హ‌రీష్ రావుని ఇప్పుడు కేబినెట్లోకి తీసుకుంటున్నారా..?

తెలంగాణ కేబినెట్ విస్త‌ర‌ణ ఉంటాయ‌న్న సంకేతాలు బ‌ల‌ప‌డుతున్నాయి. మ‌రోసారి మంత్రిగా కేటీఆర్ ని చూడాల‌నుంద‌ని తెరాస నేత‌లు ఈ మ‌ధ్య వ్యాఖ్యానిస్తున్న సంగ‌తి తెలిసిందే. దీంతోపాటు, ఇప్పుడు ప్ర‌గ‌తి భ‌వ‌న్ వ‌ర్గాల నుంచి కూడా మంత్రి మండ‌లి విస్త‌ర‌ణ‌పై కొన్ని సంకేతాలు వ‌స్తున్నాయి. విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం… ఇక్క‌ణ్నుంచి రెండు ద‌శ‌ల్లో విస్త‌ర‌ణ ఉండే అవ‌కాశం ఉంది. సెప్టెంబ‌ర్ నెల‌లో కొంత‌మందిని కేబినెట్ లోకి తీసుకుని, ఆ త‌రువాత వ‌చ్చే ఏడాది జ‌న‌వరిలో మ‌రికొంత‌మందికి ముఖ్యమంత్రి కేసీఆర్ అవ‌కాశం ఇస్తారని తెలుస్తోంది. ఈ రెండు ద‌శ‌ల్లోనూ ప్ర‌స్తుతం మంత్రులుగా ఉన్న కొందరి బెర్తులు మార్పులు చేర్చుల‌కు అవ‌కాశం ఉంద‌ని కూడా స‌మాచారం!

పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంత్రి కావ‌డం ఖాయం అనేది ప్ర‌త్యేకంగా చెప్పుకోవాల్సిన ప‌నిలేదు. అయితే, ఆయ‌న‌తోపాటు గ‌తంలో మంత్రిగా కీల‌క బాధ్య‌త వ‌హించిన హ‌రీష్ రావు సంగ‌తి ఏంట‌నేది ఇప్పుడు తెరాస వ‌ర్గాల్లో ఇంకోసారి చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న చ‌ర్చ ప్ర‌కారం… సెప్టెంబ‌ర్ లో ఉండే విస్త‌ర‌ణ‌లో హ‌రీష్ కి చోటు ద‌క్కే అవ‌కాశాలు చాలా త‌క్కువ‌గానే ఉన్నాయ‌నీ, సంక్రాంతి స‌మ‌యంలో జ‌రిగే విస్త‌ర‌ణ‌లో ఆయ‌న‌కి ఛాన్స్ ఇస్తార‌నే క‌థ‌నాలు వినిపిస్తున్నాయి!! కేటీఆర్ తోపాటు గుత్తా సుఖేంద‌ర్ రెడ్డికి అవ‌కాశం ఉంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. కేబినెట్లో మ‌హిళ‌లు లేరు అనే విమ‌ర్శ‌లు ఎప్ప‌ట్నుంచో ఉన్నాయి కాబ‌ట్టి స‌బితా ఇంద్రారెడ్డికి ఇప్పుడు అవ‌కాశం ఉంద‌నీ అంటున్నారు.

నిజానికి, రెండోసారి తెరాస‌ అధికారంలోకి వ‌చ్చాక‌… హ‌రీష్ రావుకి ప్రాధాన్య‌త త‌గ్గిస్తూ వ‌స్తున్నార‌న్న‌ది వాస్త‌వం. నెమ్మ‌దిగా ఆయ‌న సిద్ధిపేట‌కు ప‌రిమితం అవుతున్న‌ట్టుగానే క‌నిపిస్తున్నారు. అయితే, త‌న పుట్ట‌కా చావూ తెరాస‌లోనే అని హ‌రీష్ రావు గ‌తంలో చెప్పారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ తో ఆయ‌న‌కి ఎలాంటి విభేదాలు లేవ‌ని ఎప్ప‌టిక‌ప్పుడు తెర‌మీదికి వ‌చ్చే చ‌ర్చ‌ల్ని ఖండిస్తూనే ఉన్నారు. మ‌రి, ఇప్పుడు కేబినెట్ లో చోటు ద‌క్క‌క‌పోతే… దానిపై ఎలా రియ‌క్ట్ అవుతారో చూడాలి. కేబినెట్ లో హ‌రీష్ కి చోటు ద‌క్కాలంటే జ‌న‌వ‌రి దాకా ఆగాల్సిందే అని తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

పదేళ్ల తర్వాత ఓయూపై స్పందించిన కేసీఆర్

తెలంగాణ ఉద్యమ సమయంలో నిత్యం ఓయూను పలవరించిన కేసీఆర్.. గద్దెనెక్కాక ఒక్కసారి కూడా ఓయూను సందర్శించలేదు. విద్యార్థులు రోడ్డెక్కి ప్రొఫెసర్లను నియమించాలని,స్కాలర్ షిప్స్ పెంచాలని, వసతి గృహాల్లో నాణ్యమైన ఆహారం అందించాలని డిమాండ్...

నోరు జారిన ర‌చ‌యిత‌.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్

తోట‌ప‌ల్లి మ‌ధు... ఈ త‌రానికి పెద్ద‌గా ఈ ర‌చ‌యిత పేరు తెలియ‌క‌పోవొచ్చు కానీ, 90ల్లో వ‌చ్చిన కొన్ని సినిమాల‌కు ఆయ‌న మాట‌లు అందించారు. కొన్ని పెద్ద హిట్లు కొట్టారు. న‌టుడిగానూ త‌న‌దైన ముద్ర...

బడా భాయ్ కి కోపమొచ్చింది… ఛోటా భాయ్ కి సమన్లు వచ్చాయి..!!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మోడీని బడా భాయి అని పిలిచినా,సరదాగా ఆహ్వానించినా రాజకీయాల్లో తమ్ముడు.. తమ్ముడే.. పేకాట.. పేకాటే అని నిరూపిస్తున్నారు బీజేపీ నేతలు. బడా భాయి అని మోడీని ఉద్దేశించి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close