నాగ్ చెబుతున్నాడు..! ఒట్టు..నమ్మండి..!

బిగ్ బాస్ విజేతపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్ని నమ్మకండి. ఇంకా ఫైనల్ డే షూటింగ్ జరగలేదు.. అంటూ.. బిగ్ బాస్ -3 హోస్ట్ నాగార్జున ట్వీట్ చేశారు. ఇప్పటికే.. సోషల్ మీడియాలో … రాహుల్ సిప్లిగంజ్ విన్నరని.. హోరెత్తిపోతోంది. అందరూ ఆయనే విన్నరని డిసైడైపోయారు. దీంతో.. ఇప్పటికే అంతంత మాత్రం రేటింగ్స్‌తో సాగిన బిగ్ బాస్.. చివరి ఎపిసోడ్ కూడా.. తేలిపోతుందని భయపడ్డారేమో కానీ.. నిర్వాహకులు.., ప్రేక్షకుల్లో ఉత్కంఠ రేకెత్తించడానికి ఏకంగా నాగార్జునతోనే ట్వీట్ చేయించినట్లున్నారు. కానీ.. బిగ్ ఎలినిమిషన్స్ ప్రారంభమైనప్పటి నుండి.. సోషల్ మీడియాలో వచ్చిన వార్తల్లో.. ఒక్కటీ కూడా తప్పు కాలేదు. ఎప్పుడెప్పుడు ఎవరెవరు ఎలిమినేట్ అవుతారో.. రెండు రోజుల ముందుగానే సోషల్ మీడియాలో తెలిసిపోయింది.

ఇప్పుడు.. చాలా వరకూ.. శ్రీముఖి విన్నర్ గా నిలుస్తుందన్న ప్రచారం జరిగింది. కానీ.. చివరికి రాహుల్ సిప్లిగంజ్‌కే అత్యధికంగా ఓట్లు వచ్చినట్లుగా… ఆయనే విన్నర్ అవుతున్నట్లుగా లెక్కలతో సహా.. సోషల్ మీడియాలో పోస్టింగులు కనబడుతున్నాయి. ఆయననే విజేతగా డిక్లేర్ చేస్తూ..అందరూ అభినందనలు కూడా చెబుతున్నారు. ఈ క్రమంలో నాగార్జున ట్వీట్‌ … ఆసక్తి పెంచే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి. బిగ్‌బాస్ షోకు మొదటి నుంచి ఈ లీకుల సమస్య ఉంది. మొదటి సీజన్… పుణెలో షూట్ చేసి.. అక్కడే ఎడిట్ చేయడంతో.. లీకుల సమస్య పెద్దగా లేదు. కానీ రెండో సీజన్, మూడో సీజన్ హైదరాబాద్‌లోనే కానిచ్చేస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియో పక్క నుంచి వెళ్లేవాళ్లకి.. అక్కడ బిగ్ బాస్ వ్యవహారం నడుస్తోందని..అర్థమైపోతుంది.

ఇక సాంకేతిక సిబ్బందిలో.. అరవై శాతం తెలుగువాళ్లే.. స్థానికలే ఉన్నారు. వారిలో ఏ ఒక్కరు చిన్న సమాచారం లీక్ చేసినా.. చాలు సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. అలా లీకులు అవుతూనే ఉన్నాయి. కానీ స్టార్ మా యాజమాన్యం కట్టడి చేయలేకపోయింది. దీంతో.. షో పై ఆసక్తి కూడా తగ్గిపోయింది. గోగినేని బాబు లాంటి మాజీ కంటెస్టంట్లు కూడా.. ఇదే విషయాన్ని చెప్పారు. అన్నపూర్ణ స్టూడియో పక్క వీధిలో ఉన్న వారికే.. ఎప్పుడేం జరిగిపోతోందో తెలిసిపోతోందని.. దాని వల్ల.. ఆసక్తి ఏముంటుందని… ప్రశ్నించారు. ఇప్పుడు అదే సమస్య…నాగార్జున నమ్మవద్దని ప్రకటించినప్పటికీ.. రాహులే విజేతని.. జనం నమ్ముతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close