టీటీడీలో చిచ్చుపెడుతున్న వైవీ మార్క్ పాలన ..!

అవినీతిని కడిగేస్తామంటూ.. వైసీపీ నేతలు చేస్తున్న హడావుడి… ఇతరులకు ఇబ్బందికరంగా మారింది. ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా ఉన్న ప్రవీణ్ ప్రకాష్ పై తాజాగా.. టీటీడీ చైర్మన్ బురద చల్లినంత పని చేశారు. ఓ సీనియర్ ఐఎఎస్ అధికారిపై.. ఎస్‌ఐ స్థాయి అధికారిని విచారణకు పంపించింది. ఇది తీవ్ర విమర్శలకు కారణం అవుతోంది. ఢిల్లీలో టీటీడీకి ఆలయం ఉంది. ఆ ఆలయానికి సంబంధించిన వ్యవహారాల కోసం.. ఢిల్లీలో. .. టీటీడీ లోకల్ ఎడ్వయిజరీ కమిటీని నియమించింది. ఈ కమిటీకి చైర్మన్ గా .. ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ ఉంటారు. ఈ కమిటీ రూ. నాలుగైదు కోట్లు .. గోల్ మాల్ చేసిందనే ఆరోపణలను ఆకాశరామన్న పేరుతో కొంత మంది టీటీడీకి లేఖల ద్వారా ఫిర్యాదు చేశారు.

గతంలోనూ ఈ ఆరోపణలు వచ్చాయి. ఈ ఫిర్యాదుల పైన విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ దర్యాప్తు జరిపింది. నిబంధనలకు వ్యతిరేకంగా శ్రీవారి బ్రహ్మోత్సవాల పేరుతో చందాలు స్వీకరించారని .. రోజువారీ పూజలకు అవసరమైన పూలు, ఇతర వస్తువుల సరఫరా కాంట్రాక్టర్ల నుంచి అధికారులకు ముడుపులు తీసుకుని ఆకాశరామన్న పేరుతో టీటీడీకి కొంత మంది వ్యక్తులు ఫిర్యాదులు చేశారు. ప్రత్యేక పూజలు, పర్వదినాల్లో చేపట్టే కార్యక్రమాల్లోనూ అక్రమాలు చోటు చేసుకున్నాయని లేఖలు రాశారు. ఈ లేఖలపై.. గత ప్రభుత్వ హయాంలోనే విచారణ జరిగింది. కానీ ఏమీ తేలకపోవడంతో.. అది ఆగిపోయింది.

టీటీడీకి కొత్త చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి వచ్చారు. ఆ పాత ఫిర్యాదును బయటకు తీసి… కొత్తగా విచారణ చేయమని.. ఓ ఎస్ఐ స్థాయి అధికారిని ఢిల్లీకి పంపారు. దీంతోనే వివాదం ప్రారంభమయింది. ఏపీ భవన్‌ను.. టీటీడీ తీవ్రంగా అవమానిస్తోందని రెసిడెంట్ కమిషనర్… భావించారు. ఏపీ భవన్ సిబ్బంది కూడా.. రికార్డుల తనిఖీకి పెద్దగా సహకరించలేదుని చెబుతున్నారు. చివరికి లోకల్ ఎడ్వయిజరీ కమిటీ చైర్మన్ పదవికి ప్రవీణ్ ప్రకాష్ రాజీనామా చేశారు.. టీటీడీ వైఖరి ఏపీ భవన్‌ విలువ తగ్గించేలా ఉందని మండిపడ్డారు. టీటీడీ వైఖరిని నిరసించారు. ఈ వ్యవహారం ఢిల్లీ అధికారవర్గాల్లో కలకలం రేపుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close