జీతాల పెంపు చాలదని సాక్షి ఉద్యోగుల సమ్మె..!

అంచనాలు ఎక్కువైపోతే సినిమా అట్టర్ ఫ్లాపవుతుంది. సినిమా బాగున్నా… అది అంచనాలను అందుకోవడం కష్టం కాబట్టి.. ఎంతో ఊహించుకున్న వారు..”ప్చ్ ” అనేస్తారు. చివరికి అది డిజాస్టర్ గా మారిపోతుంది. ప్రస్తుతం.. ఆంధ్రప్రదేశ్ సీఎం.. జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి పత్రికలో అలాంటి పరిస్థితే ఉంది. ఎంతో ఊహించుకున్నామని.. పెంచిన జీతం సరిపోదని… ఇంకా పెంచాలని డిమాండ్ చేస్తూ.. సాక్షి ఉద్యోగులు … ఆందోళన బాట పట్టారు. మీడియా వర్గాల్లో ఇప్పుడీ వ్యవహారం కలకలం రేపుతోంది. సాక్షి పత్రికలో గత మూడేళ్లుగా ఇంక్రిమెంట్లు ఇవ్వలేదు. సంస్థ ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని.. వైసీపీ గెలిస్తే.. జగన్ సీఎం అయితే.. మూడేళ్ల ఇంక్రిమెంట్ కన్నా.. ఎక్కువ ఇస్తామని యాజమాన్యం చెబుతూ వచ్చింది. జగన్ గెలుపు కోసం ఉద్యోగులంతా ఎదురు చూశారు.. ఆ క్షణం రానే వచ్చింది.

వారికి చెప్పినట్లుగా జీతం కూడా పెంచారు. కానీ ఆ పెంచిన జీతం.. వారి అంచనాలను అందుకోలేదు. ఎంతో పెంచుతారని.. ఆశించిన ఉద్యోగులకు… కేవలం 6.5 శాతం మాత్రమే పెంచడమే.. హతాశులయ్యారు. ప్రతి ఒక్కరిలోనూ అసంతృప్తి ఉంది. అయితే.. ఇది చర్చలకే పరిమితం కాలేదు. సాక్షిలోని స్టోర్స్ సిబ్బంది కార్యాచరణకు దిగారు. తమకు.. 6.5 శాతం పెంపుదల ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని.. మరింత పెంచాలని డిమాండ్ చేస్తూ.. సమ్మెలోకి వెళ్లిపోయారు. మూడు రోజులుగా వారు సాక్షి ప్రింటింగ్ కార్యాలయాల్లో.. విధులు నిర్వహించడం లేదు. స్టోర్స్ సిబ్బంది.. అంతా విధులకు దూరంగా ఉండి.. తమ నిరసన తెలియచేస్తున్నారు.

సాక్షిలో పని చేస్తున్న అన్ని విభాగాల్లో ఉద్యోగుల పరిస్థితి అంతే ఉంది. వీరికి మద్దతుగా మిగిలిన విభాగాల వారూ రంగంలోకి దిగవచ్చని.. ప్రచారం జరుగుతోంది. సాక్షి యూనిట్ కార్యాలయాల్లో కార్యకలాపాలు ఆగిపోయినా.. ఆశ్చర్యపోవాల్సిన పని లేదంటున్నారు. గెలిస్తే.. అన్నీ వస్తాయని… ఆశ పెట్టేసి.. తీరా గెలిచాక.. అరకొర విదిలింపులు చేస్తే.. అసంతృప్తి ఎలా ఉంటుందో..జగన్మోహన్ రెడ్డికి.. ఇంటా బయటా తెలుస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close