జూపూడి ఫిరాయింపు టీడీపీలో అంత కలకలం రేపిందేమిటి..?

తెలుగుదేశం పార్టీకి జూపూడి ప్రభాకర్ రావు గుడ్ బై చెప్పారు. వెంటనే వైసీపీ కండువా కప్పుకున్నారు. మామూలుగా అయితే.. టీడీపీకి పెద్ద విషయం కాదు. కానీ ఆ పార్టీలో జూపూడి వ్యవహారం చాలా పెద్ద చర్చకు కారణం అవుతోంది. కింది స్థాయి నుంచి పై స్థాయి వరకూ… పార్టీలో .. జూపూడి వ్యవహారాన్ని ఓ గుణపాఠంగా పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్న అభిప్రాయం టీడీపీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. తెలుగుదేశం పార్టీని ఇటీవలి కాలంలో కొంత మంది నేతలు వీడారు. వారి పార్టీ వీడటానికి టీడీపీ కారణం కాదు. బయట విషయాలు ఎక్కువ కారణం. ఎవరు పోయినా.. జరగనంత చర్చ ఇప్పుడు టీడీపీలో జూపూడి వల్ల జరుగుతోంది.

జూపూడి జంపింగ్ టీడీపీలో చర్చ జరగడానికి ప్రధాన కారణం… ఆయనకు పార్టీలో దక్కిన ప్రాధాన్యం. నిజానికి జూపూడి ఎప్పుడూ.. టీడీపీ సానుభూతి పరుడు కాదు. వైఎస్ హయాంలో.. ఆయనతో సన్నిహితంగా ఉండి రాజకీయంగా ప్రాధాన్యత పొందారు. తర్వాత జగన్ తో అత్యంత సన్నిహితంగా మెలిగారు. కానీ… టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీలో చేరిపోయారు. అనూహ్యంగా టీడీపీ అగ్రనాయకత్వం ఆయనకు ప్రాధాన్యత ఇచ్చింది. ఆయన కూడా.. టీడీపీ హైకమాండ్ తనపై విశ్వాసముంచేలా… వైసీపీపై తీవ్రమైన విమర్శలు చేశారు. కొన్ని కీలకమైన పదవులు.. ప్రాధాన్యత లభించింది. కానీ అనూహ్యంగా జూపూడి .. టీడీపీ ఓడిపోగానే.. వైసీపీలో చేరిపోయారు.

పార్టీ కోసం కష్టపడిన వారిని పట్టించుకోకుండా.. ఇలా వలస వచ్చిన వారికి ప్రాధాన్యత ఇలాగే జరుగుతుందన్న విమర్శలు టీడీపీలో ఓ రేంజ్‌లో ఇప్పుడు ప్రారంభమయ్యాయి. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కోవర్టులుగా కొంత మంది పార్టీలోకి వచ్చారని టీడీపీ నేతలు ఇప్పుడు అనుమానిస్తున్నారు. అయితే.. పార్టీ అంతర్గత విషయాలు చాలా వరకూ బయటకు వెళ్లాయని… ఇలా వలస వచ్చిన వారే దానికి కారణమని ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు. పార్టీ అధినేత ఇక నుంచి అయినా.. పార్టీలో ఉన్న వారికి.., పార్టీలో కష్టడిన వారికి ప్రాధాన్యత ఇవ్వాలి కానీ.. బయట నుంచి వచ్చిన వారికి కాదంటున్నారు. ఈ విషయంలో టీడీపీ అధినేత కూడా ఇప్పుడు ఆలోచించక తప్పని పరిస్థితి ఏర్పడింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దానం ఓడిపోయేందుకే పోటీ చేస్తున్నారా..?

అనుభవజ్ఞుడు, సమర్ధుడని సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీ టికెట్ కట్టబెడితే దానం నాగేందర్ మాత్రం అందుకు విరుద్దంగా వ్యవహరిస్తున్నారు. ఆయన వైఖరితో కాంగ్రెస్ పెద్దలే విసుగు చెందగా గ్రేటర్ హైదరాబాద్ నేతలు కూడా దానంపై...

ఎన్నికల్లో ప్రజలకు పరీక్ష పెడుతోన్న జగన్ రెడ్డి..!?

ఈ ఎన్నికల్లో ఏపీ ప్రజలను జగన్ రెడ్డి పరిక్షీస్తున్నట్టు ఉంది. సొంత చెల్లి మీడియా ముంగిటకు వచ్చి జగన్ నిజస్వరూపం బయటపెడుతున్నా నిజాన్ని నిందగా చిత్రీకరించుకుంటూ జనం మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తుండటం...

జగన్ మానసిక స్థితిపై డౌట్ గా ఉంది : షర్మిల

జగన్ మానసిక పరిస్థితిపై తేడాగా ఉందని బ్యాలెన్స్ తప్పిందేమోనని డౌట్ గా ఉందని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. కడపలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ కు ఓ...

ఖమ్మంలో నామా వైపు టీడీపీ సానుభూతిపరులు !

పరిస్థితి క్లిష్టంగానే ఉన్నా ఖమ్మంలో నామా నాగేశ్వరరావు ధైర్యంగా పోరాడుతున్నారు. బీజేపీ తరపున సరైన అభ్యర్థి లేకపోవడం ఎవరికీ తెలియని వినోద్ రావు అనే వ్యక్తిని బీజేపీ నిలబెట్టింది. బీజేపీకి ఉన్న...

HOT NEWS

css.php
[X] Close
[X] Close