సీఎంల టూర్లకు ముందే క్లారిటీ..! “ఉమ్మడి ప్రాజెక్ట్” కు బీజేపీ వ్యతిరేకం..!

ఉమ్మడి ప్రాజెక్ట్ విషయంలో ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులకు భారతీయ జనతా పార్టీ రెడ్ కార్డ్ చూపించడం ఖాయంగా కనిపిస్తోంది. గోదావరి – కృష్ణా అనుసంధానం కోసం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు… ప్రధానమంత్రి నరేంద్రమోదీని విడివిడిగా..రెండు రోజుల వ్యవధిలో కలుస్తారని ప్రచారం జరుగుతున్న సమయంలో.. ఆ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా బీజేపీ నేతలు గళమెత్తారు. కొంత మంది నేతల్ని.. బీజేపీలో చేర్పించేందుకు ఢిల్లీ తీసుకెళ్లిన ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్… కేసీఆర్, జగన్ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. ఏపీ, తెలంగాణ కలిసి ఉమ్మడి ప్రాజెక్టులు ఎలా కడతాయని ప్రశ్నించారు. లక్ష కోట్ల ప్రాజెక్టు పేరుతో కాంట్రాక్టులు, కమీషన్లు దండుకోవాలనుకుంటున్నారని మండిపడ్డారు.

తెలంగాణ నీటిని ఏపీ దోపిడీ చేసిందని ఆరోపించిన కేసీఆర్‌ ఇపుడు జగన్‌తో కలిసి ప్రాజెక్టు ఎలా కడతారని లక్ష్మణ్ లాజిక్ తీస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ నీటిని దోపిడీ చేసిందని.. కేసీఆర్ ఉద్యమంలో చెప్పారని లక్ష్మణ్ గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు.. తెలంగాణ భూభాగం మీద నుంచి ఏపీకి నీటిని ఎలా తరలిస్తారని.. లక్ష్మణ్ సూటిగా ప్రశ్నించారు. రేపు మోదీతో భేటీలో ఏపీ తెలంగాణ ఉమ్మడి ప్రాజెక్టు అంశాన్నీ కేసీఆర్ ప్రస్తావించనున్నారు. ఆర్థికసాయాన్ని కోరనున్నారు. ఐదో తేదీన జగన్మోహన్ రెడ్డి కూడా.. మోదీతో భేటీ అయి..ఇదే అంశంపై సాయం చేయాలనే కోణంలో విజ్ఞప్తి చేయనున్నారు. అయితే అనూహ్యంగా.. బీజేపీ నేతల నుంచి… ఈ ప్రతిపాదనలకు..వ్యతిరేకత వస్తోంది. ఇది తెలుగు రాష్ట్రాల అధికార పార్టీల్లో చర్చనీయాంశం అవుతోంది.

గోదావరి నీటిని ..శ్రీశైలంకు తీసుకెళ్లేందుకు..తెలంగాణ భూభాగం మీద ప్రాజెక్ట్ కట్టే కసరత్తును..గత నాలుగు నెలలుగా.. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు చేస్తున్నారు. ఈ మేరకు కొన్ని ప్రతిపాదనలు కూడా రెడీ అయ్యాయి. అయితే..వారిని నిధుల సమస్య వెంటాడుతోంది. రెండు రాష్ట్రాలూ.. అప్పుల ఊబిలో ఉన్నాయి. కొత్తగా అప్పులు పుట్టే పరిస్థితి లేదు. అందుకే.. కేంద్ర సాయాన్ని కోరాలనుకుంటున్నారు. నదుల అనుసంధానం మీద కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టిందని ప్రచారం జరుగుతున్న సమయంలో తమ ప్రయత్నాలకు మద్దతు లభిస్తుందని.. తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులు అనుకున్నారు. కానీ… బీజేపీ వైపు నుంచి మాత్రం వ్యతిరేక స్పందన వస్తుంది. అధికారికంగా కూడా.. అలాంటి స్పందనే వస్తుందన్న అంచనాలు.. ఢిల్లీలో ఇప్పటికే వినిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నాగ‌శౌర్య‌కు ఏమైంది..?

టాలీవుడ్ లో హీరోలంతా య‌మా బిజీగా ఉన్న ద‌శ ఇది. చేతిలో ఒక‌టీ అరా విజ‌యాలు ఉన్న 'యావ‌రేజ్' హీరోలు సైతం.. త‌మ ఆధిప‌త్యం చూపిస్తున్నారు. చేతి నిండా సినిమాల‌తో హ‌డావుడి చేస్తున్నారు....

క‌ల్కి.. క‌మ‌ల్.. కంశుడు!

ప్ర‌భాస్ అభిమానులే కాదు, ఇండియ‌న్ సినిమా మొత్తం ఆశ‌గా ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్.. 'క‌ల్కి'. ప్ర‌భాస్ తో పాటు అమితాబ్ బ‌చ్చ‌న్‌, క‌మ‌ల్ హాస‌న్ లాంటి దిగ్గ‌జాలు ఈ సినిమాలో న‌టిస్తున్నారు. ప్ర‌భాస్‌,...

దర్శి రివ్యూ : హోరాహోరీ – కానీ బూచేపల్లికి ఎన్నో మైనస్‌లు !

మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ గెలిచిన రెండే మున్సిపాలిటీల్లో ఒకటి దర్శి. రెండోది తాడిపత్రి. తాడిపత్రిలోనూ కష్టం మీద గెలిచారు కానీ దర్శిలో మాత్రం టీడీపీ స్వీప్ చేసింది. నిజానికి అక్కడ నాయకుడు...

గత ఎన్నికలలో వైసీపీ కోసం ప్రచారం చేసిన వాళ్లేరి ?

అధికార అహంకారం జగన్మోహన్ రెడ్డిని అందరికీ దూరం చేసింది. తాను ఎవరి సాయంతో అధికారం అందుకున్నారో .. వాళ్లందర్నీ అవమానించి , వేధించడంతో దూరమయ్యారు. ఇప్పుడు ఎన్నికల ప్రచారానికి వైసీపీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close