దగ్గుబాటి దంపతులు ఒకే పార్టీలో ఉండాలంటున్న వైసీపీ హైకమాండ్..!

వైసీపీలో దగ్గుబాటి వెంకటేశ్వరారవుకు పొగపెట్టడం ఊపందుకుంది. పర్చూరు నియోజకవర్గంలో రావి రామనాథంబాబు అనే నేతను వైసీపీలో చేర్చుకుని అన్ని పనులు ఆయనకే చేసి పెట్టమని స్పష్టమైన ఆదేశాలివ్వడంతో.. దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఆయన కుమారుడ్ని పట్టించుకునేవారు కరవయ్యారు. తమను ఎందుకు పక్కన పెట్టాలనుకుంటున్నారో… తెలుసుకునేందుకు.. దగ్గుబాటి కొద్ది రోజులుగా జగన్ అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నిస్తున్నారు. కానీ ఆయనకు సమయం దొరకడం లేదు. కనీసం.. పార్టీ వ్యవహారాలను చూస్తున్న విజయసాయిరెడ్డిని కలుసుకుని అయినా… ఏం జరుగుతుదో తెలుసుకుందామంటే.. దానికీ.. అవకాశం ఇవ్వడం లేదు. దాంతో దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు సీన్ అర్థమయిపోయిదనే ప్రచారం జరుగుతోంది. అయితే.. జగన్ తో భేటీ కావాలంటే.. ముందుగా ఓ అంశంపై క్లారిటీ ఇవ్వాలంటూ… దగ్గుబాటికి… సమాచారం పంపారు.

అదేమిటంటే… పురంధేశ్వరి వైసీపీలో వస్తారా..? మీరు బీజేపీలోకి వెళ్తారా..? అనేదానిపై క్లారిటీ అడిగినట్లుగా తెలుస్తోంది. ఇద్దరూ చెరో పార్టీలో ఉండటం వల్ల.. సమస్యలు వస్తున్నాయని… పురందేశ్వరి వైసీపీలోకి వస్తే.. ప్రాధాన్యం ఇస్తామని … లేకపోతే… పార్టీకి అవసరం లేదన్నట్లుగా.. సమాచారం పంపినట్లుగా తెలుస్తోంది. దీనిపై.. దగ్గుబాటి కుటుంబంలో చర్చ జరుగుతోంది. నిజానికి దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీలో చేరాలనుకోలేదు. ఆయన కుమారుడు హితేష్ చెంచురామ్ ను పార్టీలో చేర్చారు. కానీ ఆయనకు అమెరికా పౌరసత్వం ఉంది. నామినేషన్ల సమయానికి ఆ పౌరసత్వాన్ని క్యాన్సిల్ చేసుకోలేకపోయారు. ఫలితంగా దగ్గుబాటి వెంకటేశ్వరరావే పోటీ చేయాల్సి వచ్చింది. కానీ పరాజయం పాలయ్యారు.

అప్పట్లో పురందేశ్వరి బీజేపీలోనే ఉన్నారు. అప్పట్లో లేని అభ్యంతరం ఇప్పుడెందుకనే చర్చ… దగ్గుబాటి కుటుంబంలో జరుగుతోందని తెలుస్తోంది. పొమ్మనలేక పొగ పెడుతున్నారని… తాను రాజకీయాల నుంచి విరమించుకుంటానని దగ్గుబాటి వెంకటేశ్వరరావు చెబుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే.. కుమారుడి రాజకీయ భవిష్యత్ పైనే ఆయనఆలోచన చేస్తున్నారంటున్నారు. పురందేశ్వరి బీజేపీలో ఉంటే హితేష్ చెంచురామ్‌కు… వైసీపీలో ప్రాధాన్యం దక్కే అవకాశం లేదంటున్నారు దగ్గుబాటి వెంకటేశ్వరరావు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close