జగన్ రెండు రోజుల ఢిల్లీ టూర్ డిజాస్టర్..!

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ టూర్ డిజాస్టర్ గా మారింది. అమిత్ షాతో ఉదయం పదకొండు గంటలకు జగన్ భేటీ అయ్యారని.. దాదాపు నలభై నిమిషాల పాటు చర్చలు జరిపారని… సీఎం తరపున మీడియాకు సమాచారం వచ్చింది. విభజన అంశాలపై నివేదికలు ఇచ్చారని నిధుల విడుదల చేయాలని కోరారని.. చెప్పారు. కానీ అసలు విషయం మాత్రం వేరే అని.. తెలుస్తోంది. ఈ రోజు అమిత్ షా పుట్టిన రోజు. ఆయన వద్దకు పెద్ద ఎత్తున ప్రముఖులు వచ్చారు. శుభాకాంక్షలు తెలిపేవారు అధిక సంఖ్యలో ఉన్నారు. జగన్.. అమిత్ షా ఇంటికి వెళ్లినప్పటికీ.. శాలువా కప్పి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడమే … తప్ప… ఇతర అంశాలు మాట్లాడే అవకాశం రాలేదని… ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. వినతి పత్రం ఇచ్చి బయటకు వచ్చే సరికి.. జగన్ కు మరో షాక్ తగిలింది.

అప్పటికే ఖరారైన ఇద్దరు కేంత్రులు రవిశంకర్ ప్రసాద్, ప్రహ్లాద్ జోషి అపాయింట్‌మెంట్లు కూడా రద్దయ్యాయి. దీంతో జగన్ అసహనంతో తిరుగు ప్రయాణమయ్యారు. రవిశంకర్ ప్రసాద్, ప్రహ్లాద్ జోషీలకు అత్యవసర సమావేశాలేమీ లేకపోయినా… జగన్ అపాయింట్‌మెంట్లు ఖరారు చేసి.. రద్దు చేయడంపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. జగన్ అక్రమాస్తుల కేసుల్లో వ్యక్తిగత హాజరు మినహాయింపు కోసం… పెట్టుకున్న పిటిషన్ పై.. ఒకటో తేదీన సీబీఐ కోర్టు తీర్పు చెప్పనుంది. ఈ క్రమంలో… కేంద్రంలో పెద్దలతో సన్నిహితంగా మెలగడం ద్వారా ఎంతో కొంత అడ్వాంటేజ్ సాధించాలన్న ప్రయత్నం చేశారన్న ప్రచారం ఢిల్లీలో జరిగింది. ఈ కారణంగానే న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ అపాయింట్‌మెంట్ రద్దు చేసుకున్నారని చెబుతున్నారు.

మరో వైపు బొగ్గు శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి కూడా జగన్ అపాయింట్‌మెంట్ క్యాన్సిల్ పై స్పష్టమైన సూచనలు వచ్చాయంటున్నారు. జగన్మోహన్ రెడ్డి విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయడం వల్ల దేశవ్యాప్తంగా పెట్టుబడులు వాతావరణం దెబ్బతిన్నది. మళ్లీ పెట్టుబడిదారులకు విశ్వాసం కల్పించడానికి ప్రభుత్వం తంటాలు పడుతోంది. పీపీఏలు రద్దు చేసిన జగన్… ధర్మల్ పవర్ పెంచుకుంటామని.. అదనపు బొగ్గు ఇవ్వాలంటే జోషిని కలిసి అడగబోతున్నారు. ఇలాంటి వాటిని ప్రోత్సహించినట్లుగా అనిపిస్తే.. ఇబ్బంది ఎదురవుతుందని.. ప్రహ్లాద్ జోషి కూడా క్యాన్సిల్ చేశారని చెబుతున్నారు. మొత్తానికి జగన్ ఢిల్లీ పర్యటన రెండు రోజుల పాటు నిస్సారంగా గడిచింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంగళగిరిలో ఆకట్టుకుంటున్న నారా బ్రహ్మణి ప్రచార శైలి

నారా లోకేష్ సతీమణి మంగళగిరి నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. నారా లోకేష్ మంగళగిరిలో అందుబాటులో ఉండని సమయంలో ఆమె ప్రచారం చేస్తున్నారు. రెండు, మూడు వారాలుగా విస్తృతంగా మంగళగరిలో అన్ని వర్గాల...

కూటమి ప్రభుత్వంలో వంగవీటి రాధాకృష్ణకు కీలక పదవి !

వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ కోసం నిస్వార్థంగా ప్రచారం చేస్తున్నారు. దెందలూరు సభలో వంగవీటి రాధాకృష్ణను చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన ఏమీ ఆశించకుండా పార్టీ కోసం పని చేస్తున్నారని ఏ...

అభివృద్ధితో సంక్షేమం – టీడీపీ, జనసేన మేనిఫెస్టో కీలక హామీలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా వివరించారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన సూపర్...

ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండనుంది..ఆ సర్వేలో ఏం తేలిందంటే..?

ఏపీలో సర్వే ఏదైనా కూటమిదే అధికారమని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రైజ్ ( ఇండియన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close