ఏపీకి వచ్చేందుకు ఢిల్లీలో లాబీయింగ్ చేసుకుంటున్న శ్రీలక్ష్మి..!

ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిని ఎలా అయినా ఏపీ క్యాడర్‌కు తీుసకు రావాలన్న పట్టుదలతో…జగన్ ప్రభుత్వం ఉన్నట్లుగా ఉంది. జగన్ అక్రమాస్తుల కేసులో నిందితురాలైన శ్రీలక్ష్మి.. జైల్లో చాలా కాలం పాటు ఉన్నారు. అనారోగ్యం పాలయ్యారు. బెయిల్ పొంది.. అనారోగ్యం నుంచి కోలుకున్న తర్వాత విధుల్లో చేరారు. రాష్ట్ర విభజన సమయంలో.. ఆమెను తెలంగాణ క్యాడర్ కు కేటాయించారు. అయితే… ఏపీలో వైసీపీ గెలిచిన తర్వాత… జగన్మోహన్ రెడ్డి.. కొంత మంది తెలంగాణ అధికారులను ప్రత్యేకంగా ఏపీకి తీసుకు రావాలనుకున్నారు. వారిలో ఐఏఎస్ శ్రీలక్ష్మి, ఐపీఎస్ స్టీఫెన్ రవీంద్ర ఉన్నారు. కేసీఆర్ తో జరిగిన తొలి భేటీలోనే… వీరిని ఏపీకి డిప్యూటేషన్ పై పంపాలని జగన్ కోరారు. దానికి కేసీఆర్ అంగీకరించారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాల అంగీకారంతో.. ఫైల్ ను.. కేంద్రానికి పంపారు.

సివిల్ సర్వీస్ అధికారుల డిప్యూటేషన్లు చూసే.. ఢిల్లీలోని డీవోపీటీ విభాగం మాత్రం… వీరి డిప్యూటేషన్ ఫైళ్లను పక్కన పెట్టేసింది. నిబంధనల ప్రకారం.. బలమైన కారణం లేకపోవడంతో… డిప్యూటేషన్ పని జరగడం లేదు. విజయసాయిరెడ్డి.. ఢిల్లీ స్థాయిలో పలుకుబడి ఉపయోగించినా పని కాకపోవడంతో… నేరుగా శ్రీలక్ష్మినే ఢిల్లీకి పిలిపించారు. విజయసాయిరెడ్డి దగ్గరుండి.. శ్రీలక్ష్మిని.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వద్దకు తీసుకెళ్లారు. పార్లమెంట్ ప్రాంగణంలో.. అమిత్ షాను..శ్రీలక్ష్మి కలిశారు. తనను ఏపీకి డిప్యూటేషన్ పంపే ఫైల్ ను క్లియర్ చేయాలని విజ్ఞప్తి చేశారు.

అయితే.. డిప్యూటేషన్ పై అమిత్ షా హామీ ఇచ్చారో లేదో క్లారిటీ లేదు. మరో వైపు శ్రీలక్ష్మీకి ఓకే చెబితే.. స్టీఫెన్ రవీంంద్ర ఫైల్ కూడా ఓకే అవుతుందని ఏపీ సర్కార్ భావిస్తోంది. అయితే.. స్టీఫెన్ రవీంద్రను మాత్రం.. ఢిల్లీకి పిలిపించలేదు. నిబంధనల కారణంగా కాకుండా… కొన్ని ప్రత్యేకమైన రాజకీయ కారణాల వల్లే డిప్యూటేషన్లను కేంద్రం ఆపిందనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపధ్యంలో కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేసీఆర్, కేటీఆర్ లేకపోతే తెలంగాణ ఏమైపోతుందో !?

బీఆర్ఎస్ లేకపోతే తెలంగాణను ఎవరో ఎత్తుకుపోతారన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. తాము ఉన్నప్పుడంతా స్వర్గం.. ఇప్పుడు నరకం అని ప్రజలకు చెబుతున్నారు. విచిత్రం ఏమిటంటే.. కొత్తగా తాము లేకపోతే...

వాలంటీర్ల లేకపోతే ఇంటింటికి పెన్షన్లు ఇవ్వలేరా ?

ఒకటో తేదీన పించను ఇంటి వద్ద ఇవ్వడానికి ఉద్యోగులు సరిపోరని నమ్మించడానికి ఏపీ ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్న వారు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. పించన్లను బ్యాంక్ అకౌంట్లలో...

కండోమ్స్ ఎక్కువగా వాడేది వారేనా..మోడీకి కౌంటర్

లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని మోడీ ప్రసంగం ఆశ్చర్యపరుస్తోంది. గతానికి భిన్నంగా మాట్లాడుతుండటమే ఇందుకు కారణం.గాంధీ కుటుంబంపై మాత్రమే విమర్శలు చేసే మోడీ గత కొద్ది రోజులుగా రూట్ మార్చారు. కాంగ్రెస్ అకారంలోకి...

ఔను..బీజేపీతో ఒప్పందం ఉందంటోన్న కేటీఆర్..!?

బీజేపీ - బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తోన్న వేళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తాము బీజేపీతో కలిసే ఉన్నామనే పరోక్షంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close