అద్దేపల్లి శ్రీధర్ బాధంతా నాదెండ్ల మనోహర్ కి ప్రాధాన్యతనివ్వడం గురించేనా?

జనసేన మాజీ అధికార ప్రతినిధి అద్దేపల్లి శ్రీధర్ పార్టీ వీడటానికి కారణం పవన్కళ్యాణ్ నాదెండ్ల మనోహర్ కి ప్రాముఖ్యత ఇవ్వడమేనా? తాజాగా అద్దేపల్లి శ్రీధర్ చేస్తున్న ట్వీట్లను చూస్తుంటే ఇదే సందేహం కలుగుతోంది.

గతంలో జనసేన అధికార ప్రతినిధిగా వ్యవహరించిన అద్దేపల్లి శ్రీధర్ కు ఆ పార్టీలో చాలా మంది అభిమానులు ఉన్నారు. ఆయన విషయ పరిజ్ఞానం గురించి మాత్రమే కాకుండా, తమ అభిమాన నాయకుడైన పవన్ కళ్యాణ్ ని ఆయన వివిధ వేదికల మీద డిఫెండ్ చేస్తూ మాట్లాడటం జనసేన అభిమానులకి ఆయన మీద ప్రత్యేక అభిమానం కలిగేలా చేసింది. అయితే ఎన్నికల తర్వాత ఫలితాల కంటే ముందే ఆయన జనసేన పార్టీకి రాజీనామా చేసారు. ఆయన రాజీనామాకు కారణం ఏంటనేది ఆయన చెప్పకపోవడంతో ఎవరికి తోచిన ఊహాగానాలు వారు చేసుకున్నారు. ఇక పార్టీ వీడిన తర్వాత కొంతకాలం వరకూ సైలెంట్ గా ఉన్న అద్దేపల్లి శ్రీధర్, ఇటీవల జనసేన ను టార్గెట్ చేస్తూ ట్వీట్స్ చేయడం ప్రారంభించారు. ఆ మధ్య పవన్ కళ్యాణ్ నాదెండ్ల మనోహర్ కలిసి చిరంజీవిని కలిసిన సందర్భంగా తీసుకున్న ఫోటోపై కామెంట్ చేస్తూ కేవలం నాదెండ్ల మనోహర్ ను మాత్రమే పవన్ కళ్యాణ్ తీసుకెళ్లడంలో ఆంతర్యమేమిటని అర్థం వచ్చేలా ట్వీట్ చేశారు. అదే విధంగా పవన్ కళ్యాణ్ నాదెండ్ల మనోహర్ ఇద్దరు కలిసి గవర్నర్ను కలిసిన సందర్భంగా తీసుకున్న ఫోటోపై కూడా ఇదే తరహా కామెంట్ చేశారు. పార్టీలోని మిగితా అందర్నీ వదిలేసి కేవలం నాదెండ్ల మనోహర్ ని గవర్నర్ వద్దకు తీసుకు వెళ్ళడంలో పవన్ కళ్యాణ్ ఉద్దేశ్యం ఏమిటి అని ప్రశ్నిస్తూ ఆయన ట్వీట్ చేశారు.

మొత్తానికి మొదటి నుండి పవన్ కళ్యాణ్ కి చేదోడు వాదోడు గా ఉన్న అద్దేపల్లి శ్రీధర్, ఆ తర్వాత పార్టీలో చేరిన నాదెండ్ల మనోహర్ కి పవన్ కళ్యాణ్ అధిక ప్రాధాన్యతనివ్వడం జీర్ణించుకోలేకపోయారని ఆయన చేస్తున్న ట్వీట్లను చూస్తే అర్థమవుతోంది. అదేవిధంగా పార్టీకి ఏడాదిపాటు పని చేసినా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదన్నది కూడా జనసేన పార్టీని వీడడానికి కారణం అయి ఉండవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close