అమరావతిపై కీలక ప్రకటనకు సర్కార్ రెడీ..!?

సీఆర్డీఏ అధికారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజధాని అంశంపై సమీక్షించబోతున్నారు. ఇప్పటికే రాజధానిపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన మంత్రివర్గం ఉపసంఘం అధికారులతో వివరాలను అడిగి తెలుసుకుంది. భూముల కేటాయింపు, టెండర్లు వంటి అంశాల్లో అవకతవకలు జరిగాయని, ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందని వైసీపీ ప్రభుత్వం అనుమానిస్తోంది. వీటి వివరాలను కావాలని ఇప్పటికే ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఆయన ఇటీవల ఢిల్లీ వెళ్లిన సమయంలో కూడా ప్రధానమంత్రి నరేంద్రమోడీకి ఏపీ రాజధానిపై ప్రాథమిక నివేదికను అందజేశారు.

రాజధానిపై సీఎం జరపనున్న సమీక్షా సమావేశంలో రాజధానిగా అమరావతి కొనసాగింపుపై ఓ ప్రకటన వస్తుందని ఆశిస్తున్నారు. అయితే అటువంటి అవకాశాల్లేవని మరికొందరు చెప్తున్నారు. కేవలం రాజధాని పనులపై సమీక్షించటం కోసమే ఈ సమావేశం ఏర్పాటు చేశారని, అధికారుల కమిటీతోపాటు కేబినెట్ సబ్ కమిటీ నుంచి కూడా ఒక నివేదికను తీసుకుంటారని భావిస్తున్నారు. ఇన్ సైడర్ ట్రేడింగ్, అవకతవకలపై త్వరలోనే అన్ని వివరాలను బయటపెడతామని మంత్రి బొత్స సత్యనారాయణ మంగళవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.

రాజధానిపై ఆందోళన జరుగుతున్న సమయంలో గురువారం నాటి సమీక్ష అనంతరం రాజధానిలో నిధుల దుర్వినియోగం, ఇన్ సైడ్ ట్రేడింగ్ కు సంబంధించిన కొన్ని వివరాలను కూడా బయటపెట్టే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతోంది. బొత్స సత్యనారాయణ వ్యాఖ్యల తర్వాత ప్రభుత్వం ఏం చేసినా చర్చనీయాంశంగా మారుతోంది. అందరూ సీఎం జగన్మోహన్ రెడ్డిని స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో..సీఆర్డీఏ మీటింగ్‌తో.. ఓ క్లారిటీ వస్తుందని అంచనా వేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close