమయంలోని ప్రసంగపాఠంలో వాలంటీర్ల గురించి చెప్పిన మాట ఇది. వాలంటీర్లుగా నాలుగు లక్షల మందిని ఆగస్టు పదిహేనో తేదీ కల్లా.. రూ. ఐదు వేల జీతంలో నియమిస్తామని.. జగన్మోహన్ రెడ్డి… సూటిగా ప్రకటించారు. కానీ ఇప్పుడు… వాలంటీర్ల నియామకాలకు.. నోటిఫికేషన్ వచ్చింది. అయితే.. ముఖ్యమంత్రి ప్రకటించినట్లు నాలుగు లక్షల వాలంటీర్ పోస్టులకు కాదు.. కేవలం 1,70,543 గ్రామ వలంటీర్ల నియామకానికి మాత్రమే నోటిఫికేషన్లు జారీ చేశారు. పట్టణాల్లో మరో 40 వేల వార్డు వలంటీర్ల నియామకాలకు కూడా ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేయనుంది. అంటే మొత్తం పోస్టులు రెండు లక్షలకు అటూ ఇటుగా ఉండనున్నాయి.

ఏపీలో మొత్తం కుటుంబాలు… 1,22,70,164 ఉన్నాయని 2011 సామాజిక ఆర్థిక, కుల గణన తెలిపింది. ఎనిమిదేళ్లలో వీటి సంఖ్య కోటి 70 లక్షలు దాటిపోయి ఉంటుందని అంచనా. వీటిలో గ్రామీణ కుటుంబాల శాతం 76. అంటే.. దాదాపుగా కోటి ఇరవై లక్షల కుటుంబాలకుపైగానే… గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్నారు. వీరందరికీ… లక్షా 70వేల వాలంటీర్ల పోస్టులు సరిపోయే అవకాశం లేదు. పట్టణ ప్రాంతాల్లో… మరో ఇరవై నాలుగు శాతం కుటుంబాలు ఉంటాయి కాబట్టి… 40వేల వాలంటీర్లు సరిపోరు. అయినప్పటికీ.. ప్రభుత్వం.. కుదించి నోటిఫికేషన్ విడుదల చేసింది. జగన్ చెప్పిన నాలుగు లక్షల వాలంటీర్లలో… సగానికి సగం తగ్గించడం… మాత్రం అనూహ్యమే.

జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటనకు… ఇప్పుడు.. ప్రభుత్వం… ఇస్తున్న ఉద్యోగాలకు పొంతన లేకపోవడంతో… యువతలో అనుమానాలు మొదలయ్యాయి. నాలుగు లక్షల ఉద్యోగాలు వస్తాయని.. అందులో… వైసీపీ కార్యకర్తల కోటా ఎంతో కొంత పోయినా.. తమకు కనీస ఉద్యోగం ఉంటుందని.. చాలా మంది యువత ఆశలు పెట్టుకున్నారు. అయితే.. ఇప్పుడు ఏకంగా ప్రభుత్వం రెండులక్షల ఉద్యోగాలకు కోత పెట్టడంతో… వారు నిరాశ చెందుతున్నారు. గ్రామ సచివాలయాల్లో నియమిస్తామంటున్న మరో లక్షా అరవై వేల మందిని అయినా నియమిస్తారో.. అక్కడా కోత విధిస్తారోనని.. యువతలో టెన్షన్ ప్రారంభమయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఘరానా మోసం… బ్రతికున్నా చంపేస్తున్నారు..!!

హైదరాబాద్ చుట్టుప్రక్కల మీ పేరిట ప్లాట్ ఉందా..? డాక్యుమెంట్స్ సరిగ్గా ఉన్నాయని తీరిగ్గా ఉన్నారా..? అయినా ప్లాట్ల విషయంలో ప్రమాదం పొంచి ఉందండోయ్. నకిలీ ఆధార్ , నకిలీ ధృవీకరణపత్రాలు, నకిలీ ఓనర్...

క్రికెట్ మ్యాచ్‌లో ‘కుబేర‌’ స‌ర్‌ప్రైజ్‌

నాగార్జున మ‌న‌సు మ‌ల్టీస్టార‌ర్ల‌వైపు మ‌ళ్లింది. ఇప్పుడాయ‌న చేతిలో రెండు మ‌ల్టీస్టార‌ర్లు ఉన్నాయి. వాటిలో 'కుబేర‌' ఒక‌టి. శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్ర‌మిది. ధ‌నుష్ క‌థానాయ‌కుడు. ఇందులో నాగార్జున కీల‌క పాత్ర పోషిస్తున్న...

ఎక్స్‌క్లూజీవ్‌: బెల్లంకొండ‌తో సంయుక్త‌

బెల్లంకొండ శ్రీ‌నివాస్ క‌థానాయ‌కుడిగా మూన్ షైన్ పిక్చ‌ర్స్ ఓ చిత్రాన్ని రూపొందిస్తోంది. దీంతో లుధీర్ బైరెడ్డి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ చిత్రంలో క‌థానాయిక‌గా సంయుక్త మీన‌న్ ని ఎంచుకొన్నారు. బెల్లంకొండ -...

మ‌హేష్‌, ఎన్టీఆర్ చిత్రాల‌పై క్లారిటీ!

ఈ యేడాది టాలీవుడ్ లో భారీ, క్రేజీ చిత్రాలు ప్రారంభం కాబోతున్నాయి. వాటిలో మ‌హేష్ - రాజ‌మౌళి, ఎన్టీఆర్ - ప్ర‌శాంత్ నీల్ చిత్రాలు ముందు వ‌రుస‌లో ఉన్నాయి. 'గుంటూరు కారం' పూర్త‌యిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close