దేవినేని అవినాష్‌పైనే అంతగా గురి పెట్టారెందుకో..?

టీడీపీ నేత, తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని అవినాష్.. ప్రతీ రోజూ…నిద్ర లేవగానే తాను పార్టీ మారబోవడం లేదని.. ప్రకటించాల్సిన పరిస్థితి వచ్చింది. ఆయన వైసీపీలో చేరుతారని.. కొంత కాలంగా… సోషల్ మీడియాలో.. విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. దేవినేని అవినాష్.. ఎంత గట్టిగా ఖండించినప్పటికీ.. అవి ఆగడం లేదు. ఒక నెల రోజులు.. సైలెంట్ గా ఉంటారు.. మళ్లీ ప్రచారం ప్రారంభిస్తారు. తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉంటాయని భావిస్తున్న కొన్ని సోషల్ మీడియా పేజీల్లోనే…ఇటీవల దేవినేని అవినాష్‌పై పార్టీ మార్పు ప్రచారం చేశారు. జగన్ తో సమావేశమయ్యారని.. మరొకటని.. విపరీతంగా ట్రెండ్ చేసేందుకు ప్రయత్నించారు. దీంతో.. అవినాష్ అసహనానికి గురవుతున్నారు. తన ఎదుగుదలను సహించలేక… పొగ పెడుతున్నారని ఆయన అంటున్నారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా… దేవినేని అవినాష్‌ను చేర్చుకునేందుకు ఆసక్తితో ఉంది. ఆ పార్టీ మైండ్‌గేమ్‌లో భాగంగానే ఇదంతా జరుగుతోందన్న ప్రచారం కూడా ఉంది. మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలనుకుంటున్న వైసీపీ…. ముందుగా పార్టీ బలోపేతంపై దృష్టి సారించింది. పార్టీ బలహీనంగా ఉన్న చోట్ల.. నేతల్ని చేర్చుకునేందుకు ప్రణాళికలు రెడీ చేసుకుంది. ఈ క్రమంలో.. విజయవాడపై దృష్టి సారించినట్లు చెబుతున్నారు. గతంలో.. కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు వైఎస్‌తో అత్యంత సన్నిహితంగా మెలిగిన దేవినేని నెహ్రూ కుమారుడు.. అవినాష్‌పై జగన్ దృష్టి పెట్టారని అటున్నారు. ఆయనను పార్టీలోకి తెచ్చేందుకు మైండ్ గేమ్.. పార్టీ మార్పు ప్రచారాలతో హోరెత్తిస్తున్నారని చెబుతున్నారు.

విజయవాడ తూర్పు నియోజకవర్గం ఇన్చార్జ్ బాధ్యతలతో పాటు… పార్టీలోనూ తగినంత ప్రాధాన్యం ఇస్తామని … ఇప్పటికే కబురు చేశారు. కానీ దేవినేని అవినాష్ మాత్రం ఎప్పటికప్పుడు… వ్యతిరేకతతోనే ఉన్నారు. ఏ మాత్రం ఆసక్తి ప్రదర్శించడం లేదు. తాజాగా.. తనపై వచ్చిన ప్రచారాన్ని కూడా అంతే ఖండించారు. కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు టీడీపీలోనే ఉంటానని ప్రకటించారు. వైసీపీపై తీవ్ర విమర్శలు చేసి తన ఉద్దేశాన్ని చెప్పకనే చెప్పారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో నాని

రాజ‌మౌళి - నాని కాంబోలో 'ఈగ' వ‌చ్చింది. అది సూప‌ర్ హిట్ అయ్యింది. మ‌ళ్లీ ఈ కాంబో కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్ష‌కులు 'ఈగ 2' ఆలోచ‌న రాజ‌మౌళికి ఉంది. కానీ...

కేసీఆర్ పై ఈసీ బ్యాన్

మాజీ సీఎం కేసీఆర్ ను ప్రచారం చెయ్యకుండా ఎన్నికల కమిషన్ నిషేధించింది. ఈరోజు రాత్రి8 గంటల నుండి రెండు రోజుల పాటు అంటే 48గంటల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుంది అని...

టీడీపీ మేనిఫెస్టోకి మరిన్ని కలిపి ఆకర్షణీయంగా ప్రచారం చేస్తున్న జగన్

టీడీపీ వాళ్లు సూపర్ సిక్స్ పథకాలపై చాలా కాలంగా ప్రచారం చేసుకుంటున్నారు. ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. వారి మేనిఫెస్టోను వారు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే వారితో పాటు జగన్ కూడా ప్రచారం చేస్తున్నారు. ...

పాన్ ఇండియా ‘సుడిగాడు’

అల్లరి నరేష్ కెరీర్ లో హిట్ సినిమా 'సుడిగాడు'. స్పూఫ్ లకు పరాకాష్టగా వచ్చిన ఆ సినిమా బాగానే నవ్వించింది. తర్వాత నరేష్ కి వరుస పరాజయాలు వచ్చాయి. ఏ సినిమా చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close