ఆ పదవుల కోసం జగన్‌పై తీవ్ర ఒత్తిడి..!

” మంత్రిమండలి కూర్పులో కూడా ఇబ్బంది ఎదురుకాలేదు. కానీ టీటీడీ బోర్డు సభ్యుల ఎంపికలో మాత్రం.. ఒత్తిళ్లు తట్టుకోలేనంతగా వస్తున్నాయని”.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి .. కేబినెట్ సమావేశంలో..వ్యాఖ్యానించారు. వివిధ వర్గాల నుంచి వస్తున్న ఒత్తిడిని తట్టుకోలేక సభ్యుల సంఖ్యను అమాంతం.. 25కి పెంచడానికి కేబినెట్‌లో తీర్మానం చేయాల్సి వచ్చిందని… జగన్మోహన్ రెడ్డి చెప్పకనే చెప్పారు. అయితే.. ఈ పదవుల కోసం… జగన్ పై అంత తీవ్రంగా ఒత్తిడి చేసిందెవరన్నదానిపై… ఆసక్తికర చర్చ.. వైసీపీ వర్గాల్లో ప్రారంభమయింది.

వైఎస్ జగన్మోహన్ రెడ్డి… అన్నీ ఫటా ఫట్ నిర్ణయాలు తీసుకుంటారు. అందర్నీ సంతృప్తి పరచాలని.. బుజ్జగించాలని అనుకోరు. అలా చేస్తే.. వారు మరింత బెట్టు చేసే అవకాశం ఉందని.. వైఎస్ జగన్ కు బాగా తెలుసు. అందుకే.. ఎవరెవరికి పదవలు ఇవ్వాలో.. ఎవరెవరికి టిక్కెట్లు ఇవ్వాలో.. ఆయన ఓ అవగాహనకు వచ్చిన తర్వాత .. ఎవరి అభిప్రాయం తీసుకోరు. అనుకున్నది అనుకున్నట్లుగా పదవులు ఇచ్చేస్తారు. మంత్రి పదవుల విషయంలో… ఆయన అనేక సీనియర్లను అసువుగా పక్కన పెట్టేసిన విషయం ఇంకా ఎవరూ మర్చిపోలేదు. అయితే.. జగన్మోహన్ రెడ్డి మాత్రం.. ఏ నిర్ణయం తీసుకోలేక.. తీవ్ర ఒత్తిడికి గురవుతుంది మాత్రం… శ్రీవారి సేవకుల నియామకం విషయంలోనే.

నిజానికి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో… పదవులు దక్కని ఎమ్మెల్యేలకు ఎక్కువగా అవకాశం కల్పిస్తూంటారు. కానీ.. శ్రీవారికి సేవ చేయవచ్చన్న సంకల్పమో.. మరో కారణమో కానీ… పారిశ్రామిక వర్గాల నుంచి కూడా.. పెద్ద ఎత్తున ప్రభుత్వంపై ఒత్తిళ్లు వస్తున్నాయి. స్వయంగా పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తలు… ఇతురల కోసం సిఫార్సు చేయడం కాకుండా.. తమకే చోటివ్వాలని ప్రభుత్వ పెద్దలపై ఒత్తిడి తెస్తున్నారు. తెలంగాణ నుంచి మైహోమ్ రామేశ్వరరావు, ఇండియా సిమెంట్స్ శ్రీనివాసన్ లాంటి వాళ్లు కూడా.. ఈ జాబితాలో ఉన్నారంటే… జగన్ పై ఏ స్థాయి ఒత్తిళ్లు వస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close