“మేఘా”లో సోదాలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక బృందం..!

మేఘా కృష్ణారెడ్డి ఇళ్లు, కార్యాలయాలపై జరుగుతున్న సోదాల విషయం ముందుగా తెలుగు రాష్ట్రాలకు చెందిన ఐటీ అధికారులెవరికీ తెలియదు. ప్రత్యేకంగా మేఘా కృష్ణారెడ్డి ఇంట్లో సోదాల కోసం ప్రత్యేకంగా ఢిల్లీ నుంచి ఓ బృందం వచ్చింది. రెండు తెలుగురాష్ట్రాలతో పాటు ఇతర చోట్ల కూడా.. కాంట్రాక్ట్ పనులు చేస్తున్న మేఘా కృష్ణారెడ్డి .. ముందస్తు పన్ను చెల్లింపుల విషయంలో పొదుపుగా ఉంటున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల దేశంలోనే అత్యంత ధనవంతులైన వారి జాబితాలో ఉన్న మేఘా కృష్ణారెడ్డి, పాపిరెడ్డిలు.. మరీ తక్కువగా ముందస్తు పన్ను చెల్లించడమేమిటన్న అనుమానాలు ఐటీ వర్గాలకు వచ్చాయి. వెంటనే ఆ మేఘా కృష్ణారెడ్డి చేపడుతున్న ప్రాజెక్టుల వివరాలు సేకరించి… ఇప్పటి వరకూ ప్రభుత్వాల నుంచి పొందిన బిల్లుల వివరాలు కూడా.., తెలుసుకుని.., అక్రమాలు జరిగినట్లుగా నిర్ధారించుకుని రంగంలోకి దిగినట్లుగా ప్రచారం జరుగుతోంది.

శుక్రవారం ఉదయం ప్రారంభమైన సోదాలు… అర్థరాత్రి దాటినా పూర్తి కాలేదు. పలు కీలకమైన లావాదేవీలకు సంబంధించి ఆధారాలు లభించడం.. వాటికి సంబంధించిన అదనపు సమాచారం… తెప్పించడంతో… అధికారులు బిజీగా ఉన్నట్లుగా తెలుస్తోంది. మెఘా కృష్ణారెడ్డికి చెందిన…దేశవ్యాప్తంగా ఉన్న ఆఫీసుల్లో సోదాలు జరిగినట్లుగా ప్రచారం జరిగింది కానీ… అలాంటిదేమీ లేదని.. ఐటీ వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్‌లోని మేఘా కృష్ణారెడ్డి ఇల్లు, ఆయన ప్రధాన కార్యాలయంలోనే మాత్రమే సోదాలు జరుగుతున్నట్లు చెబుతున్నారు. ఇందులో బయటపడే విషయాలను బట్టి.. మిగతా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి.

సాధారణంగా… ఎంతో పక్కా ఆధారాలు ఉంటే తప్ప… ప్రత్యేక బృందాలను… ఐటీ వినియోగించదు. ఇటీవలి కాలంలో మీడియా విలీనాలు.. ఎలక్ట్రిక్ బస్సుల తయారీ కంపెనీలను కొనడం వంటివి మేఘా కృష్ణారెడ్డి చేశారు. దాంతో.. ఆ లావాదేవీలపై ఐటీ శాఖ ప్రత్యేక దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. మేఘా కృష్ణారెడ్డి విషయంలో.. ఇటీవలి కాలంలో.. అనేక వివాదాలు వెలుగు చూస్తున్నాయి. టీవీ9 కొనుగోలు వ్యవహారం … పోలవరం రివర్స్ టెండర్లు ఇందులో ప్రధానంగా ఉన్నాయి. వీటిపై మేఘా కృష్ణారెడ్డి ఎప్పుడూ బహిరంగంగా స్పందించలేదు. ఇప్పుడు మాత్రం.. ఐటీ దాడులు రొటీన్ చెకప్‌నేనని మీడియాకు సమాచారం ఇస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

టీఆర్ఎస్ ఎక్కడుంది ? ఇప్పుడున్నది బీఆర్ఎస్‌ !

టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్నే బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవంగా చేసేందుకు ఆ పార్టీ శ్రేణులు సిద్ధమయ్యారు. ఎన్నికల హడావుడిలో ఉన్నందున పెద్దగా కార్యక్రమాలేమీ వద్దని పార్టీ కార్యాలయాల్లో జెండా ఎగురవేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు....

మేనిఫెస్టో మోసాలు : ఎలా చనిపోయినా రూ.లక్ష ఇస్తానన్నారే – గుర్తు రాలేదా ?

తెలుగుదేశంపార్టీ హయాంలో చంద్రన్న బీమా అనే పథకం ఉండేది. సహజ మరణం కూడా రూ. 30వేలు, ప్రమాద మరణానికి రూ. 2 లక్షలు ఇచ్చేవారు. వారికి వీరికి అని...

షర్మిల రాజకీయానికి జగన్ బెదురుతున్నారా..?

ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిలపై జగన్ రెడ్డి సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. జగన్ తనపై చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మరుసటి రోజే షర్మిలకు పోలీసులు అడ్డంకులు సృష్టించారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close