అసెంబ్లీ హైలెట్ : మరో నలుగుర్ని సస్పెండ్ చేసి సభ నడిపిన సర్కార్..!

అసెంబ్లీ నుంచి మరో నలుగురు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల్నీ సస్పెండ్ చేసి.. గురువారం సభ నడిపించారు. గోదావరి జలాల వినియోగంపై.. అసెంబ్లీలో జరిగిన చర్చలో సభను అడ్డుకున్నారంటూ… ఎమ్మెల్యేలు బెందాళం అశోక్, అశోక్‌, వాసుపల్లి గణేష్‌కుమార్‌, వెలగపూడి రామకృష్ణ, డోలా బాలవీరాంజనేయస్వామిలను ఒక్కరోజు పాటు సభ నుంచి సస్పెన్షన్‌ వేటు వేశారు. వీరు బయటకు వెళ్లడానికి నిరాకరించడంతో… మార్షల్‌ ద్వారా బయటకు తీసుకెళ్లారు. తెలంగాణలో గోదావరి జలాల ఒప్పందం విషయంలో… ప్రభుత్వం ఏపీ ప్రయోజనాలను పణంగా పెడుతోందని.. టీడీపీ నేతలు విమర్శలు గుప్పించారు. ఈ సందర్బంగా సీఎం జగన్మోహన్ రెడ్డి… కరువుతో జిల్లాలు అల్లాడుతుంటే.. రాజకీయాలే కావాలి అన్నట్లుంది టీడీపీ తీరని మండిపడ్డారు. సభలో టీడీపీ సభ్యుల ప్రవర్తన చూస్తుంటే.. మనుషులు అనాలా..రాక్షసులు అనాలా అర్ధంకావడం లేదని వ్యాఖ్యానించారు. దీనిపై టీడీపీ సభ్యులు భగ్గుమన్నారు. తమకు మాట్లాడే అవకాశం కల్పించాలని పట్టుబట్టారు. కానీ స్పీకర్ అంగీకరించలేదు.

గోదావరి జలాల వినియోగంపై జరిగిన చర్చలో.. జగన్… ఎగువ రాష్ట్రంతో సఖ్యతగా ఉంటే.. కిందకు నీళ్లొస్తాయని మరోసారి తన అభిప్రాయాన్ని నొక్కి చెప్పారు. కేవలం 12 శాతం గోదావరి నీళ్లు మాత్రమే ఏపీలోకి వస్తున్నాయని జగన్ చెప్పుకొచ్చారు. కేవలం ఐదు టీఎంసీలు మాత్రమే మన ఆధీనంలోఉంటాయన్నారు. అక్కడ కేసీఆర్‌ కాళేశ్వరం ప్రారంభించి పూర్తి చేశారని … ఇక్కడ చంద్రబాబు ఏం చేయగలిగారని ప్రశ్నించారు. గుట్టల మధ్య డ్యాములు కట్టే కాలం పోయిందన్న జగన్ ప్రస్తుతం ఎక్కడికక్కడ బ్యారేజీలు కడుతున్నారని గుర్తు చేస్తున్నారు. కాళేశ్వరం దిగువన 17 బ్యారేజీలు కట్టేశారని గుర్తు చేశారు.

తెలంగాణ ప్రభుత్వంతో సఖ్యత అవసరమని… తెలుగు వాళ్లమంతా ఒకటిగా ఉండాలి.. కేసీఆర్‌ మంచి వాడని జగన్ అసెంబ్లీ వేదికగా సర్టిఫికెట్ ఇచ్చారు. కేసీఆర్‌ సహకారంపై హర్షించాల్సిందిపోయి దాన్ని కూడా వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. మనది దిగువ రాష్ట్రం..ఎగువ రాష్ట్రం వదిలితేనే మనకు నీళ్లు వస్తాయన్నారు. ఇప్పటికే కృష్ణా జలాల విషయంలో ఏం జరుగుతోందో చూస్తూనే ఉన్నామని.. ఐదేళ్ల తర్వాత మన పరిస్థితి దారుణంగా ఉంటుందని భవిష్యత్ చెప్పారు. సాగర్‌, శ్రీశైలం రిజర్వాయర్లు రెండు రాష్ట్రాల ఉమ్మడి ఆస్తి అని..కలిసి కట్టుగా అడుగులు వేస్తే ఇరు రాష్ట్రాలకు ప్రయోజనం ఉంటుందన్నారు. చంద్రబాబుకు బుద్ది జ్ఞానం లేదని మండిపడ్డారు. జగన్ చేసిన వ్యాఖ్యలపై స్పందించేందుకు టీడీపీ సభ్యులకు స్పీకర్ అవకాశం ఇవ్వకపోవడంతో.. వారు వాకౌట్ చేశారు. తర్వాత వైసీపీ సభ్యులు… జగన్ జల విధానంపై.. సీఎంను ప్రశంసలతో ముంచెత్తారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మాఫియాను అంతం చేసేందుకే కూటమి : అమిత్ షా

ఆంధ్రప్రదేశ్ భూ మాఫియాను అంతం చేసి అమరావతిని రాజధానిగా చేసేందుకు కూటమిగా ఏర్పడ్డమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ధర్మవరంలో ఎన్నికల ప్రచారసభకు హాజరయ్యారు. చంద్రబాబు కూడా అమిత్ షాతో...

విష ప్ర‌చారాన్ని తిప్పి కొట్టిన ‘గెట‌ప్’ శ్రీ‌ను!

'జ‌బ‌ర్‌ద‌స్త్' బ్యాచ్‌లో చాలామంది ఇప్పుడు పిఠాపురంలోనే ఉన్నారు. జ‌న‌సేనానికీ, కూట‌మికి మ‌ద్ద‌తుగా ప్ర‌చారం చేస్తున్నారు. జ‌బ‌ర్‌ద‌స్త్ బ్యాచ్ ఇలా స్వ‌చ్ఛందంగా ప్ర‌చారానికి దిగ‌డం.. వైకాపా వ‌ర్గానికి న‌చ్చ‌డం లేదు. దాంతో వాళ్ల‌పై ర‌క‌ర‌కాల...

ఏడు మండలాలు కాదు. ఐదు గ్రామాలే అంటున్న కాంగ్రెస్ !

కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోల ఐదు గ్రామాల ప్రస్తావన తీసుకు వచ్చింది. ఏపీలోని ఐదు గ్రామాలను తెలంగాణలో కలుపుతామని ప్రకటించింది. దీంతో కొత్త వివాదం ప్రారంభమయింది. ఇది ఓ రకంగా గట్టు తగాదా...

నిరాసక్తంగా జగన్ ప్రచారం – ఆశలు వదిలేసుకున్నట్లే !

ఏపీ సీఎం జగన్ ప్రచారానికి కూడా పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. రెండు, మూడు రోజులకో సారి తాడేపల్లి ప్యాలెస్ కు పరిమితమవుతున్నారు. ప్రచార సభల్ని పరిమితం చేసుకుంటున్నారు. ఎన్నికల షెడ్యూల్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close