బిజెపి, వైకాపాల కుటుంబ కథా చిత్రం

కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్సిపి లు రెండూ, అధికారికంగా పొత్తు లేకపోయినప్పటికీ, ఎన్నికలకు ముందు మిత్రపక్షాల వలె వ్యవహరించిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో నాయకుల తీరు చూస్తుంటే అయితే వైఎస్సార్ సీపీలోకి లేదంటే బిజెపిలోకి చేరిపోతున్నారు. ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు ఒకరు వైఎస్సార్సీపీలో మరొకరు బిజెపిలో చేరుతూ ఉండడంతో ఇది ఒక కుటుంబ కథా చిత్రాన్ని తలపిస్తోంది. వివరాల్లోకి వెళితే..

తెలుగుదేశం పార్టీ లో చాలా కాలం పాటు కొనసాగిన అంబికా కృష్ణ ఈ మధ్య బిజెపిలో చేరి పోయారు. తెలుగుదేశం పార్టీ తరఫున ఆయనకు ఏమీ లోటు చేయనప్పటికీ, మారిన పరిస్థితుల దృష్ట్యా తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు మీద నెలకొన్న అనిశ్చితి కారణంగా ఆయన బీజేపీ లోకి వెళ్లారని అర్థమవుతుంది. తెలుగుదేశం పార్టీ తరపున ఎంపీగా పోటీ చేయడమే కాకుండా బాలకృష్ణ తో కూడా పలు సినిమాలు నిర్మించి ఉండడంతో తెలుగుదేశం పార్టీ అభిమానుల లో కూడా ఆయన అంటే అభిమానం ఉండేది. కానీ ఏది ఏమైతేనేం ఆయన మొత్తానికి బిజెపిలో చేరి పోయారు. అయితే ఇప్పుడు ఆయన సోదరుడు అంబికా రాజా మాత్రం వైఎస్ఆర్సీపీలో చేరారు. మొత్తానికి సోదరులు ఇద్దరూ ఒకరు బిజెపిలో మరొకరు వైఎస్ఆర్సీపీలో చేరారు.

అయితే ఒకే కుటుంబానికి చెందిన వారిలో ఒకరు బిజెపిలో మరొకరు వైఎస్ఆర్సిపిలో చేరే ట్రెండ్ ఈమధ్య బాగా కనిపిస్తోంది. ఎన్నికల ముందు బిజెపి నేత పురంధరేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వర రావు, వారి కుమారుడు వైఎస్సార్ సీపీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ ట్రెండ్ కేవలం పెద్ద నేతలకు పరిమితం కాలేదు. ఎన్నికలయ్యాక చాలా మంది స్థానిక నేతలు, చోటామోటా నేతలు కూడా ఒకరు వైఎస్ఆర్సీపీలో చేరితే అదే కుటుంబానికి చెందిన మరొకరు బిజెపిలో చేరుతున్నారు. చాలా చోట్ల ఇదే సీన్ కనిపిస్తూ ఉండటంతో రాష్ట్రంలో ఇది ఒక కుటుంబ కథా చిత్రాన్ని తలపిస్తోంది.

మరి ఈ కుటుంబ కథా చిత్ర ట్రెండ్ ఎంత కాలం కొనసాగుతుందో చూడాలి

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కర్ణాటకపై బీజేపీ నజర్..ఏక్ నాథ్ షిండే సంచలన వ్యాఖ్యలు..!!

మరోసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే బీజేపీయేతర ప్రభుత్వాలను కూల్చుతుందని ప్రచారం జరుగుతోన్న వేళ మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మహారాష్ట్రలో లాగే కర్ణాటకలోనూ...

వన్స్ మోర్ ‘సుచి లీక్స్’: ఈసారి ధనుష్, జీవీ ప్రకాష్

సినిమా వార్తలని ఫాలో అయ్యేవారికి సుచీ లీక్స్ గురించి పరిచయం అవసరం లేదు. 'సుచీ లీక్స్‌' పేరుతో కోలీవుడ్‌లో దుమారం రేపారు సింగర్‌ సుచిత్ర. అప్పట్లో ఆమె నుంచి వచ్చిన...

పుష్ప ఇంపాక్ట్.. బన్నీ ఫుల్ క్లారిటీ

సినిమా ప్రభావం ఖచ్చితంగా సమాజంపై వుంటుందని కొందరి అభిప్రాయం. సమాజంలో ఉన్నదే సినిమాలో ప్రతిబింబిస్తుందని మరికొందరి మాట. సినిమాని సినిమాగా చుస్తారానినేది ఇంకొందరి వాదన. హీరో అల్లు అర్జున్ కూడా ఇదే అభిప్రాయాన్ని...

తీహార్ జైలుకు బాంబు బెదిరింపు… ఆందోళనలో కవిత అభిమానులు..?

అత్యంత భద్రత నడుమ ఉండే తీహార్ జైలుకు బాంబు బెదిరింపు రావడం తీవ్ర కలకలం రేపుతోంది. జైలును పేల్చేస్తామంటూ ఆగంతకులు మెయిల్ చేయడంతో అధికారులు అలర్ట్ అయి పోలీసులకు సమాచారం అందించారు. ఆగంతకుల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close