జగన్ పరిపాలన రాయపాటికి భలే నచ్చేసింది..!

మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు.. బీజేపీతో బేరం కుదిరినట్లుగా లేదు. ఆయన ఇప్పుడు వైసీపీపై దృష్టి సారించారు. జగన్మోహన్ రెడ్డి పాలన అత్యంత ఘోరంగా ఉందని.. తెలుగుదేశం పార్టీ.. రెండు నెలల్లోనే ప్రజాపోరాటాలకు శ్రీకారం చుట్టిన సమయంలోనే.. ఆయన వైఎస్ జగన్ పాలన బాగుందని.. సర్టిఫికెట్ జారీ చేశారు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జగన్ ను సమర్థించడానికి… రాయపాటి.. కేంద్రంపై కూడా విమర్శలు చేశారు. జగన్ మంచిగా పరిపాలిస్తున్నా.. కేంద్రం నుంచి మాత్రం సహకారం అందడం లేదని చెప్పుకొచ్చారు. తాను ఏ పార్టీలో చేరుతాననేది త్వరలో ప్రకటిస్తానన్నారు. అంటే.. ఆయన తెలుగుదేశం పార్టీకి దూరం కావాలని దాదాపుగా నిర్ణయించుకున్నారని అర్థం చేసుకోవచ్చు.

గతంలో… రామ్ మాధవ్ ఇంటికి వచ్చి మరీ పిలవడంతో… బీజేపీలో చేరేందుకు ఆయన రెడీ అయిపోయారు. కానీ.. ఆయన ఆశించిన ఆర్థిక ప్రయోజనాల విషయంలో మాత్రం.. బీజేపీ నుంచి.. పెద్దగా స్పందన రాలేదన్న ప్రచారం జరుగుతోంది. పైగా… తాను ఒక్కడ్నే బీజేపీలో చేరుతానని..కుటుంబసభ్యులంతా.. రాజకీయ భవిష్యత్ ఉండే పార్టీలో చేరుతారన్నట్లుగా.. ఆయన మాట్లాడటంతో.. బీజేపీ నేతలు రాయపాటిని లైట్ తీసుకున్నారు. అదే సమయంలో.. ఆయన రాజకీయ శత్రువు కన్నా… ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన వైపు నుంచీ అడ్డంకులు ఎదురయినట్లుగా తెలుస్తోంది. దీంతో.. ఇప్పటికిప్పుడు.. తన సమస్యలకు బెయిలవుట్ ప్యాకేజీ ఇచ్చే పార్టీ కోసం.. రాయపాటి ఎదురు చూస్తున్నట్లుగా కనిపిస్తోంది.

పోలవరం ప్రాజెక్ట్ టెండర్లు రద్దు చేయాలని… ఏపీ సర్కార్ నిర్ణయించిన నేపధ్యంలో… రాయపాటి వ్యాఖ్యలు ఆసక్తి కలిగించేవే. ఆయన వైసీపీ వైపే మొగ్గుచూపుతున్నారని..తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి. అయితే.. టీడీపీ నేతలు మాత్రం.. ఆయనను సీరియస్‌గా తీసుకోవాల్సిన పని లేదంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎన్నికల్లో ప్రజలకు పరీక్ష పెడుతోన్న జగన్ రెడ్డి..!?

ఈ ఎన్నికల్లో ఏపీ ప్రజలను జగన్ రెడ్డి పరిక్షీస్తున్నట్టు ఉంది. సొంత చెల్లి మీడియా ముంగిటకు వచ్చి జగన్ నిజస్వరూపం బయటపెడుతున్నా నిజాన్ని నిందగా చిత్రీకరించుకుంటూ జనం మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తుండటం...

జగన్ మానసిక స్థితిపై డౌట్ గా ఉంది : షర్మిల

జగన్ మానసిక పరిస్థితిపై తేడాగా ఉందని బ్యాలెన్స్ తప్పిందేమోనని డౌట్ గా ఉందని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. కడపలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ కు ఓ...

ఖమ్మంలో నామా వైపు టీడీపీ సానుభూతిపరులు !

పరిస్థితి క్లిష్టంగానే ఉన్నా ఖమ్మంలో నామా నాగేశ్వరరావు ధైర్యంగా పోరాడుతున్నారు. బీజేపీ తరపున సరైన అభ్యర్థి లేకపోవడం ఎవరికీ తెలియని వినోద్ రావు అనే వ్యక్తిని బీజేపీ నిలబెట్టింది. బీజేపీకి ఉన్న...

రోహిత్ శ‌ర్మ ఫీల్డ్ లో ఉండ‌డం కూడా ఇష్టం లేదా పాండ్యా…?!

ఈ ఐపీఎల్ లో ముంబై ఆట ముగిసింది. ప్లే ఆఫ్ రేసు నుంచి ఈ జ‌ట్టు దూర‌మైంది. ఐదుసార్లు ఐపీఎల్ విజేత‌గా నిలిచిన ముంబై ఈసారి క‌నీసం ప్లే ఆఫ్‌కు కూడా అర్హ‌త...

HOT NEWS

css.php
[X] Close
[X] Close