అమరావతిలో శ్రీవారి ఆలయ నిర్మాణాన్ని నిలిపివేసిన టీటీడీ చైర్మన్..!

రాజధాని విషయంలో ఏపీ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలన్నీ వివాదాస్పదంగా మారుతున్నాయి. రాజధానిలో పర్యటిస్తున్న నేతలందరూ.. అన్ని నిర్మాణాలతో పాటు… టీటీడీ తరపున నిర్మిస్తున్న ఆలయాన్ని కూడా చూసి వస్తున్నాయి. అయితే.. అక్కడ కూడా పనులు ఆగిపోవడాన్ని చూసి.. అది మంచిది కాదని చెబుతూ వస్తున్నారు. శ్రీవారి ఆలయ నిర్మాణాన్ని కూడా నిలిపి వేశారని… అది రాష్ట్రానికి మంచిది కాదని..సుజనా చౌదరి నేరుగానే హెచ్చరించారు. ఈ క్రమంలో నిజంగానే.. ఆలయ నిర్మాణాన్ని నిలిపివేయాలని టీటీడీ చైర్మన్ కాంట్రాక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు బయటకు వచ్చింది. వెంకటాయపాలెం గ్రామంలో రూ. 140 కోట్ల రూపాయలతో, 25 ఎకరాల్లో నిర్మిస్తున్న ఆలయం ఇప్పుడు ఆగిపోయింది.

2019 ఫిబ్రవరి 1వ తేదీ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భూకర్ష , భీజవాపనం పూజలకు హాజరయ్యారు. తిరుమల నుంచి సుమారు వంద మంది ఆగమ పండితులు వారం రోజులు అక్కడే ఉండి భూకర్ష పూజలను ఆగమోక్తంగా నిర్వహించారు. ఆలయంలోనే వెయ్యి కాళ్ల మండపం అంతా శిలాలయంగా శిల్పాశాస్త్ర వేత్తలు ప్లాన్ చేశారు. స్వామి వారి వాహనసేవ జరిగితే… వైభవంగా ఉండేలా ఆలయ మాడవీధులు ఉండేలా ప్లాన్ చేశారు. ఆలయం వెలుపల అన్నప్రసాద భవనం, అతిథి గృహాలు ప్లాన్ చేశారు. ఈ మొత్తాన్ని రెండేళ్లలో పూర్తి చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత పనులను పరిశీలించిన ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి మౌఖికంగా పనులు ఆపేయమని ఆదేశించారు.

పూర్తిగా ఆపేస్తే.. భక్తుల నుంచి విమర్శళు వస్తాయన్న ఉద్దేశంతో… ఏదో చిన్నది కడదామన్నట్లుగా టీటీడీ చైర్మన్ వైఖరి ఉంది. ఇతర రాష్ట్రాల్లో కట్టే చిన్నపాటి ఆలయాల తరహాలో కట్టాలనే ఆలోచనలో ఉన్నారు. రూ. 36 కోట్లకే మొత్తం ఆలయం పూర్తి అయ్యేలా ప్లాన్ చేయాలని చైర్మన్ సూచించినట్లుగా ప్రచారం జరుగుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=Eou1oqvFa9COa1uy విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

43వేల కోట్లతో రోడ్లేశాం కానీ వర్షాలకు కొట్టుకుపోయాయి : జగన్

జగన్మోహన్ రెడ్డి నోటికొచ్చింది చెప్పరు.. రాసుకొచ్చిందే చెబుతారు. రాసిచ్చే వారు ఏమి రాసిచ్చారో.. ఆయన ఏమి చదివారో కానీ.. మేనిఫెస్టోను రిలీజ్ చేసేటప్పుడు రోడ్ల ప్రస్తావన తెచ్చారు. టీడీపీ హయాం కన్నా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close