కోత, కొరతలకు వైసీపీ మార్క్ పరిష్కారాన్ని చూపిన శ్రీకాంత్ రెడ్డి..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడి నెల రోజులే అయినందున… ప్రభుత్వంపై విమర్శలు చేయకూడదన్నట్లుగా మాట్లాడుతున్నారు చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి. విత్తనకొరత. కరెంట్ కోతలపై.. విపక్షం నుంచి వస్తున్న విమర్శల దాడిని తిప్పికొట్టేందుకు … శ్రీకాంత్ రెడ్డి వినూత్న మార్గాన్ని ఎంచుకున్నారు. అసలు సమస్యలే లేవని తేల్చి చెప్పేశారు. రాష్ట్రంలో విద్యుత్‌ కోతలు లేవు..విత్తనాల కొరత లేదని.. నెలరోజుల్లోనే ప్రభుత్వంపై చంద్రబాబు, లోకేష్ ఆరోపణలు సరికాదని చెప్పుకొచ్చారు. మరి కొద్ది రోజలుగా.. వైసీపీ తరపున రికార్డెడ్‌గా మాట్లాడిన నేతలంతా…విత్తన సంక్షోభానికి చంద్రబాబే కారణమని ఆరోపణలు చేశారు.

చివరికి వ్యవసాయమంత్రి కన్నబాబు కూడా.. ఓ కట్ట లేఖలు మీడియా ముందు పెట్టి.. చంద్రబాబు విత్తన కంపెనీలకు నిధులివ్వకపోవడం వల్లే.. విత్తన కొరత ఏర్పడిందని ఆరోపించారు. దీనికి చంద్రబాబే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక .. రోజూ ఏదో ఓ చోట.. రైతులు విత్తనాల కోసం.. ఆందోళనలు చేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. అలాగే.. కరెంట్ కోతల గురించి… కూడా.. ఆందోళనలు జరుగుతున్నయి. సబ్ స్టేషన్లను ముట్టడిస్తున్నారు. అయినప్పటికీ.. శ్రీకాంత్ రెడ్డి.. అసలు ఏపీలో కరెంట్ కోత లేదని తేల్చారు. అంతే కాదు.. విత్తనాల కొరత కూడా లేదన్నారు.

అసెంబ్లీలో..కరెంట్ కోతలపై.. అచ్చెన్నాయుడు కూడా మాట్లాడారు. కరెంట్ ఉంది.. సరిగ్గా మెయిన్‌టనెన్స్ లేకపోవడం వల్లే కరెంట్ ఇవ్వకపోతున్నారని అసెంబ్లీలో చెప్పారు. అప్పుడు ప్రభుత్వం కరెంట్ కోతల్లేవని చెప్పలేకపోయారు. ఇప్పుడు సమస్య తీవ్రతరం అయ్యే సరికి.. ప్రతిపక్షం నుంచి విమర్శలు ప్రారంభమయ్యే సరికి.. అసలు సమస్యే లేదని చెప్పుకునేందుకు ప్రాధాన్యం ఇస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డీజీపీకి యంత్రాంగం సహకరించడం లేదా ?

పోలింగ్ అనంతర హింసను అరికట్టడంలో డీజీపీకి పూర్తి స్థాయిలో యంత్రాంగం సహకరించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ అంశంపై ఈసీకి కూడా ఫిర్యాదులు అందడంతో ఏపీ సీఎస్ తో పాటు...

టెన్షన్ లో వైసీపీ ఫైర్ బ్రాండ్స్..!!

ఏపీ ఎన్నికల ట్రెండ్స్ వైసీపీకి ఘోర పరాజయం తప్పదని తేల్చుతుండటంతో ఆ పార్టీ ఫైర్ బ్రాండ్స్ పరిస్థితి ఏంటన్నది ఆసక్తికర పరిణామంగా మారింది. హోరాహోరీ పోరులో గెలిచి నిలుస్తారా..? దారుణమైన పరాభవం చవిచూస్తారా..?...

సూర్య‌, కార్తి సినిమా… రౌడీ చేతుల్లో?!

విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా మైత్రీ మూవీస్‌ బ్యాన‌ర్‌లో ఓ సినిమా రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. 'టాక్సీవాలా' ఫేమ్ రాహుల్ సంకృత్య‌న్‌ ద‌ర్శ‌కుడు. ఇదో పిరియాడిక‌ల్ యాక్ష‌న్ డ్రామా. విజ‌య్ దేవ‌ర‌కొండ పుట్టిన రోజున...

2 శాతం ఎక్కువ – ఏపీ ఓటర్లలో చైతన్యం ఎక్కువే !

ఎవరికి ఓటేస్తారన్న విషయం పక్కన పెడితే ఎలాగైనా ఓటేయాలన్న ఓ లక్ష్యాన్ని ఓటర్లు ఖచ్చితంగా అందుకుంటున్నారు. అది అంతకంతకూ పెరిగిపోతోంది. 2014తో పోలిస్తే 2019లో ఒక్క శాతం పోలింగ్ పెరగ్గా 2019తో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close