టీటీడీ చైర్మన్‌కు అమరావతిలో క్యాంప్ ఆఫీస్‌ ఎందుకో..?

తిరుమల తిరుపతి దేవస్థానాలకు చైర్మన్‌గా నియమితులైన.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాబాయి.. వై.వి.సుబ్బారెడ్డి వ్యవహారశైలి రాను రాను వివాదాస్పదంగా మారుతోంది. ఇంత వరకూ.. చైర్మన్ ఒక్కరే పాలకమండలికి ఉన్నారు. సభ్యుల నియామకం పూర్తి కాలేదు. ఈ కారణంగా.. ఆయనకు ఎలాంటి అధికారాలు ఇంకా దఖలు పడినట్లుకాదు. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా.. పాలక మండలి అనుమతితోనే తీసుకోవాలి. కానీ ప్రభుత్వ పెద్దలకు అత్యంత సన్నిహిత బంధువు కావడం… ప్రభుత్వంలో చక్రం తిప్పే వ్యక్తుల్లో ఒకరు కావడంతో.. ఆయన మాటలకు ఎదురు చెప్పే పరిస్థితి లేకపోయింది. ఈ క్రమంలో ఆయన కోసం.. ఆయన చేయమని ఆదేశించిన పనులు ఇప్పుడు వివాదాస్పదమవుతున్నాయి. తాజాగా ఆయన తీసుకున్న నిర్ణయం అమరావతిలో క్యాంప్ ఆఫీసు ఏర్పాటు చేసుకోవడం.

టీటీడీ చైర్మన్‌గా ఎంత పెద్ద వ్యక్తి ఉన్నప్పటికీ… వారి కార్యకలాపాలు… కేవలం తిరుమలకే పరిమితమవుతాయి. రాజధాని అమరావతిలో ఉండి నీ.. టీటీడీ చైర్మన్ చేసేదేమీ ఉండదు. అందుకే.. ఇంత వరకూ ఏ టీటీడీ చైర్మన్ కూడా రాజధానిలో క్యాంపాఫీస్ అనే ఆలోచన చేయలేదు. కానీ సుబ్బారెడ్డి మాత్రం.. రాగానే తిరుమలో తన క్యాంపాఫీస్‌గా.. తను తన భార్య పేరు మీద నిర్మించిన కాటేజ్‌నే… ఎంచుకున్నారు. అక్కడ్నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. కొత్తగా.. అమరావతిలోనూ.. టీటీడీ క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు అధికారులు కూడా.. ఆరుగురు ఉద్యోగులతో… చైర్మన్ క్యాంప్ ఆఫీసు ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేశారు. ఇది..ఇతర రాజకీయ నాయకులనే కాదు భక్తులను కూడా విస్మయానికి గురి చేస్తోంది.

టీటీడీ చైర్మన్ కు అమరావతిలో క్యాంప్ ఆఫీస్ ఎందుకని ప్రశ్నిస్తున్నారు. శ్రీవారి సొమ్మును ఇలా దుర్వినియోగం చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. టీటీడీ చైర్మన్ అయినప్పటికీ.. జగన్మోహన్ రెడ్డి బాబాయిగా.. వైవీ సుబ్బారెడ్డి… ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఎక్కువ కాలం అమరావతిలోనే ఉంటారు కాబట్టి.. ఈ ఏర్పాటని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఇప్పుడే ఇన్ని వివాదాలు వస్తున్నాయి.. మరి పాలక మండలి ఏర్పాటైతే సభ్యులు కూడా.. తమ తమ రాష్ట్రాల్లో క్యాంప్ ఆఫీసులు కావాలని కోరుకుటారేమో..? కొసమెరుపేమిటంటే… భక్తుల సౌకర్యం కోసమే అమరావతిలో క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేసుకున్నానని వైవీసుబ్బారెడ్డి చెబుతున్నారు. అంటే.. అ క్యాంప్ ఆఫీస్.. చైర్మన్ కోసం కాదు.. భక్తుల కోసమేనన్నమాట.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close