ప‌వ‌న్ సినిమా.. కక్క‌లేక మింగ‌లేక ప్రొడ్యూస‌ర్లు

ఇటు సినిమా – అటు రాజ‌కీయాలు.. అంటూ రెండు వైపులా ఊగిస‌లాడుతున్నాడు ప‌వ‌న్ క‌ల్యాణ్‌. త‌నెప్పుడు ఏ నిర్ణ‌యం తీసుకుంటాడో త‌న‌కే తెలీదు. స‌డ‌న్ గా మేక‌ప్ వేసుకొచ్చి ‘యాక్ష‌న్‌’ చేసినా ఆశ్చ‌ర్యంలేదు. వెంట‌నే ‘పేక‌ప్‌’ చెప్పేసినా షాక్ తినాల్సిన అవ‌స‌రం లేదు. ప‌వ‌న్ సినిమాల గురించి కొన్ని రోజులుగా వార్త‌లొస్తున్నాయి. చాలామంది ద‌ర్శ‌కుల పేర్లు వినిపించాయి. నిర్మాత‌లు రెడీ అయ్యారు. స్క్రిప్టులు పురుడుపోసుకుంటున్నాయి. ఈ సినిమాల గురించి ప‌వ‌న్ అస‌లు ఎర‌గ‌న‌ట్టే ఉన్నాడు. మ‌రోవైపు ఏపీ రాజ‌కీయాలు, అక్క‌డి స‌మ‌స్య‌ల‌తో త‌లమున‌క‌లైపోయాడు. ప‌వ‌న్ – జ‌గ‌న్ వ్య‌వ‌హారం మ‌రింత ముదురుతున్న నేప‌థ్యంలో, ప‌వ‌న్ ఇప్పుడు సినిమాలు చేసే మూడ్‌లోకి రావ‌డం చాలా క‌ష్టం.

అయితే ప‌వ‌న్ కి అడ్వాన్సులు ఇచ్చి, త‌ను త‌ప్ప‌కుండా మాకే సినిమాల చేస్తాడ‌న్న న‌మ్మ‌కంతో ఉన్న నిర్మాత‌లు స్క్రిప్టు విష‌యంలో ద‌ర్శ‌కుల్ని తొంద‌ర పెడుతున్నారు. దిల్‌రాజు, ఏ.ఎం.ర‌త్నం, మైత్రీ మూవీస్.. వీళ్లంతా ప‌వ‌న్ తో సినిమాలు చేయ‌డానికి రెడీగా ఉన్న‌వాళ్లే. వాళ్లెవ‌రు నేరుగా ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లి.. మాతో సినిమా ఎప్పుడు? అని అడ‌గ‌లేని ప‌రిస్థితి. అలా ఎవ‌రు అడిగినా, ప‌వ‌న్ రియాక్ష‌న్ ఎలా ఉంటుందో వాళ్ల‌కు తెలుసు. అలాగ‌ని ప్ర‌య‌త్నాలు మాన‌లేక‌పోతున్నారు. స‌డ‌న్‌గా ప‌వ‌న్ ఫోన్ చేసి ‘స్క్రిప్టు రెడీనా’ అంటే… అప్ప‌టికి సిద్ధంగా ఉండాలి క‌దా? అందుకే ఎవ‌రి ప్ర‌య‌త్నాల్లో వాళ్లున్నారు. ద‌ర్శ‌కుల ప‌రిస్థితి మ‌రోలా ఉంది. అస‌లు ప‌వ‌న్ మాకే సినిమా చేస్తాడ‌న్న గ్యారెంటీ ఏమిటి? ప‌వ‌న్ అడిగితే అప్పుడు చూద్దాం.. అన్న‌ట్టుంది వాల‌కం. దాంతో నిర్మాత‌లు మాత్రం చాలా స‌ఫ‌ర్ అవుతున్న‌ట్టు స‌మాచారం. సినిమాల విష‌యంలో ప‌వ‌న్ ఏదో ఓ స్ప‌ష్ట‌మైన నిర్ణ‌యం తీసుకుంటే ఆయా ద‌ర్శ‌కుల‌కు, నిర్మాత‌ల‌కు కాస్త క్లారిటీ ఉంటుంది. లేదంటే – ఈ ఊగిస‌లాట ఇలానే కంటిన్యూ అవుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రొద్దుటూరు రివ్యూ : పెద్దాయన వరదరాజుల రెడ్డికి అడ్వాంటేజ్!

ఉమ్మడి కడప జిల్లాలో వైసీపీకి ఈ సారి గతంలో ఉన్నంత సానుకూల పరిస్థితి కనిపిండం లేదు. కనీసం నాలుగు నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు ముందున్నారన్న విశ్లేషణలు బలంగా ఉన్నాయి. ప్రస్తుతం...

టీడీపీలోకి క్యూ కడుతున్న వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు

వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు టీడీపీలోకి పెద్ద ఎత్తున క్యూ కడుతున్నారు. అందరూ చంద్రబాబు, లోకేష్ సమక్షంలోనే కాదు..ఎవరు అందుబాటులో ఉంటే వారి సమక్షంలో చేరిపోతున్నారు. గుంటూరు జిల్లాలో వైసీపీ గట్టిపోటీ...

ప్రతి ఇంట్లో ఫోటో ఉండేలా పాలన చేస్తానంటే ఇలానా !?

మా పాస్ పుస్తకాలపై జగన్ ఫోటో ఏంటి అని ఓ పులివెందుల రెడ్డిరైతు భారతిరెడ్డిని ప్రశ్నించారు. ఆమె సమాధానం ఇవ్వలేకపోయింది. కానీ మనసులో అనుకునే ఉంటారు. ఎన్నికల్లో హామీ ఇచ్చారు అందుకే...

సీరం ఇన్‌స్టిట్యూట్ బీజేపీకి 50 కోట్ల విరాళం ఇచ్చిందా…కారణం ఇదేనా..?

కోవిషీల్ద్ వ్యాక్సిన్ దుష్ప్రభావాలకు కారణం అవుతుందని వ్యాక్సిన్ తయారీదారు అంగీకరించిన నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ సర్కార్ పై కాంగ్రెస్ ఎదురుదాడి ప్రారంభించింది. జర్మనీ, డెన్మార్క్, నెథర్లాండ్స్, థాయ్‌ల్యాండ్ వంటి దేశాలు ఆస్ట్రాజెనికా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close