చెప్పినట్లే సంక్షేమం..! నవరత్న మంత్రమే బడ్జెట్..!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. ప్రతిపక్షంగా ఐదేళ్ల పాటు పోరాడారు. ఆ సమయంలోనే ఆయన తన స్పష్టమైన విజన్‌తో తెర ముందుకు వచ్చారు. ప్లీనరీ వేదికగా.. నవరత్నాలను ప్రకటించి.. మనసా..వాచా.. వాటిని అమలు చేస్తానని ప్రజలు పదే పదే చెప్పడం ప్రారంభించారు. వాటిలో చాలా వరకు.. అప్పటి అధికారపక్షం చివరిలో అమలు చేయడం ప్రారంభించినప్పటికీ.. ఆయన వెనుకడుగు వేయలేదు. ఆ రత్నాలను మరింత మెరుగుపర‌చి.. ఇస్తామన్నారు. ప్రజల మనసుల్ని దోచారు. ఓట్ల రూపంలో పట్టం కట్టించుకున్నారు. ఇప్పుడు.. ఆ హామీలన్నీ అమలు చేయడానికి అదే.. మనసా.. వాచా..కర్మణా ప్రయత్నిస్తున్నారు. అది బడ్జెట్‌లో ప్రతిఫలించింది.

మాట తప్పలేదు.. నవరత్నాలకు మెరుపులే..!

ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్ ప్రసంగాన్ని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చదివి వినిపిస్తూంటే… ప్రతి ఒక్కరికి.. ఏదో ఓ ప్రయోజనం కనిపించిందంటే అతిశయోక్తి కాదు. రైతులు, పేదలు, మహిళలు, వృద్ధులు, విద్యార్థులు, వితంతువులు, వికలాంగులు… ఇలా అన్ని వర్గాల వారికీ నగదు ప్రయోజనం అందే పథకాలకు బడ్జెట్‌లో చోటు దక్కింది. ప్రతి ఒక్కరికీ ఆర్థికంగా అండనిచ్చేందుకు ఉద్దేశించిన పథకాలకే అత్యధిక కేటాయింపులు చేశారు. రూ.2.27 లక్షల కోట్ల బడ్జెట్లో రూ.75 వేల కోట్లకు పైగా సంక్షేమ రంగానికే కేటాయించారు. రైతుల కోసం ఏకంగా రూ.28,866 కోట్లు కేటాయించారు. నవవరత్నాల్లో దాదాపు ఎనభై శాతం పథకాలకు నిధులు కేటాయించారు. వచ్చే ఏడాది మిగతా ఇరవై శాతం పథకాలను కూడా అమలు చేయాలని.. జగన్ సంకల్పించారు.

బడ్జెట్ రూపంలో కనిపించిన మేనిఫెస్టో..!

మేనిఫెస్టోను.. ఓ బైబిల్‌గా.. ఓ భగవద్గీతగా.. ఓ ఖురాన్‌గా భావించాలని.. జగన్మోహన్ రెడ్డి.. ఎప్పుడూ చెబుతూంటారు. ప్రతి ఒక్కరి దగ్గర తన మేనిఫెస్టో ఉండాలని ఉద్యోగులనూ ఆదేశించారు. దానికి తగ్గట్లుగానే.. ఆయన సచివాలయం చాంబర్‌కు వెళ్లే దారిలో గోడలకు నవరత్నాల పోస్టర్లనూ అంటించమని ఆదేశించారు. అలా మాటకే కాదు… చేతల్లోనూ.. ఆ నవరత్నాలను ప్రజలకు అందించేందుకు బడ్జెట్ ద్వారా ప్రయత్నించారు. హామీలన్నింటికీ నిధులు కేటాయించారు. ఓ రకంగా.. చూస్తే.. బడ్జెట్‌ పత్రంలో.. వైసీపీ మేనిఫెస్టోనే కనిపించిందంటే… అతిశయోక్తి కాదు. ఆర్థిక భారమైన పథకాలను ఎన్నికల ముందు వరకూ.. అమలు చేయకుండా.. హడావుడిగా అమలు చేస్తే.. ప్రజా విశ్వాసాన్ని పొందలేమన్న ఉద్దేశంతో.. భారమైనా ముందుగానే ముందడుగు వేశారు.

అమరావతిపై క్లారిటీ ఇచ్చేసినట్లే..!

ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో పాటు కళ్ల ముందు కనిపించే అభివృద్ధికి కూడా.. జగన్మోహన్ రెడ్డి సర్కార్ బడ్జెట్‌లో ప్రాధాన్యం ఇచ్చింది. పోలవరం ప్రాజెక్ట్‌కు రూ. ఐదు వేల కోట్లకుపైగా కేటాయించి.. రెండేళ్లలో పూర్తి చేస్తామన్న ధీమాను ప్రదర్శించింది. అదే సమయంలో.. అమరావతి నిర్మాణానికి రూ. ఐదు వందల కోట్లను కేటాయించి..అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే.. ఈ ప్రభుత్వ ప్రాధాన్యాల్లో ఎక్కడా అమరావతి లేదు. సీఎం కూడా ఎన్నికల సభల్లో ఎక్కడా రాజధాని గురించి చెప్పలేదు. ఆ తర్వాత కూడా చెప్పలేదు. అమరావతి కోసం రూ. ఐదు వందల కోట్లు కేటాయించారంటే.. అమరావతి విషయంలో.. జగన్ పాజిటివ్ గానే ఉన్నట్లు అర్థం చేసుకోవాలి. అమరావతిని ప్రాధాన్యతగా నిర్ణయించుకున్న తర్వాత.. నిర్మాణలను పరుగులు పెట్టించే అవకాశం ఉంది.

మొత్తానికి.. అధికారం కట్టబెట్టిన నవరత్నాలతో.. ప్రజలకు అభిషేకం చేయడానికి ప్రభుత్వం తొలి పద్దులో ప్రయత్నించింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంగళగిరిలో ఆకట్టుకుంటున్న నారా బ్రహ్మణి ప్రచార శైలి

నారా లోకేష్ సతీమణి మంగళగిరి నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. నారా లోకేష్ మంగళగిరిలో అందుబాటులో ఉండని సమయంలో ఆమె ప్రచారం చేస్తున్నారు. రెండు, మూడు వారాలుగా విస్తృతంగా మంగళగరిలో అన్ని వర్గాల...

కూటమి ప్రభుత్వంలో వంగవీటి రాధాకృష్ణకు కీలక పదవి !

వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ కోసం నిస్వార్థంగా ప్రచారం చేస్తున్నారు. దెందలూరు సభలో వంగవీటి రాధాకృష్ణను చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన ఏమీ ఆశించకుండా పార్టీ కోసం పని చేస్తున్నారని ఏ...

అభివృద్ధితో సంక్షేమం – టీడీపీ, జనసేన మేనిఫెస్టో కీలక హామీలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా వివరించారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన సూపర్...

ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండనుంది..ఆ సర్వేలో ఏం తేలిందంటే..?

ఏపీలో సర్వే ఏదైనా కూటమిదే అధికారమని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రైజ్ ( ఇండియన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close