కాషాయ కండువా కప్పుకున్న ఆదినారాయణరెడ్డి..!

మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి బీజేపీలో చేరిపోయారు. కొంత కాలంగా ఆయన బీజేపీలో చేరుతారన్న ప్రచారం జరుగుతోంది. ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది. టీడీపీలో ఉన్న సమయంలో సీఎం రమేష్‌కు, ఆదినారాయణరెడ్డికి పడేది కాదు. ముందుగానే సీఎం రమేష్ బీజేపీలో చేరిపోయారు. దాంతో… ఆయనే ఆదినారాయణరెడ్డి బీజేపీలోకి రాకుండా అడ్డుకుంటున్నారని… అందుకే ఆలస్యం అవుతుందని చెప్పుకున్నారు. అనూహ్యంగా చడీచప్పుడు లేకుండా ఆదినారాయణ.. ఢిల్లీ వెళ్లిపోయి… బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా తో కండువా కప్పించేసుకున్నారు. గతంలో హైదరాబాద్ పర్యటనకు వచ్చిన నడ్డాను.. ఆదినారాయణరెడ్డి కలిశారు. పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపించారు. అప్పుడే చేరిక ఖరారయింది. సీఎం రమేష్ లాంటి నేతల అభ్యంతరాలతో కొంత కాలం వాయిదా పడింది.

కడప జిల్లాలోని జమ్మలమడుగు నియోజకవర్గంలో.. ఆదినారాయణరెడ్డి బలమైన నేతగా ఉన్నారు. అక్కడ పార్టీల కన్నా.. వర్గాలకే అత్యధిక ప్రాధాన్యం ఉంటుంది. ఓ వైపు ఆదినారాయణరెడ్డి, మరో వైపు రామసుబ్బారెడ్డి రెండు పార్టీల తరపున హోరాహోరీగా తలపడేవారు. అయితే.. మొన్నటి ఎన్నికల్లో ఇద్దరూ కలిసిపోయారు. అయినప్పటికీ… ఇద్దరికీ చేదు అనుభవమే ఎదురయింది. అది కూడా… ఇద్దరూ కలిసినా వైసీపీకి యాభై వేల ఓట్లకుపైగా మెజార్టీ వచ్చింది. ఈ క్రమంలో.. వైసీపీ ప్రభుత్వం నుంచి… ఆదినారాయణరెడ్డికి సెగ ప్రారంభమయిందని చెబుతున్నారు. అనుచరులపై దాడులు.. ఇతర కేసుల వ్యవహారంలో.. అంతకంతకూ ఒత్తిడి పెరిగిపోతూండటంతో.. రక్షణ కోసమైనా.. బీజేపీ వైపు చూడక తప్పలేదని ఆయన అనుచరులు చెబుతున్నారు.

భారతీయ జనతా పార్టీ కూడా.. రాయలసీమపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. వైసీపీని ఎదుర్కోవాలంటే… రక్షణ కావాల్సిందేనని.. ఆ రక్షణ తామిస్తామని.. టీడీపీ నేతలకు అభయమిస్తున్నారు. ఇప్పటికే ధర్మవరం టీడీపీ నేత గోనుగుంట్ల సూర్యనారాయణ అలియాస్ వరదాపురం సూరి బీజేపీ గూటికి చేరి.. ఊపిరి పీల్చుకున్నారు ఇప్పుడు.. ఆదినారాయణ రెడ్డి కూడా.. చేరారు. మరికొంత మంది నేతలతోనూ… బీజేపీ నేతలు చర్చలు జరుపుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రచారంలో పూర్తిగా వెనుకబడిన వైసీపీ – ఎటు చూసినా కూటమి !

ఏపీలో ఎన్నికలు జరుగుతున్నాయి. వైసీపీ అసలు పోటీ చేస్తుందా లేదా అన్నంత దారుణంగా డల్లు ప్రచారం జరుగుతోంది. వైఎస్ జగన్ నెల రోజుల పాటు బస్సు యాత్ర పేరుతో టైం...

నరేష్ ‘అల్లరి’కి పరీక్షా సమయం

నరేష్ 'అల్లరి' రూటు మార్చి అన్నీ సీరియస్ సినిమాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు 'ఆ ఒక్కటీ అడక్కు'తో మళ్ళీ తన అల్లరి జోన్ లోకి వచ్చారు. నరేష్ చేసిన కామెడీ సినిమాలు వరుసగా...

జగన్ అక్రమాస్తుల కేసుల విచారణకు స్పెషల్ కోర్టు !

జగన్ అక్రమాస్తుల కేసుల విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ప్రత్యేక విజ్ఞప్తిని సుప్రీంకోర్టుకు సీబీఐ చేసింది. అపిడవిట్ దాఖలు చేసింది. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ...

జగన్‌కు చేత కాదని పదే పదే సర్టిఫికెట్ ఇస్తున్న సజ్జల !

సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి సలహాదారుడు ఉంటే చాలు మట్టికొట్టుకుపోవడానికి అన్నట్లుగా మరిపోయింది వైసీపీ పరిస్థితి. టీడీపీ మేనిఫెస్టోను చూపించి జగన్‌కు చేత కాదని ఆయన ప్రచారం చేస్తున్న వైనం వైసీపీ నేతలకూ ఇబ్బందికరంగానే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close