చానళ్ల పునరుద్ధరణ..! అధికారంపై మీడియా విజయం..!

టీవీ5, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానళ్లను ఎంఎస్‌వోలు పునరుద్ధరించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఫైబర్ నెట్ కూడా.. ప్రసారాలు చేస్తోంది. ఇది అధికారంపై మీడియా సాధించిన విజయం. అధికారం ఉంది కదా.. అన్ని అన్ని వ్యవస్థలపై సవారీ చేస్తామని విర్రవీగడం సాధ్యం కాదని.. నిరూపించడం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన రోజునే… అదే వేదిక పై నుంచి.. వ్యతిరేక కథనాలు రాస్తే సంగతి చూస్తామంటూ హెచ్చరించారు. దానికి తగ్గట్లుగానే తర్వాతి పరిణామాలు ఉన్నాయి. పలువురు జర్నలిస్టులు దాడులకు గురయ్యారు. హత్యలు కూడా జరిగాయి. అదే సమయంలో చానళ్లను బ్యాన్ చేశారు. వ్యతిరేక వార్తలు ప్రసారం చేస్తున్నారంటూ.. టీవీ5, ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలను ఫైబర్ నెట్ ను తొలగించడమే కాకుండా.. ఎంఎస్‌వోలను బెదిరిచి మరీ… ఆ రెండు చానళ్లు రాకుండా చేశారన్న ప్రచారం జరిగింది.

మీడియాపై ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వం ప్రయత్నించిన తీరుపై.. మీడియా సంస్థలు భగ్గమన్నాయి. జర్నలిస్టులు రోడ్డెక్కారు. అదే సమయంలో.. ఆ సంస్థలన్నీ.. ఢిల్లీలోని రెగ్యులేటరీ సంస్థలకు ఫిర్యాదు చేశాయి. దీనిపై టీడీశాట్ శరవేగంగా స్పందించింది. చకచకా విచారణ జరిపింది. ప్రభుత్వం కుట్ర పూరితంగా.. ఈ చానళ్లను నిలిపివేయించిందని గుర్తించి.. దానికి తగ్గట్లుగా.. ఆదేశాలు ఇచ్చింది. తమ ఆదేశాలను లైట్ తీసుకునే ప్రయత్నం చేసిన ప్రభుత్వానికి జరిమానాతో షాక్ ఇచ్చింది. ఎంఎస్‌వోలకూ అదే తరహా ట్రీట్ మెంట్ ఎదురయింది. వారికి ఇప్పుడు జరిమానాలు పడ్డాయి. వాటిని ఉల్లంఘిస్తే… లైసెన్సులు రద్దయినా ఆశ్చర్యపోనవసరం లేదు.

దేశంలో మీడియా స్వేచ్ఛ అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో పడిందని ఏపీలోని పరిణామాలను బట్టి తెలిసిపోతోంది. మీడియా… తనకు తెలిసిన సమాచారాన్ని వెల్లడించడానికి కూడా.. భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఆధారాల్లేకపోతే కేసులు పెడతామంటూ.. ఇటీవల ఏపీ సర్కార్ ఓ జీవో తెచ్చే ప్రయత్నమే చేసింది. ఇవన్నీ.. అధికార అసహనానికి ప్రతీకలనే అభిప్రాయం… మీడియా ప్రపంచంలో ఉంది. ఇప్పుడు.. వీటిపై.. మీడియా తొలి విజయం సాధించింది. అణచివేతకు ప్రయత్నిస్తే.. అంతకు మించి.. ఎదుగుతామని.. మీడియా చెప్పకనే చెప్పింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

సంద్రానికి నిప్పెట్టిన దేవర

https://youtu.be/CKpbdCciELk?si=XoyRoPJZB05oVwwN ఎప్పుడెప్పుడా అని ఎన్టీఆర్‌ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసిన ‘దేవర’ ఫియర్ సాంగ్‌ వచ్చేసింది. రేపు (మే 20).. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా టీమ్‌ తొలి పాటను విడుదల చేసింది. పేరుగా తగ్గట్టుగానే టెర్రిఫిక్...

చోరుడు రివ్యూ : అడవి దొంగ పాయింట్ బావుంది కానీ…

స్టార్ కంపోజర్ గా కొనసాగుతూనే మరోవైపు నటునలో కూడా బిజీగా వున్నారు జీవి ప్రకాష్ కుమార్. ఇటీవల ఆయన నుంచి వ‌చ్చిన‌ 'డియర్' సినిమా నిరాశపరిచింది. ఇప్పుడు ఆయన టైటిల్ రోల్ చేసిన...

అమెరికాలో వల్లభనేని వంశీ

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అమెరికా వెళ్లారు. పోలింగ్ అయిపోయిన తర్వాత చాలా మంది వెళ్లారు కానీ.. అందరూ తిరిగి వస్తారు.. కానీ వంశీ వస్తారా లేదా అన్నది మాత్రం...

ఫాక్స్ లింక్ పరిశ్రమ తిరుపతి నుంచి చెన్నైకి జంప్ !

యాపిల్‌కు విడిభాగాలు తయారు చేసి సప్లయ్ చేసే ఫాక్స్ లింక్స్ కంపెనీ ఏపీ నుంచి తట్టాబుట్టా సర్దుకుని వెళ్లిపోయింది. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు నారా లోకేష్ ఈ పరిశ్రమను...

HOT NEWS

css.php
[X] Close
[X] Close