మత ముద్రవేస్తున్నా బీజేపీని ఏమీ అనలేకపోతున్న వైసీపీ..!

ఇష్టమైనవాడి నుంచి వచ్చే దుర్వాసన కూడా సువాసనగానే అనిపిస్తుందట..! ప్రస్తుతం.. బీజేపీ నుంచి వచ్చే. తిట్లు, శాపనార్థాలు, విమర్శలు..వైసీపీ నేతలకు అలాగే అనిపిస్తున్నాయి. ఏపీ సర్కార్ కావాలని చేస్తుందో.. ప్రభుత్వ పెద్ద దృష్టిలో పడాలని కింది స్థాయి నేతలు అత్యుత్యాహానికి పోతున్నారో కానీ.. వరుసగా మత వివాదాలు చుట్టుముడుతున్నాయి. హిందూ ఆలయాల్లో అన్యమత ఉద్యోగులు, అన్యమత ప్రచారం… కలకలం రేపుతూండగానే… కొత్త కొత్త వ్యవహారాలు వెలుగు చూస్తున్నాయి. వీటిని భారతీయ జనతా పార్టీ చాలా అగ్రెసివ్‌గా హైలెట్ చేస్తోంది. ముఖ్యంగా కన్నా లక్ష్మినారాయణ.. వరుసగా ట్వీట్లు చేస్తున్నారు. పిచ్చి పరాకాష్టకు చేరిందని మండిపడుతున్నారు.

తాజాగా.. విజయవాడలో దుర్గమ్మ గుడి దిగువన ఉండే బెరం పార్కుకు శిలువతో కూడుకున్న ఏసుక్రీస్తు, మరియమాత బొమ్మలను చిత్రీకరించారు. అన్నవరం, తిరుపతి, శ్రీశైలంలో అన్యమతప్రచారం, భీమిలీ ఉత్సావాలలో మతపరమైన స్టాళ్ల ఏర్పాటు చేశారు. వీటన్నింటినీ బీజేపీ విస్తృతంగా ప్రచారంలోకి తీసుకెళ్తోంది. కనీ వైసీపీ నుంచి ఒక్కటంటే.. ఒక్క కౌంటర్ రావడం లేదు. బీజేపీ నేతల్ని ఏమన్నా.. ఆ ఎఫెక్ట్ ఢిల్లీ నుంచి కనిపిస్తుందని.. వైసీపీ అగ్రనాయకత్వం ఆందోళనతో ఉంది. అందుకే.. బీజేపీ నేతలు ఎలాంటి విమర్శలు చేసినా.. స్పందించవద్దని.. పార్టీ నేతలకు స్పష్టమైన సందేశం పంపారు. అంతే కాదు.. ఎవరైనా బీజేపీ కేంద్రనేతలు ఏపీకి వస్తే .. వారికి రాచమర్యాదలు చేస్తున్నారు. కిషన్ రెడ్డికి సన్మానం చేసి.. స్నేహం కోరుకుంటున్నామని వినయంగా విజ్ఞప్తి చేసుకోవాల్సి వచ్చింది.

అయితే.. బీజేపీ నేతలు అగ్రెసివ్ చేస్తున్న క్రిస్టియన్ ప్రచారం ప్రజల్లోకి వెళ్తోంది. జగన్మోహన్ రెడ్డి మత మార్పిళ్లకు ప్రోత్సహిస్తున్నారన్న అభిప్రాయం ప్రజల్లో ఏర్పడుతోంది. దీన్ని ఇప్పటికిప్పుడు తిప్పికొట్టలేని పరిస్థితి వైసీపీకి ఏర్పడింది. దీన్నే అడ్వాంటేజ్ గా తీసుకుని బీజేపీ మరింత దూకుడుగా వెళ్తోంది. ఈ విషయంలో వైసీపీ వ్యూహాత్మక తప్పిదం చేస్తోందన్న అభిప్రాయం ఆ పార్టీ నేతల్లో ఉంది. కానీ అగ్రనాయకత్వం అనుమతి ఇవ్వకుండా.. బీజేపీని పల్లెత్తు మాట అనే పరిస్థితి లేదు. కనీసం.. టీడీపీ నుంచి బీజేపీలో చేరిన వారిని కూడా.. ఏమీ అనలేని పరిస్థితి ఇటీవలి కాలంలో ఏర్పడింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఉత్తరాంధ్ర… ‘అధికార’ నిర్ణయాంధ్ర !

రాజకీయంగా ఎంతో చైతన్యంగా ఉండే ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర జిల్లాలు ముందు వరుసలో ఉంటాయి... ఏదో ఒక మూలకు విసిరేసినట్లు ఉన్నప్పటికీ... ఈ మూడుజిల్లాలు... నేడే కాదు, నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా......

భీమిలి… ‘గంటా’ మజిలీ!

మాజీ మంత్రి, TDP నాయకుడు గంటా శ్రీనివాసరావు... వాస్తవానికి విశాఖ జిల్లాకు వలస వచ్చిన నాయకుడే అయినా... దాదాపు పాతికేళ్ళుగా ఓటమి ఎరుగని నాయకుడుగా ఉండటంతో స్థానికుడు అయిపోయాడు. ఎన్నికలు వస్తున్నాయి అంటే......

గుండు సున్నా కావాలా.. గుండె ధైర్యం కావాలా… ఇందూరు గడ్డపై కేసీఆర్ గర్జన

ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నిజామాబాద్ రోడ్ షోలో పాల్గొన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీజేపీపై నిప్పులు చెరిగారు. నరేంద్ర మోడీ పాలనలో అచ్చేదిన్ కాదు... సచ్చేదిన్ వచ్చిందని మండిపడ్డారు. ప్రధాని మోడీ...

బటన్ల నొక్కిన డబ్బులపై వైసీపీ డ్రామా ఫెయిల్

ఏపీ లో అధికార పార్టీకి పుట్టెడు తెలివితేటలు. ఓటర్లకు తాము పంచే డబ్బులు కాకుండా పెండింగ్ పెట్టిన డబ్బులు వేయాలని అనుకున్నారు. చివరికి ఎటూ కాకుండా పోయింది. చేయూత సహా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close